-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నైతిక విలువలు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఏపీ సమాచార మంత్రి పల్లె రఘునాథ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలు ఏమైపోయినా పట్టించుకోని ఆధునిక ధృతరాష్ట్రుడని, స్వార్థపరుడని దుమ్మెత్తిపోశారు.
ఇడి అభ్యర్థనను డిస్మిస్ చేసిన సిబిఐ ప్రత్యేక కోర్టు
ఖమ్మం, ఫిబ్రవరి 26: రాష్ట్రంలో 2 కార్పొరేషన్లు, ఒక నగర పంచాయతీకి ఎన్నికలు జరుగుతున్నప్పటికీ అన్ని ప్రధాన రాజకీయ పార్టీల దృష్టి మాత్రం ఖమ్మం పైనే ఉంది. వామపక్ష పార్టీలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఖమ్మంలో గెలుపు కోసం ప్రత్యేక వ్యూహాన్ని రచించి అమలు చేస్తున్నాయి.
చిత్తూరు, ఫిబ్రవరి 26: ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి అటవీ చట్టాల్లో మార్పులు అవసరమని ఈ దిశగా చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర హోంశాఖమంత్రి చిన్నరాజప్ప తెలిపారు. చిత్తూరులో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఎర్రచందనం జాతీయ సంపదని, దీని అక్రమ రవాణా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటికే 80శాతం ఎర్రచందనం స్మగ్లింగ్ను నియంత్రించామన్నారు.
గుంటూరు, ఫిబ్రవరి 26: బాధితుల ఫిర్యాదు మేరకు రైల్వే గార్డుగా పని చేస్తున్న షేక్ మహబూబ్ బాషా ఇంటిపై శుక్రవారం సిబిఐ అధికారులు దాడులు చేశారు. స్థానిక ఏటూకూరు రోడ్డులో నివాసముంటున్న బాషా సుమారు 100 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నగదు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో దాడులు జరిగాయ. ఓ బాధితుడి నుంచి శుక్రవారం రూ.3లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్నారు.
విశాఖపట్నం, ఫిబ్రవరి 26: కులం పేరుతో దూషించడమే కాకుండా దౌర్జన్యం చేసిన కేసులో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపి హర్షకుమార్, మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ తదితరులకు విశాఖ నాలుగవ అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శుక్రవారం నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. 2004లో ఎంపిగా ఉన్న హర్షకుమార్కు విశాఖలో సన్మానం చేశారు.
విశాఖపట్నం, ఫిబ్రవరి 26: డబ్బుకోసం కుమార్తె సహా భార్యాభర్తలను హత్య చేసిన దంపతులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ విశాఖ నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి శుక్రవారం తీర్పునిచ్చారు. డబ్బు కోసం భర్తతో కలిసి సొంత కుమార్తె ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సన్యాసిరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు..
గుంటూరు, ఫిబ్రవరి 26: రాజధాని అమరావతికి సంబంధించిన ఫైనల్ మాస్టర్ప్లాన్ విడుదలైనప్పటికీ కోడ్లో పొందుపరచిన వివరాలు రైతులకు అర్థంకాక స్థానికంగా ఉన్న సిఆర్డిఎ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాలకు చెందిన సిఆర్డిఎ కార్యాలయాల వద్ద కూడా ఫైనల్ మాస్టర్ప్లాన్ కాపీలు పెట్టలేదని రైతులు ఆరోపిస్తున్నారు.
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 26: భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా పాల్గొనే బహిరంగ సభకు లక్ష మందికిపైగా హాజరయ్యే విధంగా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నట్టు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ చెప్పారు.
విశాఖపట్నం, ఫిబ్రవరి 26: ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ జిఎస్ఎన్ రాజుపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిటీ శుక్రవారం విచారణ చేపట్టింది. కమిటీ చైర్మన్ అశుతోష్ మిశ్రా, సభ్యులు విజయ్ప్రకాష్, ప్రసాదరావు ఎయు రికార్డులను పరిశీలించారు. మాజీ విసిపై మూడు రకాల ఆరోపణలు వెలువెత్తాయి.