-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
తిరుపతి, డిసెంబర్ 30: పట్టపగలు క్షణం వ్యవధిలో డ్రైవర్ను బురిడి కొట్టిచ్చి కారులో ఉన్న 29.70 లక్షల రూపాయలను గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్ళిన సంఘటన బుధవారం తిరుపతిలోని తిలక్ రోడ్డులోని శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద జరిగింది. తిరుమల నారాయణ గిరి అతిథి భవనాల మధ్య ఉన్న టిటిడికి చెందిన భవనంలో బెంగళూరుకు చెందిన ఎస్విజి గ్రూపు సంస్థ సారంగి పేరుతో హోటల్ నడుపుతోంది.
హైదరాబాద్, డిసెంబర్ 30: లైప్ ఇన్సూరెన్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను సిసిఎస్ పోలీసులకు పట్టుబడింది. దిల్లీకి చెందిన పదిమంది ముఠా సభ్యులను హైదరాబాద్ సిసిఎస్ పోలీసలు బుధవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 7.3 లక్షల నగదుతోపాటు 3 ల్యాప్టాప్లు, 11 హార్డ్ డిస్కులు, 37 సెల్ఫోన్లు, 4 డెబిట్ కార్డులు, ఒక పాన్కార్డు, 11 రిజిస్టర్లు స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడ, డిసెంబర్ 30: కరవుతో అల్లాడుతున్న రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై ఇతర వామపక్షపార్టీలతో కలసి సిపిఐ సుదీర్ఘ పోరాటానికి సమాయత్తమవుతున్నట్లు ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. అనంతపురం జిల్లాలో మంగళవారం నీటికుంటల తవ్వి కరవును మటుమాయం చేస్తామని ప్రకటించడాన్ని పూర్తిగా మోసపూరితమని అభివర్ణించారు.
హైదరాబాద్, డిసెంబర్ 30: ఏపిలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఏర్పాటు చేసే స్నాతకోత్సవాలు, వార్షికోత్సవాలు, కళాశాల దినోత్సవాలు, క్రీడాదినోత్సవాలు మొదలగు ఈవెంట్స్ను భారీ ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమాలు విద్యార్థులు జీవితాల్లో మధుర స్మృతులుగా మిగిలిపోయేలా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.
శ్రీకాకుళం, డిసెంబర్ 30: వచ్చే ఫిబ్రవరి 12, 13 తేదీల్లో శ్రీకాకుళంలో ఎన్టీవోల రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి అశోక్బాబు చెప్పారు. మహాసభలు జరగనున్న శ్రీకాకుళంలోని శివానీ కళాశాల మైదానాన్ని పరిశీలించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు.
విజయవాడ, డిసెంబర్ 30: ఇసుకను అన్ని వర్గాలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకుగాను వచ్చే ఫిబ్రవరి 1 నుంచి నూతన విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
విజయవాడ, డిసెంబర్ 30: ఆంధ్రప్రదేశ్లో అపార వనరులు, అపరిమితమైన ల్యాండ్ బ్యాంక్, సమృద్ధిగా నీరు, నిరంతర విద్యుత్ అందుబాటులో వున్నాయని, కావాల్సినదంతా కేంద్రంనుంచి సహకారమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియాతో బుధవారం సాయంత్రం విజయవాడలోని తన కార్యాలయంలో సమావేశమైన ముఖ్యమంత్రి రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ కుదేలైందని వివరించారు.
రాజమండ్రి, డిసెంబర్ 30: కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఆదేశాలకు అనుగుణంగా జనవరి 1నుండి 15వరకు రాష్ట్రంలోని నగరపాలక సంస్థల పరిధిలో ప్రత్యేక స్వచ్ఛ భారత్ నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ ప్రణాళికను సిద్ధంచేసింది. ఈ ప్రణాళికలో భాగంగా అండర్ పాస్లు, ఫ్లైఓవర్ వంతెనలు, మెయిన్ రోడ్లను శుభ్రంచేసే కార్యక్రమాలపై కమిషనర్లు దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది.
కడప, డిసెంబర్ 30: ఎర్రచందనం స్మగ్లింగ్లో పేరుమోసిన నలుగురు అంతర్జాతీయ స్మగ్లర్లను కడపజిల్లా పోలీసులు అరెస్ట్చేశారు. చైనాకు చెందిన లీమింగ్ హుయ్, చిన్పింగ్, జాంగ్క్వింగ్, హర్యానా రాష్ట్రం గుర్గావ్కు చెందిన అంజుదహియాలను కడప పోలీసులు ఉత్తరప్రదేశ్లో అరెస్టుచేసి బుధవారం కడపకు తీసుకొచ్చారు.
హైదరాబాద్, డిసెంబర్ 30: విద్యుత్ చార్జీలు పెంచేందుకు అనుమతించాలని కోరుతూ ఆంధ్రలోని రెండు డిస్కాంలు ఒకట్రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు సమర్పించనున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది నవంబర్ నెలాఖరులోపలే వార్షిక రెవెన్యూ నివేదికను డిస్కాంలు ఏపిఇఆర్సికి అందించాల్సి ఉంటుంది.