-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
తిరుపతి/ఒంగోలు/నెల్లూరు, డిసెంబర్ 2: గత 20 రోజులుగా కురుస్తున్న వర్షాలతో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు వణుకుతున్నాయి. మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే పరిస్థితి చేయిదాటే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చిత్తూరు జిల్లా తూర్పు మండలాల్లోని ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఎన్ ఎం కండ్రిగ వద్ద పొంగుతున్న వరదలో ఒక మహిళ కొట్టుకుపోయింది.
తిరుమల, డిసెంబర్ 2: హైందవ సనాతన ధర్మ పరిరక్షణ ద్వారా సమాజంలో శాంతి, సోదర భావాన్ని పంచాలని, తద్వారా ప్రపంచంలో భారత దేశానికి అగ్రస్థానం సుస్థిరం అవుతుందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు పీఠాధిపతులను కోరారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమలలోని ఆస్థాన మండపంలో బుధవారం ఉదయం ధార్మిక సదస్సు ఘనంగా ప్రారంభమయింది.
తిరుమల, డిసెంబర్ 2: తిరుమలలోని ఆస్థాన మండపంలో బుధవారం హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో ధార్మిక సదస్సు ఘనంగా జరిగింది. ఈ సదస్సులో 42మంది మఠాధిపతులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 2: మిషన్ కాకతీయ కార్యక్రమంలో రెండవ దశలో చేపట్టబోయే చెరువుల ప్రతిపాదనలను ఈ నెల 15వ తేదీకల్లా ప్రభుత్వానికి అందజేయాలని నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కె జోషి ఆదేశించారు. అలాగే మిషన్ కాకతీయ మొదటి దశలో చేపట్టిన పనులను ఎట్టిపరిస్థితుల్లో మార్చి 2016 వరకు పూర్తి చేయాలని జోషి ఆదేశించారు.
హైదరాబాద్, డిసెంబర్ 2: స్థానిక సంస్ధల కోటా నుంచి రాష్ట్ర శాసనమండలికి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలూ వ్యూహా రచనల్లో బిజీ అయ్యారు. బుధవారం నుంచే నామినేషన్ల స్వీకరణ ఆరంభమైంది. ఈ నెల 9వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు తుది గడువు. 27 పోలింగ్ జరుగుతుంది, 30న ఓట్ల లెక్కింపు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్లాల్ తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 2 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనను పూర్తిస్థాయిలో విజయవాడ నుండి చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఉత్తర్వులు (సర్క్యులర్ మెమో నెంబర్ 25735/జిపిఎం అండ్ ఎఆర్/2015, తేదీ 01-12-2015) జారీ అయ్యాయి. బుధవారం ఉదయం వరకు ఈ సర్క్యులర్ కాపీలు సచివాలయంలోని అన్ని విభాగాలలతో పాటు రాజధానిలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ (హెచ్ఓడి) లకు అందాయి.
విశాఖపట్నం, డిసెంబర్ 2: భారీ వర్షాలతో అతలాకుతలమైన చెన్నై, చుట్టు పక్కల ప్రాంతాల్లోని వరద బాధిత ప్రాంతాల్లో సహాయచర్యలకు తూర్పు నావికాదళం రంగంలోకి దిగింది. వరద బాధిత ప్రాంతాలకు విశాఖ నుంచి ఐరావత్ నౌకలో ఆహార పదార్థాలను పంపించారు. అదే విధంగా హెలీకాప్టర్ల ద్వారా సహాయచర్యలు చేపడుతున్నారు. విశాఖ, రజాలి నుంచి మూడు ప్రత్యేక బృందాలను అక్కడకు పంపినట్టు కెప్టెన్ డికె శర్మ బుధవారం విశాఖలో తెలిపారు.
తిరుమల, డిసెంబర్ 2: ఇటీవల కాలంలో హైందవ మతంపై అన్యమతస్థులు చేస్తున్న విష ప్రచారాలను, మత మార్పిడులను తిరుమలలో బుధవారం జరిగిన వేద సదస్సు తీవ్రంగా గర్హించింది. ఈ పరిస్థితులు తలెత్తకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధత కల్పించాలని, గ్రామీణ స్థాయి నుంచి హైందవ ధర్మ గొప్పతనాన్ని విస్తృతంగా ప్రజా బాహుళ్యంలోకి తీసుకువెళ్ళాలని సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది.
విజయవాడ, డిసెంబర్ 2: రెండంకెల వృద్ధితో దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ను జపాన్ తన పెట్టుబడులకు రెండో రాజధానిగా చేసుకోవాలని సిఎం చంద్రబాబు కోరారు. జపాన్ -ఆంధ్ర చేయి చేయి కలిపితే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. అంతులేని సహజవనరులు, యువ మానవ వనరులతో తూర్పు కోస్తాతీరంలో పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రం ఆంధ్ర ఒక్కటేనన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 2: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం 16మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేస్తున్న జె మురళిని పశుసంవర్థకశాఖ, మత్స్యశాఖ, డయిరీ డెవలప్మెంట్ ఎండిగా బదిలీ చేశారు. విజయనగరం జెసి రామారావును సిసిఎల్ఎ జెసిగా నియమించారు.