S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/26/2020 - 06:32

ఖమ్మం, జనవరి 25: మున్సిపల్ ఎన్నికలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీలు టీఆర్‌ఎస్ ఖాతాలోకే వెళ్ళాయి. ఖమ్మం జిల్లాలోని మధిర, వైరా, సత్తుపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం మున్సిపాల్టీలను ఈ నెల 22న ఎన్నికలు జరగగా, శనివారం కౌంటింగ్ నిర్వహించారు.

01/26/2020 - 06:12

హైదరాబాద్, జనవరి 25:ప్రజా రవాణాలో ప్రయాణికులకు భద్రతను కల్పిస్తూ సురక్షిత ప్రయాణం కోసం రాష్ట్ర ఆర్టీసీ అధికారులు భద్రతా వారోత్సవాను నిర్వహిస్తున్నారు. ఈనెల 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోల్లో రోడ్డు భద్రతా వారోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిపోల్లో ప్రయాణికు సంఘాలు, న్యాయ, పోలీస్, ఇతర ప్రముఖ వ్యక్తులను డిపోలకు ఆహ్వానిస్తున్నారు.

01/24/2020 - 06:02

హైదరాబాద్: సికింద్రాబాద్ లాలాగూడలో ఉన్న రైల్వే వర్క్‌షాపును దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. వర్క్‌షాపులోని వివిధ విభాగాలను ఆయన క్షణ్నంగా పరిశీలించారు. బోగీలకు చెందిన చక్రాలు, ఎయిర్‌బ్రెక్, కోచ్‌ల పేయింటింగ్, బోగీల స్ప్రింగ్ షాపులు, కొత్త బోగీల్లో గ్రీన్ టాయిలెట్స్ విభాగాలకు చెందిన వాటిని తనిఖీ చేశారు.
యాద్‌గిరి- ఢిల్లీ మధ్య ప్రత్యేక రైలు

01/24/2020 - 00:47

హైదరాబాద్, జనవరి 23: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా రాజధానిని రాయలసీలోనే ఏర్పాటు చేయాలని మాజీ హోంమంత్రి ఎంవీ మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలని సీఎం జగన్‌మోహన్ రెడ్డికి మైసూరా సూచించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లును శాసన మండలి సెలెక్ట్ కమిటీకి పంపించాలని నిర్ణయించడాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

01/23/2020 - 06:10

పోలవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తీసిన మట్టి డంపింగ్ కారణంగా కాలుష్య ముప్పు ఏర్పడిందని వచ్చిన ఫిర్యాదు మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) సభ్యులు సి పాల్ పాండే, ఎం మధుసూదన్ బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటించారు. మట్టి డంపింగ్ కారణంగా కాలుష్యం ముప్పు వస్తోందని ఆర్థికవేత్త పెంటపాటి పుల్లారావు చేసిన ఫిర్యాదు మేరకు వారు పర్యటించారు.

01/23/2020 - 05:04

హైదరాబాద్, జనవరి 22: మున్సిపల్ శాఖ పరిధిలోని నోటిఫికేషన్ 20/2018 ద్వారా హెల్త్ అసిస్టెంట్ పోస్టుల ఎంపికకు ప్రాధమిక జాబితాను రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ విడుదల చేసింది. 2018 డిసెంబర్ 13న నిర్వహించిన లిఖిత పరీక్ష ఆధారంగా ఈ ప్రాధమిక జాబితా రూపొందించినట్టు కమిషన్ పేర్కొంది. మొత్తం 50 పోస్టులకు 32 మంది ఎంపికయ్యారని, మిగిలిన పోస్టులకు అర్హులు లేరని పేర్కొంది.

01/23/2020 - 01:48

హైదరాబాద్, జనవరి 22: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. ప్రముఖ పిరమాల్ గ్రూప్ రాష్ట్రంలో ప్రస్తు తం ఉన్న పిరమాల్ ఫార్మా ఫెసిలిటీని రూ.500 కోట్ల వ్యయంతో విస్తరించనున్న ట్టు ప్రకటించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనడానికి

01/22/2020 - 06:16

గుంటూరు: రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులపై లాఠీఛార్జి చేయించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు జనసేన పార్టీ నిద్రపోదని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ హెచ్చరించారు. ఆడపడుచులు, అన్నదాతలు, దివ్యాంగుల ఒంటిపై పడిన దెబ్బలే వైసీపీ సర్వనాశనానికి దారితీస్తాయని మండిపడ్డారు.

01/22/2020 - 06:03

విజయవాడ, జనవరి 21: రాష్ట్ర శాసనమండలిలో ప్రభుత్వ విధానాలకు, రెండు బిల్లులకు వ్యతిరేకంగా రూల్ 71 కింద టీడీపీ ఇచ్చిన నోటీసు నెగ్గింది. చర్చకు ముందు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నోటీసు నెగ్గడంతో బుధవారం వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై చర్చ జరగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

01/22/2020 - 05:59

నెల్లూరు: జీవితంలో సమయపాలన, క్రమశిక్షణ ఎంతో అవసరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా నెల్లూరులో ఏర్పాటు చేసిన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి పాల్గొని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో కలిసి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలు అందచేశారు.

Pages