S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/22/2020 - 05:52

తిరుపతి, జనవరి 21: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక ఉచిత లడ్డూ ఇచ్చే పథకాన్ని ధర్మకర్తల మండలి ఆమోదం పొందిన అనంతరం సోమవారం 51,621 మంది భక్తులకు ఉచితంగా లడ్డూలు అందించామని టీటీడీ అదనపు ఈ ఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన తిరుమలలో విలేఖరులతో మాట్లాడుతూ భక్తులకు ఉచిత లడ్డూ అందించే పథకాన్ని సోమవారం నుంచీ అమలు చేస్తున్నామన్నారు.

01/22/2020 - 02:05

హైదరాబాద్: ఓట్లు వేసేందుకు వచ్చే ఓటర్లను గుర్తించేందుకు తొలిసారి ‘పైలట్’ ప్రాతిపదికన మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని 10 కేంద్రాల్లో డిజిటల్ విధానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ తరహా గుర్తింపు కేంద్రాలను దేశంలోనే ఇది ప్రథమమని తెలుస్తోంది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లు తమ వెంట ఓటర్ గుర్తింపు కార్డును కానీ ఇతర గుర్తింపు కార్డులను కానీ తీసుకురావలసి ఉంటుంది.

01/22/2020 - 01:28

రథసప్తమి రోజున వాహన సేవల వివరాలు
సూర్యప్రభ వాహనం : ఉదయం 5.30 నుండి 8గంటల వరకు
చిన్నశేషవాహనం : ఉదయం 9 నుండి 10గంటల వరకు
గరుడవాహనం : ఉదయం 11 నుండి 12గంటల వరకు
హనుమంత వాహనం : మధ్యాహ్నం ఒంటి గంట నుండి 2గంటల వరకు
చక్రస్నానం : మధ్యాహ్నం 2 నుండి 3గంటల వరకు
కల్పవృక్షవాహనం : సాయంత్రం 4 నుండి 5గంటల వరకు
సర్వభూపాల వాహనం : సాయంత్రం 6 నుండి 7గంటల వరకు

01/22/2020 - 01:53

విజయవాడ: అధికార, ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య శాసన మండలిలో ఎట్టకేలకు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టగలిగింది. బిల్లులను ప్రవేశపెట్టకుండా అడ్డుకోవడం.. వ్యూహ, ప్రతి వ్యూహాలతో వాడివేడిగా మండలి సమావేశం సాగింది. మండలిలో భారీగా మంత్రులు మోహరించారు. శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టేందుకు మంత్రి బుగ్గన ప్రయత్నించడాన్ని రూల్ 71 కింద నోటీసు ద్వారా టీడీపీ అడ్డుకుంది.

01/21/2020 - 23:57

నెల్లూరు, జనవరి 21: తెలుగు భాష ఎంతో ప్రాచీనమైనదని, తెలుగు భాషాభివృద్ధికి అందరూ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మంగళవారం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై తెలుగు భాషాభిమానులతో నిర్వహించిన కార్యగోష్టిలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

,
01/21/2020 - 05:23

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం జిల్లాలోని వెంకటాచలంకు ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు విచ్చేశారు. ఈ సందర్భంగా వెంకటాచలంలో ఏర్పాటు చేసిన ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని ఆయన మంగళవారం సందర్శించనున్నారు. ఇందులో భాగంగా భాషావేత్తలతో ముందస్తుగా సోమవారం నిర్వహించిన కార్యగోష్టిలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.

01/20/2020 - 06:01

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో గత ఏడాది డిసెంబర్ 26వ తేదీ నుంచి 25 రోజులపాటు చేపట్టిన అధ్యయనోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈసందర్భంగా ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపుచేసి దివ్యప్రబంధ గోష్ఠిని వివరించారు.

01/19/2020 - 06:21

నడిగూడెం: ఏజాతికైనా అస్థిత్వం ఉండాలంటే ఆ జాతి చరిత్రను ఆచరించినప్పుడే దేశం, సమాజం సుభిక్షంగా ఉంటుందని హంపీ పీఠాధిపతి శ్రీవిరూపాక్ష విద్యారణ్య భారతీస్వామి ప్రవచించారు.

01/19/2020 - 01:46

తిరుపతి, జనవరి 18: శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, ఐదు సంవత్సరాల లోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు టీటీడీ సంతృప్తికరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సామాన్య దినాల్లో వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా జనవరి 21,28వ తేదీల్లో మంగళవారం వయోవృద్ధులు (65సంవత్సరాలు పైబడిన వారు), దివ్యాంగులకు 4వేల టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది.

01/18/2020 - 15:29

హైదరాబాద్: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ మహిళలు చేస్తున్న ఆందోళనకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భార్య నారా భువనేశ్వరి మద్దతు పలికారు. వారి పోరాటం గొప్పది అని ఆమె అన్నారు. కాగా ఎన్టీయార్ వర్థంతి సందర్భంగా ఎన్టీయార్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఎన్టీయార్ ట్రస్ట్, బసవతారకం ఆసుపత్రి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తాయని అన్నారు.

Pages