S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/17/2020 - 06:36

విజయవాడ: పోలీసు యంత్రాంగం రెండు వారాల ముందు నుంచే ఎన్నిరకాల హెచ్చరికలు చేసినా, వందలాది మంది జూదరులపై బైండోవర్ కేసులు పెట్టినా భోగి, సంక్రాంతి, కనుమ మూడురోజుల్లోనూ కృష్ణా జిల్లాలో కోడి పందాలు యథేచ్ఛగా జరిగాయి. కోట్లాది రూపాయలు చేతులు మారాయి. నిర్వాహకులు ఇబ్బడిముబ్బడిగా ఏడాది పాటు తమ సరదాలు తీర్చుకునే రీతిలో అర్జించారు.

01/17/2020 - 06:14

మహానంది, జనవరి 16: రెండు తెలుగు రాష్ట్రాల్లో 71 పెద్దపులులు ఉన్నాయని ఎన్విరాన్‌మెంటల్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరజ్‌కుమార్‌ప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో46 పులులు ఉన్నాయన్నారు. కర్నూలు జిల్లా మహానంది దేవస్థానం దర్శనార్థం వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యం చాల బాగుందన్నారు. ఇక్కడే 24 పులులు ఉన్నాయన్నారు.

01/17/2020 - 00:55

విజయవాడ, జనవరి 16: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ - జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావటం తథ్యమని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. రాష్ట్రానికి బీజేపీ అవసరం ఎంతో ఉందని, ప్రధాని మోదీ అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. 2014లో మోదీతో కలిసి తాను గాంధీనగర్ వెళ్లానని గుర్తుచేశారు. అవినీతి రహిత నాయకత్వం కేంద్రంలో ఉన్నప్పుడే ఏపీకి లబ్ధి చేకూరుతుందన్నారు.

01/17/2020 - 00:52

సూళ్లూరుపేట, జనవరి 16: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన ఇస్రో ఈ ఏడాది అంతరిక్ష ప్రయోగాల్లో జీశాట్- 30తో బోణీ కొట్టేందుకు సిద్ధమైంది. దేశ ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే అత్యాధునిక జీశాట్ 30 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. దక్షిణ అమెరికా ఫ్రెంచ్‌గయానాలోని యూరోపియన్ స్పేస్ పోర్ట్ నుండి ఆ దేశానికి చెందిన ఏరియన్-5 రాకెట్ ద్వారా దీనిని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

,
01/17/2020 - 06:09

అంబాజీపేట: సంక్రాంతి పర్వదినాలలో భాగంగా కనుమ రోజు కోనసీమ ప్రభల ఉత్సవాలతో ప్రభంజనంగా మారింది. రాష్ట్రానికే తలమానికంగా తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలంలో జరిగే జగ్గన్నతోట, వాకలగరువు ప్రభల ఉత్సవాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఉదయం నుండి యువకుల కేరింతలతో ప్రభలు తీర్ధ స్థలికి చేరుకున్నాయి.

01/17/2020 - 06:14

తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి గురువారం కనుమ పండుగ సందర్భంగా పార్వేట ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రాతఃకాలారాధన పూర్తయిన తరువాత శ్రీ మలయప్ప స్వామివారు తిరుచ్చిలో వేంచేయగా ఆయన వెంట మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామి సైతం పార్వేట మండపానికి చేరుకున్నారు.

01/15/2020 - 05:44

శ్రీశైలం: శ్రీశైలంలో జరుగుతున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం భోగి రోజు స్వామి, అమ్మవార్లకు రావణవాహన సేవ నిర్వహించారు. ఉదయం యాగశాలలో శ్రీ చండీశ్వర పూజలు ఆగమశాస్తం ప్రకారం నిర్వహించారు. రుద్రహోమం , పంచావరణార్చనలు జరిపించారు. సాయంకాలం ప్రదోషకాలపూజలు హోమాలు, జపానుష్టానాలు నిర్వహించారు.

01/15/2020 - 05:42

భీమవరం, జనవరి 14: గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ ముసుగులో ఏటా నిర్వహించే కోడి పందేలు ఈ ఏడాది సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభించారు. తొలి అరగంట సేపు ఈ డింకీ పందాలే నిర్వహించారు. భోగి పండుగనాడు మధ్యాహ్నం నుంచి జోష్‌లో కోడి పందాలు పెద్దఎత్తున గోదావరి జిల్లాల్లో ఆరంభమయ్యా యి. తొలి బరి పందెమే రూ.లక్ష నుంచి ప్రారంభమయ్యాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇదే తొలి పెద్ద పందెంగా చెప్పవచ్చు.

01/15/2020 - 04:59

తిరుపతి, జనవరి 14: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం నుంచి సుప్రభాత సేవ మళ్లీ మొదలు కానుందని టీటీడీ అధికారులు చెప్పారు. డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాసం సందర్భంగా వేకువజామునే సుప్రభాసం పఠించే సమయంలో తిరుప్పావై పాశురాలను సేవాకాలం పేరిట పఠిస్తారు. ఆ సందర్భంగా సుప్రభాత సేవను నెలరోజులపాటు ఆలయంలో నిలిపివేస్తారు.

01/15/2020 - 00:18

హైదరాబాద్, జనవరి 14: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి భేటీలో గోదావరి జలాలు కృష్ణా ఆయకట్టుకు తరలించే అంశంపై ఏకాభిప్రాయం కుదరడంతో మళ్లీ ‘దుమ్ముగూడెం’ బ్యారేజి తెరపైకి వచ్చింది. ఇరు రాష్ట్రాల సాగునీటి అవసరాలు తీర్చనున్న దీనిని ఉమ్మడి

Pages