S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/14/2020 - 13:33

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు అంబరాన్ని అంటాయి. కాలనీలు, అపార్ట్‌మెంట్లు, ఇళ్ల ముందు జనం భోగి మంటలు వేసుకున్నారు. భోగి మంటలు వెలిగించి సంక్రాంతి సంబరాలకు స్వాగతం పలికారు. సంస్కృతి, సంప్రదాయాలను అనుసరించి మహిళలు భోగి మంటలు చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేస్తూ పండుగ జరుపుకున్నారు.

01/14/2020 - 05:20

భీమవరం: సంక్రాంతి పండుగ నేపధ్యంలో జరిగే కోడి పందాలకు తెలంగాణ మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా కృష్ణ, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో వీరు వారి స్నేహితులతో పందాలను వీక్షించేందుకు పర్యటించనున్నట్ల తెలిసింది.

01/14/2020 - 05:17

హైదరాబాద్, జనవరి 13: సీఏఏను వ్యతిరేకిస్తున్న పార్టీలను బీజేపీ బ్లాక్‌మెయిల్ చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ పేర్కొన్నారు. సోమవారం నాడు పాత్రికేయులతో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలూ నయా నియంతృత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని అన్నారు. కోరలు తీసిన నాగుపాము ఎంఐఎం అని ఎద్దేవా చేశారు.

01/14/2020 - 05:14

హైదరాబాద్, జనవరి 13: ఆకాశవాణి న్యూస్ రీడర్ డీ వెంకట్రామయ్య (78) సోమవారం నాడు కన్నుమూశారు. వెంకట్రామయ్య అంతిమ సంస్కారం మంగళవారం ఉదయం ఈఎస్‌ఐ శ్మశానవాటికలో జరగనుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి వెంకట్రామయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో వివిధ విభాగాల్లో వెంకట్రామయ్య సేవలను సీఎం గుర్తు చేశారు.

01/14/2020 - 04:38

హైదరాబాద్, జనవరి 12: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్‌లో సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ఫెస్టివల్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. ఈ ఫెస్టివల్ ఈనెల 15 వరకు కొనసాగుతుంది.

01/14/2020 - 01:08

హైదరాబాద్‌: ప్రగతిభవన్‌కు వచ్చిన ఏపీ సీఎం జగన్ బృందానికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి తారక రామారావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ సాదర స్వాగతం పలికారు. సీఎం జగన్, మంత్రి కేటీఆర్ ఒకే రకమైన డ్రెస్‌లో కనిపించడం విశేషం కాగా కేటీఆర్ తన కుమారుడు హిమాంశును జగన్‌కు పరిచయం చేయ గా అతనితో కరచాలనం చేశారు.
'చిత్రం...హైదరాబాద్ ప్రగతి భవన్‌లో సీఎం జగన్‌కు మంత్రి తారక రామారావు సాదర స్వాగతం

01/14/2020 - 01:04

హైదరాబాద్, జనవరి 13: గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించే అంశంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. తక్కువ సమయం, తక్కువ వ్యయంతో గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించాలని నిర్ణయించారు. గోదావరి నీటిని ఎక్కడి నుంచి తరలించాలి? ఎలా వినియోగించుకోవాలి? దీనికి సంబంధించిన మోడల్ ఎలా ఉండాలి?

01/13/2020 - 17:10

హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజు ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి కేటీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెంట ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారు. ప్రగతిభవన్‌కు వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ స్వాగతం పలికారు.

01/13/2020 - 05:50

భీమవరం: గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ మాటున జరిగే కోడి పందాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరో 24 గంటల్లో ఈ కోడి పందాలు ఆరంభమవుతాయని పందాలరాయుళ్లు ధీమాగా చెబుతున్నారు. అంతేకాదు ఈ నెల 14వ తేదీన భోగి పండుగను సెంటిమెంట్‌గా భావించి ఈ పందాలు జరపనున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయానే్న ముహూర్తాన్ని పందాల రాయుళ్లు ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

01/13/2020 - 05:36

హైదరాబాద్, జనవరి 12: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో సోమవారం నుంచి అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్‌లో నిర్వహించనుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్‌లో పాల్గొనే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని ఎర్పాట్లు చేపట్టింది. ఈ ఫెస్టివల్ ఈనెల 13 నుంచి 15 వరకు జరుగుతుంది.

Pages