-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ పై జరుగుతున్న చర్చలో పాల్గొన్నారు. రాష్ట్రానికి ఎన్నో నిధులు ఇచ్చామని విష్ణుకుమార్ రాజు చెబుతున్నారని అన్నారు. కేంద్రం నుంచి ఏపీకి ఇచ్చిన నిధుల గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు, ఏపీ నుంచి కేంద్రానికి వెళ్లిన పన్నుల గురించి కూడా చెప్పాలని ప్రశ్నించారు.
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీవీ నాటక రంగ చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో నిర్వహిస్తున్న నంది నాటకోత్సవంలో భాగంగా మంగళవారం ప్రదర్శించిన రెండు పద్య నాటకాలు ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకున్నాయి. ఉదయం 10.30 గంటలకు ఆంధ్ర సంగీత సాహిత్య నృత్య నాటక అకాడమీ ప్రదర్శించిన మోహినీ భస్మాసుర పద్య నాటకం ఆద్యంతం రసవత్తరంగా సాగింది.
నర్సంపేట, మార్చి 13: వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నగర పంచాయతీలో అధికారి ఒకరు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో నాలుగు బృందాలుగా విడిపోయి ఆపరేషన్ ప్రారంభించారు.
హైదరాబాద్, మార్చి 13: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ‘మరో చరిత్ర’ సృష్టించారు. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ సోమవారం ప్రసంగిస్తున్నప్పుడు అడ్డుకునేందుకు యత్నించిన 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సమావేశాలు ముగిసేంతవరకూ సస్పెండ్ చేయించడమే కాకుండా, ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయించారు.
హైదరాబాద్, మార్చి 13: అసెంబ్లీ, కౌన్సిల్నుంచి సస్పెండ్ చేయడం పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భగ్గుమన్నారు. 11మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్, ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు, కౌన్సిల్ నుంచి ఆరుగురు ఎమ్మెల్సీల సస్పెన్షన్తో కాంగ్రెస్ ఆందోళనలకు దిగింది.
బాపట్ల, మార్చి 13: వైకాపా అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి చేపట్టిన పాదయాత్రకు గుంటూరు జిల్లా బాపట్ల మండలంలో మంగళవారం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా జగన్కు పూలజల్లులు కురిపించారు. జగన్ తనదైన శైలిలో ఎదురుగా వచ్చిన ప్రతి ఒక్కరినీ దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా పలకరించారు. జగన్ రాకకోసం ఎదురుచూస్తున్న మహిళలు వేలాదిగా దారి పొడవునా రోడ్ల మీదికి వచ్చారు.
హైదరాబాద్, మార్చి 13: ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన సమయంలో కాంగ్రెస్ సభ్యులు విసిరిన హెడ్ఫోన్ తగిలి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి దెబ్బతగిలిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్రావు మంగళవారం శాసనసభ సమావేశంకాగానే ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
భద్రాచలం టౌన్/ నర్సంపేట/ భూపాలపల్లి, మార్చి 13: దండకారణ్యం దద్దరిల్లింది. పచ్చటి అడవిలో మరోమారు నెత్తురు చిందింది. బస్తర్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు మంగళవారం మారణహోమం సృష్టించారు. మెరుపుదాడే లక్ష్యంగా మాటు వేసి 9 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను మట్టుబెట్టారు. సీఆర్పీఎఫ్ జవానే్ల లక్ష్యంగా రహదారిపై శక్తివంతమైన మందుపాతర అమర్చిన మావోలు అదునుచూసి పేల్చేశారు.
అమరావతి, మార్చి 13: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టం 2014లోని అంశాలు, ఆనాటి ప్రధాని ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యం, వీటి విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపట్ల రాష్ట్ర శాసనసభ తీవ్ర అభ్యంతరం, నిరసన వ్యక్తం చేసింది. ఆ మేరకు శాసనసభలో తీర్మానం ఆమోదించింది. మంగళవారం సీఎం చంద్రబాబు స్వయంగా తీర్మానం చదివి వినిపించారు.
రాజమహేంద్రవరం, మార్చి 13: నన్నయ పీజీ సెట్-2018 మే 7, 8, 9 తేదీల్లో జరగనుంది. ఈ మేరకు వీసీ ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు మంగళవారం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో జరిగిన విలేఖరుల సమావేశంలో షెడ్యూల్ వెల్లడించారు. అభ్యర్థులు ఆన్లైన్లో పీజీ సెట్కు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. రాష్టవ్య్రాప్తంగా 11 సెంటర్లలో పరీక్షలు నిర్వహించనున్నారు.