మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట
Published Wednesday, 24 June 2015ములుగు, జూన్ 23: ఓటుకు నోటు ఆంశంలో ఎలాగైనా శిక్ష తప్పదనే భయంతో ఎపి సిఎం చంద్రబాబు కేంద్రాన్ని మేనేజ్చేసి సెక్షన్ 8ని తెరపైకి తెస్తున్నట్లు భారీ నీటిపారుదల శాఖామంత్రి తన్నీరు హరీష్రావు విమర్శించారు. మంగళవారం మెదక్ జిల్లా ములుగు మండల కేంద్రంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. మేనేజ్ చేయడం, మోసాలు చేయడంలో బాబును మించిన నేతలెవరూ లేరని, ఓ రాష్ట్ర సిఎంగా పనిచేసి అనుభవం ఉన్న ప్రధాని నరేంద్రమోదీ హైద్రాబాద్పై గవర్నర్ పెత్తనాన్ని ఎంతమాత్రం ఒప్పుకోరని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.