missionaries of charity

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిస్టర్ నిర్మల కన్నుమూత

కోల్‌కతా, జూన్ 23: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరీసా మరణానంతరం మిషనరీస్ ఆఫ్ చారిటీ బాధ్యతలు చేపట్టిన సిస్టర్ నిర్మల మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు. 81 సంవత్సరాల నిర్మల గత కొన్ని నెలలుగా తీవ్ర అస్వస్థతతో బాధ పడుతున్నారని, గతనెల నుంచి ఆమె పరిస్థితి మరింత విషమించిందని కోల్‌కతా ఆర్కిబిషప్ థామస్ డిసౌజా తెలిపారు. పక్షం రోజుల క్రితం తాను నిర్మలను కలిసానని, మిషనరీస్ కార్యక్రమాల గురించే ఆమె మాట్లాడారని తెలిపారు. సిస్టర్ నిర్మలకు శ్రద్ధాంజలి ఘటించడానికి సెయింట్ జాన్స్ చర్చిలో ఆయన ప్రార్థనలు నిర్వహించారు.