-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, జనవరి27: కేంద్రం ఆదేశించినా రాష్ట్రాల్లో చిత్తశుద్ధి కొరవడి ప్రత్యేక అవసరాలున్న పిల్లలతో సహా దివ్యాంగుల చదువులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.
హైదరాబాద్, జనవరి 27: సరస్వతి నది భౌగోళిక స్వరూపంపై పరిశోధనలకు పరిమితం కాకుండా ఇతిహాసంతో ముడిపడిన అంశాలపై లోతైన అధ్యయనాలు జరగాలని సరస్వతి నది పరిశోధన కేంద్రం (చెన్నై) డైరెక్టర్ డాక్టర్ ఎస్ కళ్యానరామ్ పేర్కొన్నారు. తరతరాల సరస్వతి నది అనే అంశంపై రాజేంద్రనగర్లోని టిఎస్సిఎబి ఆడిటోరియంలో ప్రారంభమైన రెండు రోజుల జాతీయ సదస్సులో శనివారం నాడు ఆయన మాట్లాడారు.
హైదరాబాద్, జనవరి 27: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్రం నుంచి రూ.15 వేల కోట్ల ఎగుమతులు తగ్గాయని సిపిఎం నేత బీవీ రాఘవులు అన్నారు. ఇక్కడ శనివారం జరిగిన సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, త్వరలో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో సంస్కరణలను మరింత వేగవంతం చేయనున్నట్లు సమాచారం ఉందన్నారు.
హైదరాబాద్, జనవరి 27: తెలంగాణలో ఎస్సీ ఉద్యోగ రిజర్వేషన్లు అమలు తీరుపై రాష్ట్ర ప్రభుత్వం శే్వతపత్రం విడుదల చేయాలని బిజెపి డిమాండ్ చేసింది. బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ‘ఎలుగెత్తిన గళం- దళిత్ అదాలత్’ పేరుతో గోడపత్రికను శనివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేశారు.
హైదరాబాద్, జనవరి 27: బాసరలోని జ్ఞాన సరస్వతీ ఆలయంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు కమిటీని నియమించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ ఎన్. శివశంకర్ పేరుతో శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
హైదరాబాద్, జనవరి 27: దివంగత ఐపీఎస్ అధికారి కె.ఎస్.వ్యాస్ పోలీస్ శాఖకు స్ఫూర్తిదాత అని పలువురు వక్తలు కొనియాడారు. ఆయన క్రమశిక్షణ, అంకితభావానికి మారుపేరు అని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు అధికారులకు ఆయన ఒక రోల్ మోడల్గా నిలుస్తారని పేర్కొన్నారు.
హైదరాబాద్, జనవరి 27: సికింద్రాబాద్లోని బైసన్పోలో మైదానంలో సచివాలయం నిర్మించాలన్న తెలంగాణ ప్రభుత్వ కల త్వరలో సాకారం కానుంది. ఈ దిశగా కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖతో జరిపిన చర్చలు తుది దశకు చేరుకున్నాయని సమాచారం. 60 ఎకరాల్లో బైసన్పోలో మైదానం విస్తరించి ఉంది. ఈ మైదానంలోనే సచివాలయం, అసెంబ్లీని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.
హైదరాబాద్, జనవరి 27: కల్వకుర్తి ప్రాజెక్టు కింద పెండింగ్లో ఉన్న పనులను వచ్చే వానాకాలం నాటికి పూర్తి చేయాలని భారీసాగునీటిపారుదల శాఖమంత్రి హరీశ్రావు చెప్పారు. శనివారం ఇక్కడ జలసౌధలో నాగర్కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న కల్వకుర్తి పనులును ఆయన సమీక్షించారు. కల్వకుర్తి ప్యాకేజీ 29,30 పనుల పురోగతి బాగుందన్నారు.
హైదరాబాద్, జనవరి 27: నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా అది టిఆర్ఎస్ ప్రమేయంతోనే జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని కర్నె ప్రభాకర్ శనివారం పార్టీ ఎమ్మెల్యే కిషోర్తో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు.
హైదరాబాద్, జనవరి 27: హైదరాబాద్లో (హైదర్గూడా) నిర్మిస్తున్న ఎమ్మెల్యేల క్వార్టర్ల నిర్మాణాన్ని రోడ్లు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం తనిఖీ చేశారు.