S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/15/2017 - 22:56

హైదరాబాద్/నేరెడ్‌మెట్, నవంబర్ 15: ఓ బాలుడి మృతికి కారకులైన మల్కాజ్‌గిరిలోని ఆనంద్‌బాగ్ బచ్‌పన్ ప్లే స్కూల్ నిర్వహకులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో మంగళవారం ఉదయం నీటి సంపులో పడి శివ రచిత్ అనే బాలుడు (3) మృతి చెందిన విషయం తెలిసిందే. మల్కాజిగిరి ఆర్‌కెనగర్‌కు చెందిన అనిల్‌కుమార్ కొడుకు శివరచిత్ ఆనంద్‌బాగ్‌లో బచ్‌పన్ ప్లే స్కూల్‌లో నర్సరి చదువుతున్నాడు.

11/15/2017 - 22:55

హైదరాబాద్, నవంబర్ 15: ఉద్యోగ నియామకాల్లో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు, లంబాడా తాండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ బుధవారం రాష్ట్ర గిరిజన హక్కుల సంఘం ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి యత్నించారు.

11/15/2017 - 04:14

కరీంనగర్, నవంబర్ 14: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పత్తి మద్దతు ధరను సవరించి, రైతులను ఆదుకోవాలని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ ప్రొ.కోదండరామ్ డిమాండ్ చేశారు.

11/15/2017 - 04:14

ఆదిలాబాద్,నవంబర్ 14: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుప్టి గుట్టల నడుమ బహుళార్ధ ప్రయోజనాలు చేకూర్చే కుప్టి జలాశయం నిర్మాణానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 744 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు అంచనాలు రూపొందించగా కడెం ప్రాజెక్టుకు బ్యాలెన్స్ రిజర్వాయర్‌గా 5.32 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో కుప్టి జలాశయం నిర్మించేందుకు త్వరలో పరిపాలన అనుమతులు జారీ చేయనున్నారు.

11/15/2017 - 04:13

రామాయంపేట, నవంబర్ 14: పాలీహౌస్, పందిరి పంటలతో రైతులకు అధిక లాభాలు ఉన్నాయని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సహకార వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కోనాపూర్ సొసైటీలో సహకార వారోత్సవాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

11/15/2017 - 04:12

గోదావరిఖని, నవంబర్ 14: రామగుండం రీజియన్‌లోని సింగరేణి ఓసీపీ-3 ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాల్లోని యువతకు కాంట్రాక్టు కంపెనీలో ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఓసీపీ-3 ప్రాజెక్ట్‌కు వెళ్లే... రహదారిపై ధర్నా చేపట్టారు. దీంతో ఓపెన్‌కాస్ట్ ఓవర్ బర్డెన్ మట్టి పనులు కొంతసేపు నిలిచిపోగా... ఓబీ రవాణా చేపట్టే వాహనాలు ఆగిపోయాయి.

11/15/2017 - 04:12

మహబూబ్‌నగర్, నవంబర్ 14: రాష్ట్ర వ్యాప్తంగా అతివృష్టి, అనావృష్టితో దాదాపు 211 మండలాల్లో కరవు వచ్చిందని వ్యవసాయ శాఖ అధికారులు లెక్కలు చెబుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అంతా బాగుందని చెప్పడం ఆయన అసమర్థతకు నిదర్శనమని బీజేపీ జాతీయ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. తక్షణమే కరవు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు.

11/15/2017 - 04:11

రామాయంపేట, నవంబర్ 14: ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో తల్లీకూతుళ్లు మృతి చెందారు. ఈ సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కాట్రియాల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ నాగార్జున్‌గౌడ్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన దాకి మల్లమ్మ (70), ఆమె కూతురు దాకి భూదవ్వ (40) తమ వ్యవసాయ పొలం వద్ద సోమవారం రాత్రి వరికుప్ప చుట్టూ పందుల కోసం కరెంట్ షాక్ పెట్టారు.

11/15/2017 - 02:08

న్యూఢిల్లీ, నవంబర్ 14: తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు నల్గొండలోని అంధుల పాఠశాలకు తప్పకుండా వస్తానని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ హామీ ఇచ్చారు. బాలలల దినోత్సవం సందర్భంగా ఈ పాఠశాలకు చెందిన అంజలి, వైష్ణవి, నాగసాయి, నితిన్, గణేష్‌చారి రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. తమ పాఠశాలను సందర్శించాలని వారు రాష్టప్రతికి విజ్ఞప్తి చేశారు.

11/15/2017 - 02:07

హైదరాబాద్, నవంబర్ 14: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చిత్తశుద్థితో కృషి చేస్తున్నప్పటికీ నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందడానికి కొన్ని పార్టీలు కుట్రపూరితంగా కోర్టులకెళ్లి అడ్డుకోవడం వల్లనే ఆలస్యం జరుగుతుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఉద్యమానికి నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్‌లైన్‌గా ఉన్నాయని మంత్రి గుర్తు చేసారు.

Pages