S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/22/2017 - 02:43

హైదరాబాద్, మార్చి 21: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముత్తారం గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ.75 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో ముత్తారంలోని సీతారామచంద్రస్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి సందర్శించారు.

03/22/2017 - 02:34

హైదరాబాద్, మార్చి 21: ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ రిటైర్డు సభ్యుల వైద్య ఖర్చు బిల్లులను జనాభా నిష్పత్తి మేరకు 58:42 పద్ధతిపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథం, జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం కె శ్రీనివాస్ అనే అడ్వకేట్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది.

03/22/2017 - 02:30

హైదరాబాద్, మార్చి 21: ఉత్తరప్రదేశ్‌లో ఆదిత్యనాథ్ యోగి తరహాలో తెలంగాణకూ యోగి రాబోతున్నారని అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. మంగళవారం అసెంబ్లీలో నీటి పారుదల శాఖ, విద్యుత్తు తదితర శాఖల పద్దుల (డిమాండ్ల)పై చర్చ జరిగింది.

03/22/2017 - 00:41

హైదరాబాద్, మార్చి 21: పదో తరగతి ఇంగ్లీషు పరీక్ష పేపర్ -1 మంగళవారం నాడు లీక్ అయిందనే వార్తలు విద్యార్థులను బెంబేలెత్తించగా, విద్యాధికారుల్లో కలకలం రేపింది. గత మూడు రోజుల నుండి పదో తరగతి పరీక్ష పత్రాలు లీక్ అవుతున్నాయనే వదంతులు వినిపిస్తున్నాయి. ఆంధ్రాలోనూ మూడు పరీక్షల పేపర్ల లీక్‌పై వదంతులు వచ్చాయి.

03/22/2017 - 00:41

హైదరాబాద్, మార్చి 21: ఆసరా పథకం కింద 35లక్షల, 56వేల, 315 మందికి పెన్షన్లు ఇస్తున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మంగళవారం శాసన సభలో గొంగిడి సునీత, కొండా సురేఖ తదితరులు అడిగిన ప్రశ్నపై ఈ సమాధానం చెప్పారు. ఏప్రిల్ ఒకటి నుంచి వంటరి మహిళకు పెన్షన్ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆసరా పథకం కింద పెన్షన్‌కు అర్హత ఉన్నవారు, బీడీ కార్మికులు దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు.

03/22/2017 - 00:40

హైదరాబాద్, మార్చి 21: తెలంగాణ రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను వివరిస్తూ నివేదిక ఇవ్వాలని ఇసుక తవ్వకాల నిరోధక రాష్ట్ర పర్యవేక్షణ కమిటీని హైకోర్టు ఆదేశించింది. ఇసుక అక్రమ తవ్వకాలపై ఎం మహేందర్ రెడ్డి దాఖలు చేసిన పిల్‌నుహైకోర్టు ధర్మాసనం విచారించింది. అనంతరం ఇసుక అక్రమ తవ్వకాలు, వీటి నిరోధానికి తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

03/22/2017 - 00:40

హైదరాబాద్, మార్చి 21: శాసన సభను మంగళవారం కోతుల సమస్య కదిలించింది. ఒక దశలో స్పీకర్ మధుసూదనాచారి సైతం జోక్యం చేసుకుని కోతుల బెడద తట్టుకోలేక తమ నియోజక వర్గంలో కొండెంగలను తీసుకు వస్తే కోతులన్నీ కలిసి కొండెంగలపై దాడి చేశాయని చెప్పారు. అధికార పక్షం సభ్యులు సైతం కోతుల సమస్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

03/22/2017 - 00:39

హైదరాబాద్, మార్చి 21: తెలంగాణ రాష్ట్రంలోని బిపిఇడి, డిపిఇడి కోర్సుల్లో ప్రవేశానికి టిఎస్ పిఇసెట్‌ను మే 15వ తేదీ నుండి నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూలును ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి మంగళవారం విడుదల చేశారు. బిపిఇడి , డిపిఇడి రెండేళ్ల కోర్సు ఉంటుందని, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను 23న జారీ చేస్తామని చెప్పారు.

03/22/2017 - 00:38

హైదరాబాద్, మార్చి 21: గజ్వేల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్, జనగాం పట్టణాలకు ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డులను మంజూరు చేసినట్టు రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం శాసన సభలో ప్రశ్నోత్తరాల్లో ఆరూరు రమేష్, శ్రీనివాస్‌గౌడ్, చింతా ప్రభాకర్ తదితరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విషయం తెలిపారు.

03/22/2017 - 00:38

హైదరాబాద్, మార్చి 21: దశల వారిగా ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీష్ మీడియంలోకి మార్చాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ విద్యా సంవత్సరం ఐదువేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టనున్నట్టు ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ప్రస్తుతం ఐదువేల పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుగుతోందని, ఈఏడాది మరో ఐదువేల పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన ప్రారంభం అవుతుందని అన్నారు.

Pages