S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/22/2017 - 00:37

హైదరాబాద్, మార్చి 21: తెలంగాణ ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టుల్లో అవినీతిని ప్రోత్సహిస్తోందని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. మంగళవారం నాడు బడ్జెట్ పద్దులపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ ప్రభుత్వం నిధులను మళ్లిస్తోందని, నలుగురైదుగురు కాంట్రాక్టర్లకు వేల కోట్లు అప్పనంగా దోచిపెడ్తోందని ఆరోపించారు.

03/21/2017 - 05:20

హైదరాబాద్, మార్చి 20: సౌదీ అరేబియాలోని అల్‌హసాలో ఉన్న అల్ హజారీ ఓవర్‌సీస్ కంపెనీలో పని చేస్తున్న 29 మంది తెలంగాణ రాష్ట్ర వాసులను ఆ కంపెనీ గత 12 రోజులుగా నిర్బంధించిందని పురపాలక, ఐటి, ఎన్‌ఆర్‌ఐ శాఖల మంత్రి కె.తారక రామారావు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసికెళ్లారు.

03/21/2017 - 05:18

హైదరాబాద్, మార్చి 20: జిఎస్‌టి అమలులోకి వచ్చిన తరువాత వాణిజ్య పన్నుల శాఖను పూర్తిగా పునర్ వ్యవస్థీకరించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. శాసన సభలో సోమవారం వాణిజ్య పన్నుల శాఖ పద్దుపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి తరఫున సమాధానం చెప్పారు. జిఎస్‌టి వచ్చిన తరువాత సిటిఓ, అసిస్టెంట్ కమిషనర్ పరిధి మారుతుందని, సెంట్రల్ ఎక్సెజ్ శాఖ పరిధి, రాష్ట్ర ప్రభుత్వ పరిధి మారుతుందని చెప్పారు.

03/21/2017 - 05:17

హైదరాబాద్, మార్చి 20: త్వరలోనే నీరా అమ్మకాలు ప్రారంభం అవుతాయని ఎక్సైజ్ శాఖ మంత్రి టి పద్మారావు తెలిపారు. శాసన సభలో సోమవారం ఎక్సైజ్ శాఖ పద్దులపై జరిగిన చర్చకు సమాధానం చెబుతూ త్వరలోనే కల్లు, నీరా పాలసీ ప్రకటించనున్నట్టు చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే మద్యం షాపులకు నిబంధనల మేరకే అనుమతి ఇస్తున్నట్టు చెప్పారు.

03/21/2017 - 05:17

హైదరాబాద్, మార్చి 20: తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టిన తర్వాత బార్లు బార్లా తెరిచారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీలో వివిధ పద్దుల (డిమాండ్ల)పై భట్టివిక్రమార్క మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు. అయితే భట్టి ప్రసంగానికి మంత్రులు పదేపదే అడ్డుపడ్డారు. బడ్జెట్‌పై భట్టి లోతుగా విమర్శించడం ప్రారంభించడంతో శాసనసభా వ్యవహారాల మంత్రి టి.

03/21/2017 - 05:16

హైదరాబాద్, మార్చి 20: వ్యవసాయం, వాణిజ్యపన్నులు, రెవెన్యూ రిజిస్ట్రేషన్లు, పౌరసరఫరాలు, ఎక్సైజ్, రవాణా, హోం, సహకారం, పశుపోషణ శాఖలకు చెందిన పద్దులకు శాసనసభ సోమవారం ఆమోదం తెలిపింది. ఈ శాఖలపై సభలో సుదీర్ఘంగా చర్చ జరిగింది.

03/21/2017 - 05:15

హైదరాబాద్, మార్చి 20: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో సాదాబైనామాల క్రమబద్ధీకరణను ఉచితంగా చేస్తామని ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ మంత్రి మహ్మద్ అలీ పేర్కొన్నారు.

03/21/2017 - 05:14

హైదరాబాద్, మార్చి 20: తెలంగాణలో కొంత మంది రేషన్ కార్డులను దుర్వినియోగం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. జి కిషన్‌రెడ్డి, డాక్టర్ కె లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ తదితరులు శాసనసభలో అడిగిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రి బదులిచ్చారు.

03/21/2017 - 03:54

కాటారం/మహదేవపూర్, మార్చి 20: ఇదేదో సినిమా స్టోరీ అనుకునేరు. కానే కాదు. సాక్షాత్తు జిల్లా అటవీ శాఖాధికారికి ముందస్తుగా అందిన సమాచారం మేరకు ఆయన ఆదేశాల ప్రకారంగా రేంజర్ తన సిబ్బందితో సమాయత్తమై వన్య ప్రాణుల వధ, రవాణా అంశాన్ని ఛేంచడానికి పయనమైన కథ! దట్టమైన దండకారణ్యంగా పేరున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మన్యంలో జరిగిన యధార్థ గాథ!

03/21/2017 - 03:51

నిర్మల్, మార్చి 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పనులను వేగవంతం చేసి ఈయేడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తిచేసి ఇంటింటికీ తాగునీటిని అందించాలని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్ అధికారులను ఆదేశించారు.

Pages