S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/21/2017 - 03:48

హైదరాబాద్, మార్చి 20: కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్టలో గల ఓ లేడీస్ హాస్టల్‌లో నగ్న దృశ్యాలు హల్‌చల్ చేస్తున్నాయి. హాస్టల్‌లోని రూమ్‌మేట్ తోటి యువతుల నగ్న ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతోంది. ఈ ఫొటోలు తీసిన విజయ అనే యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

03/21/2017 - 03:48

నిజామాబాద్, మార్చి 20: చిన్నారులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యతను విస్మరించి, అభంశుభం ఎరుగని ఓ విద్యార్థినిని (మైనర్)కి మాయమాటలు చెప్పి లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రభుత్వ ఉపాధ్యాయుడి నిర్వాకమిది. ఈ ఉదంతం బట్టబయలు కావడంతో ఆ ఉపాధ్యాయుడిపై పోలీసులు నిర్భయ చట్టంతో పాటు కిడ్నాప్, చీటింగ్ కేసులు నమోదు చేశారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

03/21/2017 - 03:47

హైదరాబాద్, మార్చి 20: పౌరసరఫరాల శాఖ 10 వేల కోట్ల రూపాయల అప్పులు ఎందుకు చేసిందని, ఆ అప్పు గురించి బడ్జెట్‌లో ఎందుకు ప్రస్తవించలేదని బిజెపి ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి ప్రశ్నించారు. శాసనసభలో సోమవారం వివిధ పద్దులపై జరిగిన చర్చలో చింతల ప్రసంగిస్తూ, రాష్ట్రాన్ని మద్యం తెలంగాణగా మార్చారని ధ్వజమెత్తారు.

03/21/2017 - 03:46

హైదరాబాద్, మార్చి 20: అర్చకులకు ట్రెజరీల ద్వారా జీతాలు చెల్లిస్తామని ప్రభుత్వం ఎన్నడూ చెప్పలేదని, అది సాధ్యం కాదని దేవాదాయ మంత్రి ఎ ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. ఒడితెల సతీష్‌కుమార్, దాస్యం వినయ్ భాస్కర్, మలిపెద్ది సుధీర్‌రెడ్డి తదితరులు సోమవారం నాడు శాసనసభ ప్రశ్నోత్తర కార్యక్రమంలో అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.

03/21/2017 - 03:46

హైదరాబాద్, మార్చి 20 : తెలంగాణలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో అక్రమాలకు బాధ్యులైన ముగ్గురు ఇన్విజిలేటర్లను, ఇద్దరు చీఫ్ సూపరింటెండెంట్లను సోమవారం నాడు విధుల నుండి తొలగించారు. ఈ ఘటనలు మినహా మొత్తం మీద పరీక్షలు ప్రశాంతగా జరిగాయని పరీక్షల కమిషనర్ సురేందర్‌రెడ్డి చెప్పారు. సోమవారం నాడు 99.6 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఆయన చెప్పారు.

03/21/2017 - 03:45

హైదరాబాద్, మార్చి 20: తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 20వ తేదీ నుండి 27వ తేదీ వరకూ పొడిగించినట్టు అర్హత పరీక్ష సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ పి యాదగిరి స్వామి తెలిపారు. 1500 జరిమానాతో ఏప్రిల్ 10 వరకూ, 2వేల జరిమానాతో ఏప్రిల్ 20 వరకూ, 3వేల జరిమానాతో మే 1వ తేదీ వరకూ దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నారు. కాగా పరీక్ష జూన్ 11న జరుగుతుందని ఆయన చెప్పారు.

03/21/2017 - 03:45

హైదరాబాద్, మార్చి 20: నిజామాబాద్ మాజీ ఎంపి కేశిరెడ్డి గంగారెడ్డి అనారోగ్యంతో సోమవారం హైదరాబాద్‌లో మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెరాస ఆవిర్భావం నుంచి తెలంగాణ ఉద్యమంలో గంగారెడ్డి మొదటి నుంచి తనకు అండగా నిలబడ్డారని ముఖ్యమంత్రి తన సంతాప సందేశంలో కొనియాడారు. గంగారెడ్డి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

03/21/2017 - 02:23

హైదరాబాద్/ ఖైరతాబాద్, మార్చి 20: గొర్రెల పెంపకానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదనడం విడ్డూరంగా ఉందని జెజెపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ స్థాయిలో వివక్ష లేకుండా అన్ని రాష్ట్రాలకు కేంద్రం సహాయం చేస్తుందని చెప్పారు. కేంద్రం నిధుల నుంచి పథకాలను అమలు చేస్తూ వాటి ప్రస్తావన చేయకపోవడం సరికాదన్నారు. కేరళ సిఎం తమ పార్టీపై తలాతోకాలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

03/21/2017 - 02:21

హైదరాబాద్, మార్చి 20: రాష్ట్ర ప్రభుత్వం మతపరమైన రిజర్వేషన్లను కల్పించే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా సందర్భంగా పోలీసులు జులుం ప్రదర్శించడాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ తప్పుపట్టారు. బిజెపి నాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడాన్ని ఆయన ఆక్షేపించారు.

03/21/2017 - 02:20

హైదరాబాద్, మార్చి 20: హెచ్‌సిఎ నిర్వహణకు బిసిసిఐ రెండు పేర్లను హైకోర్టు ముందుంచింది. ఏప్రిల్‌లో జరిగే ఐపిఎల్ మ్యాచ్‌లను సజావుగా నిర్వహించేందుకు ఈ పేర్లను ప్రతిపాదించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ న్యాయవాది గోవిందరెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన పిటీషన్‌ను విచారించింది.

Pages