-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, మార్చి 19: రాష్ట్రప్రభుత్వా లు రాష్ట్ర స్ధూల జాతీయోత్పత్తిలో వైద్య, ఆరోగ్య శాఖకు చేస్తున్న కేటాయింపుల వాటాను పెంచాలని కేంద్ర ఆరోగ్య, కుటుం బ సంక్షేమ శాఖ రాష్ట్రప్రభుత్వాలను కోరిం ది. 2025 నాటికి జిడిపిలో ఆరోగ్య, వైద్య శాఖ వాటా 1.15 శాతం నుంచి 2.5 శాతానికి పెరగాలని కోరింది. ఈ మేరకు కేంద్రం అన్ని రాష్ట్రప్రభుత్వాలకు లేఖ రాసింది.
హైదరాబాద్, మార్చి 19: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఆదివారం జరిగిన పోలింగ్లో 82.49 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 70.04శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా, గద్వాలలో అత్యధికంగా 91.13 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వనపర్తి జిల్లాలో 90.82శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
హైదరాబాద్, మార్చి 19: రాష్ట్రంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే దిశలో భాగంగా మన తెలంగాణ-మన వ్యవసాయం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2017 ఖరీఫ్ సీజన్కు ముందే రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. రైతు సదస్సులను నిర్వహించడం. రైతు శిక్షణా కేంద్రాల ద్వారా శిక్షణ, ప్రదర్శనా క్షేత్రాలు నిర్వహించడం.
హైదరాబాద్, మార్చి 19: అధికారంలోకి వచ్చి మూడేళ్ల కాలం గడిచిపోయింది, ఎన్నికలకు ఇంకా రెండేళ్ల గడువు ఉండడంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు క్రమంగా పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు. మొదటి మూడేళ్ల పాటు తెలంగాణ భవన్కు ముఖ్యమంత్రి చాలా తక్కువగా వచ్చారని, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పార్టీలో చేరిన సందర్భంలో తప్ప తెలంగాణ భవన్లో పెద్దగా కార్యక్రమాలు జరగలేదు.
హైదరాబాద్, మార్చి 19: ‘బంగారు తెలంగాణ కాదు, తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారు..’ అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం ఆదాయంపై ఆధారపడిందని ఆయన దుయ్యబట్టారు.
హైదరాబాద్, మార్చి 19: వాణిజ్య శాఖను ఆధునీకరించేందుకు రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వాణిజ్యశాఖలో వౌలిక సదుపాయాలు పటిష్ఠం చేసేందుకు రూ.5కోట్లు, చెక్పోస్టుల ఆధునీకరణకు కోటి, చెక్పోస్టుల నిర్మాణం, ఇతర సదుపాయాలకు రూ.2.25కోట్లు, జిఎస్టిపై సిబ్బందికి శిక్షణ, కొత్త సాఫ్ట్వేర్కు రూ.5కోట్లను రాష్ట్రం 2017-18లో కేటాయించింది. రాష్ట్రప్రభుత్వం వచ్చే ఏడాది రాష్ట్రంలో అమ్మకం పన్నుల ద్వారా రూ.
హైదరాబాద్, మార్చి 19: కేరళ ముఖ్యమంత్రి విజయన్ రాకను నిరసిస్తూ ఎబివిపి కార్యకర్తలు ఆర్టీసి కళ్యాణమంటపం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కేరళలో ఎబివిపి కార్యకర్తలపై కేరళ సిపిఎం, ఎస్ఎఫ్ఐ హత్య లు, దాడులకు పాల్పడడాన్ని నిరసిస్తూ ఆదివారం ఆర్టిసి కళ్యాణ మండపం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
హైదరాబాద్, మార్చి 19: నకిలీ నోట్ల చలామణికి హైదరాబాద్ హబ్గా మారింది. నెల రోజుల వ్యవధిలో వివిధ కేసుల్లో 10 మంది నిందితులను హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. కొత్త కరెన్సీ 2 వేలు, 500 నోట్లను జిరాక్స్ కాపీలతో నకిలీ నోట్లు తయారు చేసి వాటిని చలామణిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్, మార్చి 19: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలనాపరంగా వస్తున్న మార్పులు, శాంతిభద్రతల పరిరక్షణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా పరిపాలనలో కీలకమైన పోలీసు శాఖ, అంతర్గతంగా ఉన్న నిఘా విభాగాలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రప్రభుత్వం వచ్చే ఏడాది బడ్జెట్లో శాంతిభద్రతల పరిపాలన నిమిత్తం రూ. 4890 కోట్లను కేటాయించింది.
హైదరాబాద్, మార్చి 19: స్థిర, చరాస్థుల క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్ విధానంలో తెలంగాణ ప్రభుత్వం అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దస్తావేజులు, భూ రికార్డులను శాశ్వతంగా భద్రపరచడానికి డిజిటలైజేషన్ ఆఫ్లికేషన్ను రూపొందించింది. దీంట్లో భాగంగా ‘పబ్లిక్ డాటా ఎంట్రీ సిస్టమ్’తో పాటు ’సప్త సేవలు’ పేరిట మరికొన్ని సేవలను అమలు చేస్తోంది.