-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
ఉప్పల్/ హైదరాబాద్, మార్చి 16: తెలంగాణ రాష్ట్రంలో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిస్తామని హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు.గురువారం శాసన మండలిలో అధికార పార్టీ సభ్యులు రాములు నాయక్, పల్లా రాజేశ్వర్రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దిశగా పలు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
హైదరాబాద్, మార్చి 16: తెలంగాణ రాష్ట్రంలోని బిసి వర్గాలకు చెందిన అభ్యర్థులు ఎవరైనా బ్యాంకు ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఉద్యోగాలకోసం దరఖాస్తు చేసుకుంటే వారికి ఉచితంగా బిసి స్టడీ సర్కిల్లో శిక్షణ ఇస్తామని వెనుకబడిత తరగతుల సంక్షేమ శాఖ కమిషనర్ ప్రకటించారు.
హైదరాబాద్, మార్చి 16: శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం మండలి సమావేశంలో అధికార పార్టీ సభ్యుడు పురాణం సతీష్కుమార్, కాంగ్రెస్ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, ఉప నేత పొంగులేటి సుధాకర్రెడ్డిల మధ్య నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించి జరిగిన వాదనల్లో భాగంగా సతీష్కుమార్ మాట్లాడుతూ గత పాలకులు అంటూ వ్యాఖ్యానించటంతో సుధాకర్రెడ్డి జోక్యం చేసుకుని ఇప్పటి వరకు నాలుగు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది మీ
హైదరాబాద్/ముషీరాబాద్, మార్చి 16: తెలంగాణ రాష్ట్రంలో అంతరిస్తున్న హస్తకళలకు పూర్వవైభవం తెస్తానని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ బొల్లం సంతోష్కుమార్ గుప్తా హామీనిచ్చారు. ఆర్టీసి క్రాస్రోడ్లోని హస్తకళాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఆయన సంస్థ చైర్మన్గా లాంఛనంగా భాద్యతలు స్వీకరించారు. తెలంగాణ హస్తకళలలను దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెస్తానన్నారు.
హైదరాబాద్, మార్చి 16: విద్యుత్ సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.4306 కోట్ల నిధులు కేటాయించడంతో, తెలంగాణ డిస్కంలు టారిఫ్ ప్రతిపాదనలు రూపొందిస్తున్నాయి. నిర్ణీత గడువులోగా టారిఫ్ ప్రతిపాదనలు ఇవ్వడంలో విఫలమైన డిస్కంల చర్యతో సుమోటోగా టారిఫ్ను ఖరారు చేస్తామని ఇప్పటికే తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ప్రకటించిన విషయం విదితమే.
హైదరాబాద్, మార్చి 16: ఆర్థిక మంత్రి ఈటల ప్రవేశపెట్టింది సంక్షేమ బడ్జెట్ అంటూ ప్రచారం చేసుకోవటమే తప్ప అందుకు తగ్గట్టు చర్యలు మాత్రం తీసుకోవడం లేదని బిసి సంక్షేమం సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య అన్నారు. బిసిల కేటాయింపులపై పునరాలోచన చేయాలని, బిసిలు చేసిన పాపం ఏమిటని నిలదీశారు. బిసిలకు ఒక పారిశ్రామిక విధానాన్ని ప్రకటించాలన్నారు.
హైదరాబాద్, మార్చి 16:ఐటిడిఎలకు ఐఎఎస్లను నియమించాలని సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రభుత్వాన్ని కోరారు. బడ్జెట్పై గురువారం శాసన సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు ఐటిడిఎలకు ఐఎఎస్లు ఉండేవారని, వారిని కలెక్టర్లుగా నియమించిన తరువాత ఐటిడిఎల పాలన గాలికి వదిలేశారని చెప్పారు.
హైదరాబాద్, మార్చి 16: తెలంగాణలో పదో తరగతి ప్రధానపరీక్షలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. అయితే ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షకు అనుమతించేది లేదన్న అధికారులు ఆ నిబంధనను కొద్దిగా సడలించి ఐదు నిమిషాల వరకూ రాయితీ కల్పించారు. పరీక్షల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశామని పరీక్షల బోర్డు కమిషనర్ డాక్టర్ సురేందర్రెడ్డి గురువారం నాడు చెప్పారు.
హైదరాబాద్, మార్చి 16: ఈ వేసవిలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు చేరుకొని వడగాడ్పులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.
భూదాన్ పోచంపల్లి, మార్చి 15: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కుల గ్రామం పోచంపల్లి చేనేత పార్కును బుధవారం తెలంగాణ చేనేత అంబాసిడర్, సినీ నటి సమంత సందర్శించారు. చేనేత మగ్గాలు, రంగుల అద్దకం, నూ లు వడకడం, వస్త్రాల తయారీ విధానాన్ని ఆమె పరిశీలించారు. కార్మికుల జీవన స్థితిగతులు, వస్త్రాల నేతతో వారికి అవుతున్న ఖర్చులు, ఆదాయంపై ఆమె వారిని అడిగి తెలుసుకున్నారు.