-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, డిసెంబర్ 10:నగదు రహిత కార్యకలాపాల్లో భాగంగా సకల హంగులతో తెలంగాణ ప్రభుత్వం టి- వాలెట్ను సిద్ధం చేసింది. నగదు రహిత కార్యకలాపాల్లో వేగం పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో టి- వాలెట్ ముందడుగు అని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. ఒక రాష్ట్రం సొంతంగా వాలెట్ రూపొందించడం దేశంలో ఇదే మొదటి సారి అని చెప్పారు.
చట్టపరమైన చిక్కులకు ఇక చెక్ ప్రైవేటు వర్శిటీల ఏర్పాటుపై ఉప సంఘం
నగదురహిత కార్యకలాపాలపైనా సబ్ కమిటీ బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకు
పనిభారం లేని శాఖల నుంచి సిబ్బందికి కదలిక ఇతర శాఖల్లో సర్దుబాటుకు యోచన
మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు ఇబ్రహీంపూర్కు ప్రధాని ప్రశంస: కెసిఆర్
హైదరాబాద్/ గచ్చిబౌలి, డిసెంబర్ 10: జిహెచ్ఎంసి శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని నానక్రాంగూడలో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం శిథిలాల తొలగింపుశనివారం ఉదయం వరకు కొనసాగింది. మృతదేహాల వెలికితీత ఉదయం 4 గంటకు పూర్తయింది. అప్పటి వరకు పురపాలక శాఖ మంత్రి కెటిఆర్, రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి సంఘటనా ప్రదేశంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
హైదరాబాద్, డిసెంబర్ 9: నానక్రాంగూడలో అనుమతి లేకుండా ఏడు అంతస్తుల మేడ కూలిపోయిన ఘటనకు రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారక రామారావు నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజీనామా చేసి తన నైతికతను చాటుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 9: బ్యాంకుల ముందు చాంతాడంతో క్యూలు కనిపిస్తుంటాయి. కానీ ఈ బ్యాంకు క్యూలో ఉన్నది కొద్ది మందే అని ఉత్సాహంగా వెళ్లిన వారికి నిరుత్సాహం తప్పడం లేదు. బ్యాంకుకు వెళ్లగానే సారీ సర్వర్ డౌన్.. ఎప్పుడైనా పని చేస్తుందనే నమ్మకంతో వీళ్లు క్యూలో నిలబడ్డారు. ఆసక్తి ఉంటే మీరూ నిలబడండి అనే సలహా వినిపిస్తోంది. ఇది అల్వాల్లోని ఎస్బిహెచ్ బ్యాంకు పరిస్థితి.
వరంగల్, డిసెంబర్ 9: వరంగల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకుని పారిపోయిన ఖైదీ రాజేశ్ యాదవ్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. శుక్రవారం మట్వాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కమిషనర్ సుధీర్బాబు రాజేశ్యాదవ్ను మీడియా ముందు ప్రవేశపెట్టారు.
వరంగల్, డిసెంబర్ 9: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయని, కనీసం టాయిలెట్లు కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో కెసిఆర్ ప్రభుత్వం ఉందని టి-టిడిపి కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కానీ కొత్తగా క్యాంపు కార్యాలయం పేరిట ముఖ్యమంత్రి కట్టించుకున్న నివాస భవనంలోని తన బాత్రూంను బుల్లెట్ ప్రూఫ్ చేయించుకున్నారని ఆరోపించారు.
హైదరాబాద్, డిసెంబర్ 9: పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాల వల్ల గణనీయంగా పడిపోయిన రాష్ట్ర ఆదాయం నేపథ్యంలో ప్రభుత్వ పంథాను ఏ విధంగా మార్చుకుందామనే అంశాన్ని మంత్రి వర్గ సహచరుల ముందు ముఖ్యమంత్రి చర్చకు పెట్టబోతున్నారు. నోట్ల రద్దు వల్ల తగ్గిన రాష్ట్ర ఆదాయాన్ని పూడ్చుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి. అలాగే వృధా ఖర్చులు ఎక్కడెక్కడా ఉన్నాయి? వాటిని ఏ విధంగా అరికడుదాం?
హైదరాబాద్, డిసెంబర్ 9:పెద్ద నోట్ల రద్దు వల్ల డబ్బున్న పెద్ద వాళ్లకే ఇబ్బందులు అని గ్రామీణ ప్రజలు తొలుత భావించారని, కానీ పెద్దలు బాగానే ఉన్నారు, కానీ సమస్యలన్నీ సామాన్యులకే కలుగుతున్నాయని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. అవసరం అయిన కరెన్సీ అందుబాటులో లేక పోవడం వల్ల గ్రామీణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు , ఆర్బిఐ దీనిపై దృష్టిసారించారని, డబ్బుల పంపిణీ వేగవంతం చేయాలని సూచించారు.
హైదరాబాద్, డిసెంబర్ 9: సార్వత్రిక ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ ఇచ్చిన హామీల్లో ఏ మేరకు అమలు చేశారో బహిరంగంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారా? అని కాంగ్రెస్ నాయకుడు, శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ రాష్ట్ర మంత్రి టి. హరీష్ రావును ప్రశ్నించారు. మంత్రి హరీష్ రావుకు అసహనం ఎందుకని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు. టిఆర్ఎస్ 182 హామీలు ఇచ్చిందని ఆయన చెప్పారు.