-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, డిసెంబర్ 4: ఆదాయపు పన్ను శాఖ అధికారులమని చెప్పి ఓ వ్యక్తి నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లిన ముఠాను లంగర్హౌజ్ పోలీసులు అరెస్టు చేశారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వికారాబాద్కు చెందిన మహమ్మద్ సల్మాన్ పాషా నోట్లు మార్చుకోవడానికి గత నెల 25న నగరానికి వచ్చాడు. వరుసకు అన్న అయిన షరియార్ ఇంట్లో ఉంటూ, 26న రూ. 9.20లక్షలు తన స్నేహితుల వద్ద మార్పిడి చేసుకున్నాడు.
చౌటుప్పల్, డిసెంబర్ 3: అమెరికాలో స్థిరపడిన ప్రవాసభారతీయుడు దీపక్కాంత్ వ్యాస్కు చెందిన కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కాజేసేందుకు కొంతమంది కనే్నశారు. నకిలీ పత్రాలు తయారు చేసి రికార్డులను మార్చివేసి వెంచర్ వేసేందుకు పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న దీపక్కాంత్ వ్యాస్ ఇక్కడి చేరుకొని ఫిర్యాదు చేయడంతో డొంక కదిలింది.
నల్లగొండ, డిసెంబర్ 3: పెద్ధనోట్ల రద్ధు పిదప శనివారం తెల్లవారుజాము నుండి మళ్లీ టోల్ టాక్స్ వసూళ్లు చేస్తుండటంతో వాహనాదారులకు మళ్లీ ‘చిల్లర’ కష్టాలు మొదలయ్యాయ. దీంతో టోల్ ప్లాజాల వద్ధ పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచి పోయాయి. తొలిసారిగా స్వైప్ మిషన్లు వాడినా, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా టోల్టాక్స్ చెల్లింపులు ప్రవేశపెట్టినా టోల్ఫ్లాజాల వద్ధ సమస్యలు మాత్రం తీరలేదు.
నల్లగొండ, డిసెంబర్ 3: నాగార్జున సాగర్ ఎడమకాలువకు డిసెంబర్ 1నుండి నీటి విడుదల చేస్తామంటు తెలంగాణ ప్రభుత్వం ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ మేరకు కృష్ణా నది యాజమాన్య బోర్డు నుండి అనుమతి లభించకపోవడంతో నీటి విడుదలపై ప్రతిష్టంభన నెలకొంది.
భద్రాచలం, డిసెంబర్ 3: చత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పిఎల్జిఏ వారోత్సవాలు హింసాత్మకంగా మారాయి. నక్సల్స్ వారోత్సవాలు విజయవంతం చేయాలంటూ కరపత్రాలు, బ్యానర్లు ఏర్పాటు చేసి వాటి కింద ప్రెషర్ బాంబులు పెడుతున్నారు.
వరంగల్, డిసెంబర్ 3: జిల్లాలలో పాలనావ్యవహారాలు సజావుగా సాగేందుకు, సమస్యలు సత్వరంగా పరిష్కరించేందుకోసం రెవెన్యూ అధికారులకు 15 రోజుల్లో ల్యాప్టాప్లు అందచేస్తామని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. అదే విధంగా రాష్టవ్య్రాప్తంగా తహశీల్ధార్లకు వాహన సదుపాయం కల్పించే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు.
హైదరాబాద్, డిసెంబర్ 3: తెలంగాణ జైళ్లశాఖ జైళ్లకు పటిష్ట భద్రతకు చర్యలు చేపట్టింది. ప్రధానంగా జైళ్లలో సిసి కెమెరాల ఏర్పాటుకు నడుం బిగించింది. గత నెలలో మధ్యప్రేశ్లోని భోపాల్ జైలు నుంచి టెర్రరిస్టులు పారిపోవడం, పంజాబ్లోని నభ జైలు నుంచి ఖైదీలు పారిపోయిన నేపథ్యంలో తెలంగాణలో జైళ్ల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు జైళ్ల శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
హైదరాబాద్, డిసెంబర్ 3: భారతీయ జనతా పార్టీ దేశద్రోహులకే వ్యతిరేకమని, ముస్లింలకు కాదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. బిజెపి రాష్టక్రార్యాలయంలో మైనార్టీ మోర్చ అధ్యక్షుడిగా అఫ్సర్ పాషా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముస్లింల ట్రిపుల్ తలాఖ్ , రిజర్వేషన్ల విషయంలో బిజెపికి స్పష్టమైన వైఖరి ఉందని అన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 3: ‘పెద్ద నోట్ల రద్దుతో తెలంగాణకు ఊహించని దెబ్బ తగిలింది. ఆదాయం గణనీయంగా తగ్గింది’ అని ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 3: యూనివర్శిటీలు ఎప్పటికపుడు మారాలని, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా కొత్త కోర్సులను ఆఫర్ చేయాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. సబ్జెక్టు టీచర్ల కోసం ప్రిన్సిపాల్స్ కోసం కోర్సులు నడపవద్దని, వాటిని మూసేసి, విద్యార్ధులకు అవసరమై కోర్సులు నడపాలని అన్నారు. తెలంగాణలోని 11 యూనివర్శిటీల్లో ప్రమాణాలు, ఫలితాలు పెరగాలని కోరారు.