S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/04/2016 - 04:42

హైదరాబాద్, డిసెంబర్ 3: విద్యుత్ శాఖకు చెంది ఉద్యోగులు తలపెట్టిన సమ్మెను శనివారం ఉపసంహరించుకున్నారు. రాష్ట్ర విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి వద్ద జరిగిన చర్చలు ఫలించాయి. విద్యుత్ శాఖకు చెందిన ఉద్యోగుల సమస్యలపై 13 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మంత్రితో చర్చించారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను దశలవారీగా క్రమబద్దీకరించేందుకు మంత్రి అంగీకరించారు. చర్చల తర్వాత మంత్రి స్వయంగా ఈ విషయం వెల్లడించారు.

12/04/2016 - 04:17

మోత్కూరు, డిసెంబర్ 3 : తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంత్‌చారి తెలంగాణ రాష్ట్ర సాధనకు చేసిన త్యాగం చిరస్మరణీయమని, చరిత్రలో నిలిచిపోతుందని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ, కార్మిక శాఖామంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లాలోని శ్రీకాంత్‌చారి స్వగ్రామం పొడిచేడు గ్రామంలో శ్రీకాంత్‌చారి 7వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.

12/04/2016 - 04:15

హైదరాబాద్/వనస్థలిపురం, డిసెంబర్ 3: ప్రపంచంలోనే అబద్ధాల పుస్తకమంటూ ఏదైనా ఉందంటే అది కేసిఆర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టిన ఎన్నికల మేనిఫెస్టో మాత్రమేనని రాష్ట్ర టిడిపి కార్యనిర్వహణ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

12/04/2016 - 04:14

హైదరాబాద్, డిసెంబర్ 3: ‘ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి..తెలంగాణను సాధించాం..మన తెలంగాణను మనమే పాలిస్తాం..మనమే ప్రజాస్వామిక తెలంగాణను సాధిస్తాం’ అని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం స్పష్టం చేశారు. సెర్చ్ వారెంట్ లేకుండా ప్రజాగాయని విమలక్క అరుణోదయ సాంస్కృతిక మండలి కార్యాలయంలో సోదాలు నిర్వహించటమే కాకుండా సాధారణ పుస్తకాలను స్వాధీనం చేసుకుని సీజ్ జేయటం దుర్మార్గమన్నారు.

12/04/2016 - 04:14

హైదరాబాద్, డిసెంబర్ 3: హైదరాబాద్ పోస్ట్ఫాసుల్లో నగదు మార్పిడి, అవకతవకలపై సిబిఐ దృష్టి సారించింది. నగరంలోని ఏడు పోస్ట్ఫాసుల్లో అక్రమంగా నగదు మార్పిడి జరిగినట్టు శనివారం సిబిఐ గుర్తించింది. గోల్కొండ, సనత్‌నగర్, ఆబిడ్స్ జనరల్ పోస్ట్ఫాస్, పంజగుట్ట, హిమాయత్‌నగర్, నారాయణగూడ పోస్ట్ఫాసుల్లో దాదాపు పది కోట్ల మేరకు నగదు మార్పిడి జరిగినట్టు సమాచారం.

12/04/2016 - 04:10

హైదరాబాద్, డిసెంబర్ 3: తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ మోసం చేసే వారిని వెంటాడి, వేటాడి పట్టుకోవాల్సిన పోలీసులే ఓ రాజకీయ నేతతో కుమ్మక్కై తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ వ్యాపారులను మోసగించిన సంఘటన హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బంజారాహిల్స్ పరిధిలోని కాంగ్రెస్ నేత ఒకరు తక్కువ ధరకే బంగారం ఇస్తానని వ్యాపారులకు ఆశ చూపాడు.

12/04/2016 - 04:09

హైదరాబాద్/ఖైరతాబాద్, డిసెంబర్ 3: నోట్ల మార్పిడి కేసులో ఓ పోలీస్ అధికారి సహా ముగ్గురు కానిస్టేబుళ్లను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే... బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి అనుచరుడు తిరుమలేష్ నాయుడు పాత నోట్లకు బదులు కొత్త నోట్లు ఇస్తే 20 శాతం కమీషన్ ఇస్తామని ఆశ చూపాడు.

12/04/2016 - 04:08

హైదరాబాద్, డిసెంబర్ 3: పెద్ద నోట్ల రద్దు వ్యవహారం నవ్వులాటగా మారిందని ఎఐసిసి అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వి విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని క్యాష్‌లెస్ కాదు జాబ్ లెస్‌గా మారుస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. శనివారం హైదరాబాద్‌కు వచ్చిన అభిషేక్ సింఘ్వి గాంధీభవన్‌లో టి.పిసిసి అధ్యక్షుడు ఎన్.

12/04/2016 - 04:07

సిద్దిపేట, డిసెంబర్ 3: టిఆర్‌ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హామీల అమలుకోసం కాంగ్రెస్ నేతలు ఈనెల 5న దీక్ష చేస్తామని ప్రకటించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. టిఆర్‌ఎస్ పై విమర్శలు చేయడం సూర్యుని మీద ఉమ్మివేయడమేనన్నారు.

12/04/2016 - 04:06

హైదరాబాద్, డిసెంబర్ 3: హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ, దృష్టి మళ్లించడం, రాగి చెంబులో డబ్బు పెడితే ధనం పెరుగుతుందంటూ అమాయక ప్రజలను మోసగిస్తున్న బెంగళూరు ముఠాను శనివారం సౌత్‌జోన్ పోలీసులు అరెస్టు చేశారు. రెయిన్ బజార్ పోలీసుల అదుపులో నలుగురు ముఠా సభ్యులు ఉండగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు డిసిపి వి సత్యనారాయణ తెలిపారు. నిందితుల నుంచి రూ.

Pages