-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, అక్టోబర్ 24: సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో సోమవారం జరిగిన కవాతు వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన వంద అడుగుల స్తంభంపై వంద అడుగుల జాతీయ జెండాను పోలీస్ అకాడమీ డైరెక్టర్ అరుణ బహుగుణ ఆవిష్కరించారు. ఈ జెండా స్తంభం ఎత్తు సముద్ర మట్టానికి సుమారు 620.89 మీటర్లు, 109 టన్నుల బరువు ఉంది. ఈ జెండా నిరంతరం ఫ్లడ్ లైట్ల వెలుగులో ఉంటుంది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 24: తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు డిసిసి అధ్యక్షులను నియమించటంలో బిసి, ఎస్సి, ఎస్టి వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుకోరారు. ఈమేరకు పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దిగ్విజయ్సింగ్కు సోమవారం విహెచ్ లేఖ రాశారు.
హైదరాబాద్, అక్టోబర్ 24: సచివాలయం కూల్చివేతపై ప్రభుత్వం వేగం పెంచింది. ప్రస్తుత సచివాలయంలోని కార్యాలయాలను వచ్చే నెల 4వ తేదీ వరకు ఇతర కార్యాలయాల్లోకి తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు. సచివాలయం తరలింపు అంశంపై రాజీవ్ శర్మ ముందు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుతో సోమవారం చర్చించారు.
సిద్దిపేట, అక్టోబర్ 24: రాజధానిలో బ్రాహ్మణులకు ప్రత్యేక సదనం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఇటీవల ప్రకటించడంతో ఇందుకు అవసరమైన స్థలాన్ని ఇచ్చేందుకు సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందిన బండారు కుటుంబం ముందుకొచ్చింది. సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం జరిగిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో వారు కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, జెసి హన్మంతరావులకు భూదాన పత్రాలు అందజేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 24: సైబరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్, సెక్యూరిటీ సూపర్వైజర్ (ఇన్చార్జ్) అత్యాచార యత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం ఉదయం వెలుగుచూసింది. గతంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో క్యాబ్ డ్రైవర్తో పాటు ఓ సెక్యూరిటీ గార్డును ఇచ్చి మహిళలను ఇంటి వద్ద వదిలే చర్యలు చేపట్టారు.
నల్లగొండ, అక్టోబర్ 24: మావోయిస్టు పార్టీ ఏవోబీ జోనల్ సెక్రటరీ, శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి చామల కిష్టయ్య అలియాస్ దయా సోమవారం నాటి ఎన్కౌంటర్లో మరణించటం స్థానికంగా సంచలనం సృష్టించింది. యాదాద్రి జిల్లా పరిధిలోని వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం చెందిన చామల కిష్టయ్య 1989లో అప్పటి పీపుల్స్వార్ రాచకొండ దళ సభ్యుడిగా చేరి 1994లో ఏవోబికి మారాడు.
హైదరాబాద్, అక్టోబర్ 24: తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరే స్పెషల్ క్యాటగిరీ విద్యార్థులకు ఈ నెల 26-27 తేదీల్లో కౌనె్సలింగ్ నిర్వహిస్తున్నారు. 26న ఉదయం 10 గంటలకు డిఫెన్స్ కోటా, మధ్యాహ్నం 2 గంటలకు ఎన్సిసి కోటా సీట్లకోసం కౌనె్సలింగ్ జరుగుతుందని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్కుమార్ తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 24: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామన్న బంగారు కుటుం బం పాలనపై ప్రజల భ్రమలు తొలగిపోతున్నాయని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్రెడ్డి అన్నారు. వాస్తు బాగాలేదని సచివాలయాన్ని కూల్చి వేసి కొత్తగా నిర్మించాలని ముఖ్యమంత్రి కె.
హైదరాబాద్, అక్టోబర్ 24: తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లా కొల్హాపూర్ మండలం ఎల్లూరు గ్రామంలోని భూముల్లోకి నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి చెందిన ప్రైవేటు వ్యక్తులు ప్రవేశించకుండా నిరోధించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.
కొత్తగూడెం, అక్టోబర్ 24: జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలి గ్రీవెన్స్డేను సోమవారం స్థానిక ఆర్డీవో సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు నేతృత్వంలో నిర్వహించారు. ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని సమస్యలపై దరఖాస్తులు అందజేశారు. ప్రధానంగా భూసమస్యలు, ప్రభుత్వం తరపున విడుదల కావాల్సిన నిధులపై ఎక్కువ మంది దరఖాస్తులు అందజేశారు.