-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
మెదక్ రూరల్, సెప్టెంబర్ 3: వన్యప్రాణుల వేట రోజురోజుకు పెచ్చుమీరుతోంది. అటవీ జంతువులు, పక్షులపై కనే్నసిన వేటగాళ్లు తరచు వేటాడి విక్రయిస్తున్నారు. శనివారం సాయంత్రం జాతీయ పక్షి నెమలిని చంపి కాలుస్తుండగా ముగ్గురు వ్యక్తులను పట్టుకున్న సంఘటన మెదక్ మండలం తొగిట శివారులోని రామస్వామి ఆలయం సమీపంలో చోటుచేసుకుంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 3: నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ కూలి ఏడుగురికి గాయాలైన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్లో రోడ్నెంబర్ 33 ప్లాట్నెంబర్ 545లో నిలేష్ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం భవనంపై మరో స్లాబ్ను నిర్మిస్తుండగా ఒక్కసారిగా స్లాబ్ కుప్పకూలింది.
సంగారెడ్డి, సెప్టెంబర్ 3: మల్లన్న సాగర్ రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ కార్యాచరణను ప్రభుత్వం వేగవంతం చేసింది. అనేక ఇబ్బందుల మధ్య కొనసాగుతున్న భూ సేకరణను త్వరగా ముగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. భూములు ఇవ్వడానికి అనాసక్తి కనబర్చిన రైతులను ఒప్పించడంలో ప్రభుత్వానికి తల ప్రాణం తోకకు వచ్చినట్లై కూర్చుంది.
సారంగాపూర్, సెప్టెంబర్ 3: కేంద్ర మంత్రి, బిజెపి నేత వెంకయ్యనాయుడు తెలంగాణలో హిందు, ముస్లింలకు తగాదాలు పెట్టి కొట్లాడుకోవాలని చూస్తున్నారని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేసారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవం కాకుండా భారతదేశంలో తెలంగాణ విలీనం చేసిన దినోత్సవంగా ప్రభుత్వం పాటిస్తుందని ఆమె అన్నారు.
కోదాడ, సెప్టెంబర్ 3: డిగ్రీలో ప్రవేశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం వలన విద్యార్థుల్లో అయోమయం నెలకొందని జెఎసి చైర్మన్ ఆచార్య కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా కోదాడలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఆన్లైన్ అడ్మిషన్ల వలన విద్యార్థులకు కొన్ని కాలేజీల్లో సీట్లు దొరకలేదని, మరికొన్ని కాలేజీల్లో అడ్మిషన్లు లేక సీట్లు మిగిలిపోయాయని ఆయన వివరించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 3: తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు తుది దశ కౌనె్సలింగ్ను ఈ నెల 5వ తేదీ నుండి 8వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్టు కాలేజీయేట్ కమిషనర్ టి విజయకుమార్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు తొలిసారిగా ఆన్లైన్ విధానం ‘దోస్త్’ను అమలులోకి తెచ్చింది. సీట్ల కోసం ఆన్లైన్లో 2,39,506 మంది రిజిస్టర్ చేసుకున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 3: కొత్త జిల్లాలు ఏర్పాటు నేపథ్యంలో పోలీస్ శాఖలో సిబ్బంది కొరతను డిజిపి అనురాగ్ శర్మ సిఎస్ రాజీవ్ శర్మ దృష్టికి తీసుకెళ్లారు. పోలీస్ శాఖలో నూతన నియామకాలకు అనుమతివ్వాలని ఆయన సిఎస్ను కోరారు. శనివారం కార్మిక, హోంశాఖల్లో ఉద్యోగుల సర్దుబాటు, జిల్లాల విభజనపై నిర్వహించిన అధికారుల సమీక్షలో డిజిపి అనురాగ్శర్మ పాల్గొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 3: తెలంగాణ రాష్ట్రం పరిధిలో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తు చేపట్టిన కేసులపై రెండు కోర్టులు విచారణ జరుపుతాయని హైకోర్టు ప్రకటించింది. నాంపల్లిలోని నాల్గవ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు, రంగారెడ్డి జిల్లాలోని ఎల్బి నగర్ ఐదవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఎన్ఐఏ కేసులను విచారిస్తాయని హైకోర్టు పేర్కొంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 3: అమెరికా ప్రభుత్వ వ్యవసాయ రంగం విధి విధానాలు, కార్యకలాపాలు అభివృద్ధి చెందుతున్న వర్థమాన దేశాలకు స్ఫూర్తి దాయకం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. అమెరికా వాషింగ్టన్ డిసి పట్టణంలో మంత్రి శనివారం అమెరికా ప్రభుత్వ వ్యవసాయ శాఖ, అమెరికా విత్తనాల సంస్థ అధికారులతో సమావేశం అయ్యారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 3: తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగైదు రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో మెట్టపంటలు తిరిగి ప్రాణం పోసుకున్నాయి. వరి పంట కాకుండా ఇతర పంటలు దాదాపు 70 లక్షల ఎకరాల్లో వేశారు. వీటిలో జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగులు, కందులు, ఉలవలు, పెసళ్లు, పల్లి (వేరుశనగ), పొద్దుతిరుగుడు, కుసుమ, సోయా, పత్తి, మిరప, ఉల్లి తదితర పంటలు ఉన్నాయి.