-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్: తమ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకానికి 5వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేయాలని తెలంగాణ సిఎం కెసిఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి శనివారం లేఖ రాశరు. జలవనరులను పెంచేందుకు మిషన్ కాకతీయ పథకం ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ పథకానికి నిధుల కోసం నీతి ఆయోగ్ కూడా సిఫారసు చేసిందన్నారు. వెనుకబడిన తెలంగాణ జిల్లాలను దృష్టిలో పెట్టుకుని నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఆదిలాబాద్: భైంసా పట్టణంలో శనివారం మధ్యాహ్నం ఓ యువకుడు నడిరోడ్డుపై యువతిని దారుణంగా హతమార్చాడు. తనను ప్రేమించలేదన్న కక్షతో మహేష్ అనే యువకుడు స్థానిక గోవిందనగర్కు చెందిన సంధ్య (16)పై కిరాతకంగా కత్తితో గొంతు కోశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే రక్తపుమడుగులో ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు.
మహబూబ్నగర్: బిజెపి నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్దనరెడ్డి శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతుండగా తెరాస కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకువచ్చి నిరసనకు దిగారు. ఆయనపై దాడి చేసేందుకు వారు ప్రయత్నించారు. ఈ సందర్భంగా బిజెపి, తెరాస కార్యకర్తల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సాయంత్రం డిండి ఎత్తిపోతల పథకంపై మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
హైదరాబాద్: ఈ ఏడాది ఖైరతాబాద్ గణేషుడు ‘శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి’గా గణనాథుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. గణేశుడి కుడి చేతివైపు వెంకటేశ్వరస్వామి, ఎడమవైపు శ్రీకృష్ణుడి విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించిన చిత్రాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు శనివారం విడుదల చేశారు.
హైదరాబాద్: బంజారాహిల్స్లో ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 8 మందిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. 3 కార్లు, 4 ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
ఖమ్మం : మట్టి పెళ్లలు విరిగిపడి ఇద్దరు కూలీలు మృతి చెందిన సంఘటన సింగరేణి ఇల్లందు ఏరియా జేకే ఉపరితలగనిలో శనివారం చోటుచేసుకుంది. ఉపరితల గని చుట్టూ పోసిన మట్టిని తీస్తుండగా, మట్టి పెళ్లలు కూలీలపై పడటంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
సికింద్రాబాద్: బోయిన్పల్లి చెక్పోస్టు వద్ద శనివారం ఉదయం వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొనడంతో షాపూర్నగర్కు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినందునే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేసి, మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
నాగార్జునసాగర్, జూలై 1: నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై రెండు రోజులుగా భద్రతను పెంచామని నాగార్జునసాగర్ డ్యాం భద్రత అధికారి రమణారెడ్డి తెలిపారు. హైద్రాబాద్లో ఉగ్రవాద సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో రాష్టవ్య్రాప్తంగా పోలీసుశాఖ ఇంటెలిజెన్స్ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ పర్యాటక కేంద్రం, బహళార్థ సాధక ప్రాజెక్టు అయిన నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై నిఘాను పెంచారు.
నిజామాబాద్, జూలై 1: నిజామాబాద్ కేంద్రంగా గంజాయిని స్మగ్లింగ్ చేసే అంతర్రాష్ట్ర ముఠాను నిజామాబాద్ రూరల్ పోలీసులు గట్టి నిఘా వేసి చాకచక్యంగా అరెస్టు చేశారు. వారి వద్ద నుండి సుమారు 3కోట్ల రూపాయల విలువ చేసే శుద్ధి చేయబడిన ఎండు గంజాయి నిల్వలతో పాటు 7.12లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.