-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
భద్రాచలం, జూన్ 28: ఛత్తీస్గఢ్లో మంగళవారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని బస్తర్ ఐజీ కల్లూరి తెలిపారు. సుక్మా జిల్లాలోని గాదిరాజ్ పోలీస్స్టేషన్ పరిధిలోని బడేశెట్టి అటవీప్రాంతంలో జిల్లా పోలీసులు, డీఆర్జీ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
వి.కోట, జూన్ 28: చిత్తూరు జిల్లా వి కోట మండల పరిధిలోని నాగిరెడ్డి పల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో పదేళ్ల ఆడ ఏనుగు మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. నాగిరెడ్డిపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో పదేళ్ల ఆడ ఏనుగు మూడు రోజుల క్రితం మృతి చెందినట్లుగా గుర్తించిన మృతదేహాన్ని స్థానికులు అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
హైదరాబాద్, జూన్ 28: రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన సదావర్తి సత్రం భూముల కొనుగోల్మాల్పై చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూ కార్డును ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువయ్యే తమిళనాడులోని సదావర్తి సత్రం దేవాలయ భూముల పరిరక్షణకు నడుం బిగించాలని కోరుతూ పీఠాథిపతులు, మఠాథిపతులకు లేఖలు రాయాలని నిర్ణయించుకుంది.
హైదరాబాద్, జూన్ 28: రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ప్రకారం శిశువులకు జనన ధృవీకరణ పత్రాలు స్థానిక సంస్థలు ఉచితంగా జారీ చేయాల్సి ఉంది. కానీ ఈ నిబంధనను జిహెచ్ఎంసి ఏ మాత్రం అమలు చేయలేకపోయింది. శిశువు పుట్టగానే బర్త్ సర్ట్ఫికెట్ జారీ చేయటంతో పాటు ఆధార్ కార్డును కూడా సమకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనుంది.
హైదరాబాద్ : మంగళవారం తొమ్మిదిమంది న్యాయమూర్తులపై హైకోర్టు సస్పెన్షన్ వేటు వేసింది. తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.రవీందర్రెడ్డి, వి.వరప్రసాద్లపై న్యాయస్థానం సోమవారం సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ఇప్పటివరకూ 11మంది న్యాయమూర్తులు సస్పెండ్ అయ్యారు. హైకోర్టు నిర్ణయంతో తెలంగాణలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ : న్యాయవాదుల విధులకు ఆటంకం కల్పిస్తూ.. అక్రమ అరెస్టులు చేస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమీషన్లోలో మంగళవారం తెలంగాణ అడ్వకేట్ జాక్ ఫిర్యాదు చేసింది.అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న పోలీసులపై చర్య తీసుకోవాలని కోరారు.
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని ఆరు ఉపరితల గనులలో సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. శ్రీరాంపూర్ ఉపరితల గనిలో 10,000 టన్నులు, రామకృష్ణాపూర్ గనిలో 3,000 టన్నులు , బెల్లంపల్లి ఏరియాలోని డొర్లి 1,2,3, ఖైరిగూడ-4 ఉపరితల గనుల్లో సుమారు 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. ఉపరితల గనుల్లో మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి.
హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టును విభజించాలని, ఆంధ్రా జడ్జిలకు ఆప్షన్లు రద్దు చేయాలని న్యాయవాదులు, న్యాయాధికారులు చేస్తున్న ఆందోళనకు మద్దతిస్తున్నట్లు టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, టి.సిఎల్పి నేత జానారెడ్డి మంగళవారం ప్రకటించారు. ఏడుగురు జడ్జిలపై సస్పెన్షన్లు ఎత్తివేయాలని, హైకోర్టు విభజనకు సుప్రీం కోర్టు స్పందించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్: క్రమశిక్షణా రాహిత్యం పేరిట ఏడుగురు జడ్జిలపై హైకోర్టు విధించిన సస్పెన్షన్లను ఎత్తివేసే వరకూ సామూహిక సెలవులో ఉండాలని తెలంగాణ న్యాయాధికారుల సంఘం తీర్మానించింది. సోమవారం ఇద్దరు జడ్జిలను, మంగళవారం అయిదుగురిని హైకోర్టు సస్పెండ్ చేయడంతో తమ ఆందోళనను తీవ్రతరం చేయాలని సంఘం నిర్ణయించింది.
హైదరాబాద్: క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారని పేర్కొంటూ తెలంగాణ జడ్జిల సంఘం ఉపాధ్యక్షులు సున్నం శ్రీనివాస్రెడ్డి, చంద్రశేఖర్ ప్రసాద్లతో పాటు రమాకాంత్, తిరుపతి, రాధాకృష్ణ చౌహాలను సస్పెండ్ చేస్తూ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు విభజన, ఆంధ్రా జడ్జిలకు ఆప్షన్ల రద్దు కోరుతూ తెలంగాణలో న్యాయవాదులు, జడ్జిలు కొన్నిరోజులుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.