S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/23/2020 - 06:20

హైదరాబాద్, మార్చి 22: ప్రపంచానికే జనతా కర్ఫ్యూ స్పూర్తి దాయాకమని, దేశ చరిత్రలలోనే ఆపూర్వమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. కరోనా నివారణలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతొ జనతా కర్ఫ్యూ ఆదివారం విజయవంతంగా కోనసాగిందని తెలిపారు. ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన జనతా కర్ఫ్యూలో ప్రజలు స్వచ్చందంగా పాల్గొని తమ పూర్తి మద్దతు తెలిపారన్నారు.

03/23/2020 - 06:09

హైదరాబాద్, మార్చి 22: జనతా కర్ఫ్యూ అమలులో ఉన్నా రోడ్డుపైకి వస్తున్న వాహనదారులు, వ్యక్తులకు హైదరాబాద్ పోలీసులు వినూత్న రీతిలో బుద్ధి చెప్పారు. వారి బాధ్యతను గుర్తుకు వచ్చేలా వ్యవహరిస్తున్నారు. పోలీసుల తీరు మర్యాదపూర్వకంగానే ఉన్నా, అది మాత్రం వాహనదారులకు చెంపపెట్టులా అనిపిస్తోంది.

03/23/2020 - 06:44

హైదరాబాద్: తెలంగాణలో కరోనా సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని ప్రభుత్వ లెక్కలే తెలియచేస్తున్నాయి. ఆదివారానికి కరోనా పాజిటివ్‌గా తేలిన వారి సంఖ్య 27కు చేరింది. కరోనా పాజిటివ్‌గా తేలిన వారి వివరాలను ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఆదివారం సాయంత్రం వెల్లడించారు.

,
03/23/2020 - 01:06

హైదరాబాద్: కరోనా మహమ్మారి వంటి ఆపద సమయంలో సైతం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సమాజం కోసం విధులు నిర్వహిస్తున్న వారికి సంఘీభావంగా చప్పట్లతో సంఘీభావం తెలిపిన కార్యక్రమం తెలంగాణలో మహా అద్భుతంగా జరిగింది. గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుకొని ప్రగతి భవన్ నుంచి పల్లెటూరి వరకు వాడవాడలో జరిగిన సంఘీభావ సంకేతానికి ప్రతి పౌరుడు స్పందించిన తీరు అద్వితీయం.

03/23/2020 - 00:52

హైదరాబాద్, మార్చి 22: కరోనా నియంత్రణ కోసం జనతా కర్ఫ్యూకు కొనసాగింపుగా ఈ నెల 31 వరకు జనం ఇళ్లకే పరిమితం కావాలని అప్పటివరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ అమ లు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అప్పటివరకు నిత్యావసర సరుకులు, అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు.

03/22/2020 - 05:10

హైదరాబాద్, మార్చి 21: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుమేరకు జనతా కర్ఫ్యూను ప్రతి ఒక్కరు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 14 గంటల పాటు పూర్తిగా ఇళ్లలో ఉండి పాటించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని పెద్ద విపత్తులో పడేసిందన్నారు. మన దేశంలో కూడా కరోనా వైరస్ రోజు రోజుకు విస్తరిస్తోందన్నారు.

03/22/2020 - 05:08

హైదరాబాద్, మార్చి 21; ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలకు జనతా కర్ఫ్యూ పాటించాలని ఇచ్చిన పిలుపును అమలు చేస్తామని తెలంగాణ హాస్పిటల్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు డాక్టర్ అశోక్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ మోహన్ గుప్తా తెలిపారు. వైద్య వృత్తిలో ఉన్న వారి పట్ల మోదీకి ఉన్న చిత్తశుద్ధి, గౌరవం తెలియచేస్తుందన్నారు.

03/22/2020 - 05:07

హైదరాబాద్, మార్చి 21: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను అడ్డుకుందామని, ప్రధాని నరేంద్రమోదీ జనతా కర్ఫ్యూకు ఐక్యతతో మద్దతు పలుకుదామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం నాడు ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కరోనాను నివారించే ప్రయత్నం చేస్తోందని అన్నారు. జనతా కర్ఫ్యూ పాటించడం ద్వారా కరోనా చెయిన్‌ను రద్దు చేయగలుగుతామని చెప్పారు.

03/22/2020 - 05:05

హైదరాబాద్, మార్చి 21: ఉగాది వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం అనాదిగా వస్తోందని, అయితే ప్రాణాంతక కరోనా వైరస్ కట్టడి ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఏడాది ఉగాది వేడుకలను నిరాడంబరంగగా నిర్వహిస్తున్నట్లు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. భద్రాద్రిలో జరిగే శ్రీరామనవమి వేడుకలను కూడా భక్తులకు అనుమతి లేదన్నారు.

03/22/2020 - 05:03

హైదరాబాద్, మార్చి 21: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ రాజ్యసభ సభ్యుడిగా నియమితులు కావడం అనైతికమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ పేర్కొన్నారు. పదవీవిరమణ చేసి ఎంతో కాలం గడవక ముందే ఆయనను రాజకీయ పదవికి నామినేట్ చేయడం చూస్తుంటే బీజేపీతో ఆయనకు ఉన్న సంబంధాలపై అనుమానాలు వస్తాయని, వాస్తవికంగా ఆపార్టీతో సంబంధాలు ఉన్నా లేకున్నా ప్రజల్లో అపోహలు వస్తాయని పేర్కొన్నారు.

Pages