-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
దండేపల్లి, జూన్ 22: ప్రజా ఉద్యమ కవి, రచయిత, ప్రముఖ వాగ్గేయకారుడు గూడ అంజయ్యకు స్వగ్రామమైన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని లింగాపూర్లో అశుృనయనాల మధ్య కడసారి వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం హైదరాబాద్లోని రామన్నగూడలో అంజయ్య తుదిశ్వాస వదిలిన విషయం తెలిసిందే. ఆయన కోరిక మేరకు స్వగ్రామమైన దండేపల్లి మండలం లింగాపూర్లో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
హైదరాబాద్, జూన్ 22: తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదలపై పెనుభారం మోపకుండా విద్యుత్, ఆర్టీసీ చార్జీలను స్వల్పంగా పెంచాడానికి సిఎం కెసిఆర్ అధికారులకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. విద్యుత్, ఆర్టీసీవంటి ప్రభుత్వరంగ సంస్థలను నష్టాల ఊబినుంచి గట్టెక్కించాలంటే ప్రజలు కూడా కొంతభారం మోయక తప్పదని సిఎం స్పష్టం చేశారు.
హైదరాబాద్, జూన్ 22: వచ్చే జూలై 1వ తేదీ నుంచి సవరించిన విద్యుత్ చార్జీలు అమలులోకి వస్తున్నాయి. దీని వల్ల వినియోగదారులపై రూ.1500 కోట్ల భారం పడనుంది. మొత్తం 86 లక్షల గృహ వినియోగదారుల్లో 60 లక్షల మందికి చార్జీల ప్రభావం ఉండదు. కాని 100 నుంచి 200 యూనిట్ల స్లాబ్లో తొలి వంద యూనిట్లకు రూ.3.25 పైసలు, 101-200 యూనిట్ల మధ్య రూ.
హైదరాబాద్, జూన్ 22: సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే 103 గురుకుల పాఠశాలలు, 30 డిగ్రీ కళాశాలల్లో బోధనా, బోధనేతర సిబ్బంది 4616 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవ్వే కాకుండా గురుకుల పాఠశాలలు, డిగ్రీ కళాశాలలో 733 పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా భర్తీ చేసుకోవడానికి కూడా ఆర్థిక శాఖ అనుమతించింది.
హైదరాబాద్: శంషాబాద్ సమీపంలోని గగన్పహాడ్ వద్ద జోరుగా పేకాట సాగుతోందన్న సమాచారంతో బుధవారం నాడు ప్రత్యేక టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పదిమంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి 8వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: ఇంజనీరింగ్ సీట్లకు సంబంధించి జూలై 1లోగానే జెఎన్టియు నుంచి అనుబంధ కళాశాలల జాబితా వస్తుందని, దీనికి ముందుగా సీట్లు అమ్ముకునే కాలేజీలపై కఠిన చర్యలు తప్పవని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి బుధవారం హెచ్చరించారు. అనుబంధ కళాశాలల జాబితా వచ్చాకే బి-కేటగిరీ సీట్లపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
హైదరాబాద్: ఆస్తుల వేలం సందర్భంగా అయ్యే ఖర్చులకు పాతిక లక్షల రూపాయలను డిపాజిట్ చేయాలని అగ్రిగోల్డ్ సంస్థను ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ మొత్తాన్ని వచ్చే మంగళవారం లోగా డిపాజిట్ చేయాలని కేసు విచారణను కోర్టు అదే రోజుకు వాయిదా వేసింది.
హైదరాబాద్: తమ డిమాండ్లను సాధించేందుకు తెలంగాణలో గురువారం తలపెట్టిన సమ్మె యథాతథంగా జరుగుతుందని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేత రాజిరెడ్డి బుధవారం స్పష్టం చేశారు. ఎంప్లారుూస్ యూనియన్, ఎన్ఎంయు సహా మొత్తం 7 కార్మిక సంఘాలతో ఏర్పడిన ఐక్యకార్యాచరణ సమితి సమ్మెకు పిలుపు ఇచ్చిందని ఆయన వివరించారు. కార్మికుల సమస్యలపై చర్చించేందుకు ఇంతవరకూ ఆర్టీసీ యాజమాన్యం స్పందించ లేదని ఆయన తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ చార్జీలను పెంచేందుకు రంగం సిద్ధమైంది. చార్జీల పెంపుదల విషయమై సిఎం కెసిఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో అధికారులు పలు ప్రతిపాదనలు రూపొందించారు. కెసిఆర్ను బుధవారం మధ్యాహ్నం ఆర్టీసీ, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు కలిసి నివేదికలను సమర్పించారు.
హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలను నియంత్రించేందుకు ప్రాంతీయ రవాణాశాఖ (ఆర్టిఎ) అధికారులు బుధవారం వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు జరిపారు. భెల్ వద్ద ముంబయి హైవేపై 15 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, ఏడు లారీలపై కేసులు నమోదు చేశారు.