S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/03/2016 - 12:01

బీర్కూర్, ఏప్రిల్ 2: బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌లోని తెలంగాణ తిరుమల దేవాలయాన్ని గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఈ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున 10కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా, తన కుటుంబం తరఫున 10లక్షల 116రూపాయలను విరాళంగా అందిస్తున్నట్టు సభాముఖంగా అందరి హర్షధ్వానాల మధ్య సిఎం ప్రకటించారు.

04/03/2016 - 11:58

వరంగల్, ఏప్రిల్ 2: అదనపు కట్నం కోసం కాబోయే భర్త పెడుతు న్న వేధింపులు తట్టుకోలేక యువతి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లికి చెందిన పిజి లెక్చరర్ మమతా రెడ్డి (23) పెళ్లి కాకుండానే వరకట్న దాహానికి బలైంది. నిశ్చితార్థం జరిగిన తర్వాత అదనపు కట్నం కోసం వేధించడంతో లెక్చరర్‌గా పనిచేస్తు న్న మమతారెడ్డి ఆత్మహత్య చేసుకుంది.

04/03/2016 - 11:57

హైదరాబాద్, ఏప్రిల్ 2: ఓవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ నల్లా కనెక్షన్ పథకంపై కసరత్తు చేస్తుండగా, మరోవైపు నగరంలో అక్రమ నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం జలమండలితో కలసి ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ కార్యక్రమం నేపథ్యంలో వాడకో ప్యూరిఫైడ్ వాటర్ బాటిళ్లు, క్యాన్‌ల యూనిట్లు వెలిశాయి.

04/03/2016 - 11:57

హైదరాబాద్, ఏప్రిల్ 2: ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం హామీల వర్షం కురిపించిందే తప్ప కరవు నివారణపై పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని టి.టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అమర్‌నథ్ బాబు విమర్శించారు.

04/03/2016 - 11:56

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 2: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో బైక్‌ను పాల వ్యాన్ ఢీకొట్టింది. దాంతో దంపతులు మృతి చెందగా వారి ఐదేళ్ల బాలుడు సైతం ప్రమాదంలో మత్యువాత పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి మహబూబ్‌నగర్‌రూరల్ సిఐ రామకృష్ణ కథనం ప్రకారం...

04/03/2016 - 11:54

జగదేవ్‌పూర్, ఏప్రిల్ 2: రాష్టమ్రుఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండల పరిధిలో ని ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రానికి శనివారం చేరుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కుటుంబ సభ్యులతో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన విశ్రాంతి కోసం తన కుటుంబ సభ్యులతో ఫాం హౌస్‌కు చేరుకున్నారు.

04/03/2016 - 11:54

నాగార్జునసాగర్, ఏప్రిల్ 2: నాగార్జునసాగర్ జలాశయం నుండి కుడి, ఎడమకాల్వల ద్వారా నీటివిడుదల కొనసాగుతోంది. ఎడమకాల్వ ద్వారా తాగునీటి విషయమై శుక్రవారం ఉదయం నుండి నీటివిడుదల చేస్తుండగా గత నెల 23వ తేదీ నుండి కుడికాల్వ ద్వారా ఆంధ్రా రాష్ట్రానికి నీటివిడుదల చేస్తున్నారు.

04/03/2016 - 11:53

సంగారెడ్డి, ఏప్రిల్ 2: తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్న అన్నదాతలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది గంటల పాటు కరెంటు సరఫరా చేయడానికి నిర్ణయించింది. మార్చి నెలాఖరు నుంచి తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు కట్టుబడి ట్రాన్స్‌కో అధికారులు ఏప్రిల్ 1వ తేదీ నుండి వ్యవసాయానికి తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరాను ప్రారంభించారు.

04/03/2016 - 11:43

సిద్దిపేట, మార్చి 2: గోదావరి జలాలతో సాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందిస్తే కాంగ్రెస్, టిడిపి నేతలకు రాజకీయ భవిష్యత్తు ఉండదని విమర్శలకు దిగుతున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు అందుతుందని కాంగ్రెస్, టిడిపి నేతలకు స్పష్టత ఉందన్నారు.

04/03/2016 - 11:40

భద్రాచలం, ఏప్రిల్ 2: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షాలు కెసీఆర్‌పై, తెలంగాణ ప్రభుత్వంపై చేస్తున్న చిల్లర రాజకీయాలను మానుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హితవు పలికారు.

Pages