S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/26/2016 - 16:21

హైదరాబాద్: ఖాతాదారుల నుంచి సుమారు నాలుగు కోట్ల రూపాయలను డిపాజిట్లుగా వసూలు చేసి బోర్డు తిప్పేసిన అఫ్జల్‌గంజ్‌లోని రామ్‌రాజ్ చిట్‌ఫండ్ బాగోతం శుక్రవారం వెలుగుచూసింది. ఖాతాదారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ చిట్‌ఫండ్ సంస్థ యజమాని రామ్‌రాజ్‌ను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు.

02/26/2016 - 16:03

హైదరాబాద్ : వరంగల్‌, ఖమ్మం మేయర్‌, డిప్యూటీ మేయర్, అచ్చంపేట మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు షెడ్యూల్ ఖరారు చేశారు. మార్చి 11న నోటిఫికేషన్ జారీ చేస్తారు. 15న ఉదయం 11 గంటలకు ఎన్నిక జరగనుంది.

02/26/2016 - 16:00

హైదరాబాద్ : తమ సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ సమితి ఆధ్వర్యంలో నర్సులు శుక్రవారం ఇందిరా‌పార్కులో రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. బీజేఎల్పీ నేత లక్ష్మణ్ నర్సులకు సంఘీభావం తెలిపారు.

02/26/2016 - 15:58

హైదరాబాద్‌: తెలంగాణలో అదనపు డీజీలుగా రాజీవ్‌ రతన్‌, సీవీ ఆనంద్‌, ఐజీలుగా విక్రంసింగ్‌మాన్‌, ఆర్‌.బి.నాయక్‌, బి.మల్లారెడ్డి, టి.మురళీకృష్ణ, ఎం.శివప్రసాద్‌, రాజేశ్‌కుమార్‌, ఎన్‌.శివశంకర్‌రెడ్డిలకు పదోన్నతి లభించింది.

02/26/2016 - 11:58

ఖమ్మం: సత్తుపల్లి మండలం చంద్రాయపాలెంలో ప్రభుత్వ పాఠశాల హెడ్‌మాస్టర్ విజయకుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు కనుగొన్నారు. ఆత్మహత్యకు కారణాలింకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు.

02/26/2016 - 11:55

సికిందరాబాద్: బోయగూడలో జిహెచ్‌ఎంసి ఉద్యోగి సాయి కుమార్‌పై గురువారం అర్ధరాత్రి కొంతమంది కత్తులతో దాడి చేసి గాయపరిచారు. సాయికుమార్‌ను వెంటనే ముషీరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బంధువులే దాడికి పాల్పడ్డారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

02/26/2016 - 11:54

నిజామాబాద్: డిచ్‌పల్లి మండలం తిరుమన్‌పల్లిలో ఓ మహిళను దారుణంగా హత్యచేసి మృతదేహాన్ని తగులబెట్టిన ఉదంతం శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

02/26/2016 - 11:53

ఆదిలాబాద్: నేరేడుగొండలో శుక్రవారం ఉదయం వేగంగా వస్తున్న ఓ బైక్ అదుపుతప్పి కారును ఢీకొంది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. మృతులను బోధ్ మండలం పొచ్చర్ల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

02/26/2016 - 07:31

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రీసెర్చి స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య పూర్వాపరాలపై ఏకసభ్య కమిషన్ జస్టిస్ అశోక్ కుమార్ రూపన్‌వాలా గురువారం నాడూ నాంపల్లి గోల్డెన్ థ్రెషోల్డ్ దూర విద్యా కేంద్రం (సిడివిఎల్)లో విచారణ కొనసాగించారు.

02/26/2016 - 07:30

హైదరాబాద్, ఫిబ్రవరి 25: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆక్రమిత ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ సకాలంలో పూర్తిచేయకపోవడంతో అక్రమ భవన నిర్మాణాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకునే అర్హత కోల్పోయే పరిస్థితి నెలకొంది.

Pages