-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
సిద్దిపేట/సిద్దిపేట అర్బన్, జనవరి 9: మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో గురు, శుక్రవారాల్లో జరిగిన సంఘటలనకు బాధ్యులైన ఇరువర్గాలను గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్పి సుమతి వెల్లడించారు.
ఖమ్మం, జనవరి 9: ఫిబ్రవరిలో జరగనున్న మేడారం జాతరకు రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి 3,600 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండి జివి రమణారావు వెల్లడించారు. శనివారం ఖమ్మంలో నూతన బస్టాండ్ ఏర్పాటు కోసం ఎనె్నస్పీ స్థలాన్ని పరిశీలించిన అనంతరం తనను కలిసిన విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభు త్వం మేడారం జాతరను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోందన్నారు.
హైదరాబాద్, జనవరి 9: మరో పదిహేను, ఇరవై ఏళ్లపాటు కెసిఆర్ ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షునిగా ఉంటారని, తన స్థాయికి మంత్రి పదవే ఎక్కువ అని భావిస్తున్నానని, అంత కన్నా ఎక్కువ ఆశ పడడం లేదని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కెటిఆర్ శనివారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
హైదరాబాద్, జనవరి 9: తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ ఉగ్రవాదానికి పాల్పడుతున్నదని టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ రిజర్వేషన్లపై హైకోర్టుకు వెళ్ళనున్నట్లు ఆయన తెలిపారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించలేదని, పైగా ఎస్సి డివిజన్ల సంఖ్యను 12 నుంచి 10కి తగ్గించారని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు.
హైదరాబాద్, జనవరి 9: సంక్షేమ రంగంలో టిఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మల్కాజిగిరి నియోజక వర్గం సమావేశం అల్వాల్లోని ఎమ్మెల్యే కనకారెడ్డి నివాసంలో శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఈటల మాట్లాడుతూ పేదలు, సామాన్యుల సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు.
హైదరాబాద్, జనవరి 9: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యులు కీలకపాత్ర వహించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్ జిల్లాతోపాటు రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని కొంతభాగం కూడా ఉంది. ఈ మూడు జిల్లాల పరిధిలోని ప్రజాప్రతినిధులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్స్ అఫీషియో సభ్యులు. మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా 60మంది ప్రజా ప్రతినిధులకు ఓటు హక్కు ఉంటుంది.
హైదరాబాద్, జనవరి 9: గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ కోసం పార్టీలన్నీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నేపథ్యంలో, నోటిఫికేషన్ వెలువడిన మరుసటి రోజునుంచే రాజధానిలో హడావుడి కనిపిస్తోంది. రిజర్వేషన్లు, షెడ్యూలు ప్రకటనతో ఆశావాహులు పార్టీ కార్యాలయాల వద్ద క్యూ కడుతుండటంతో, సందడి నెలకొంది. కాంగ్రెస్ ఆఫీస్ గాంధీభవన్కు శనివారం పెద్దఎత్తున అనుచరులతో ఆశావహులు తరలిరావడంతో ఆవరణ కిక్కిరిసింది.
హైదరాబాద్, జనవరి 9: రాజధానిలో గత ఏడాదికంటే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు తగ్గాయని, మెట్రో పాలిటన్ నగరాల్లో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలని నగర కమిషనర్ మహేందర్రెడ్డి పిలుపునిచ్చారు. హెల్మెట్ ధారణతోనే ప్రమాదాలు అరికట్టవచ్చని, హెల్మెట్ ధరించకపోవడంతోనే 25శాతం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
రంగారెడ్డి : మేడ్చల్ వద్ద వేగంగా వచ్చిన ఆటో బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయాలపాలయ్యాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కడప: ఎ.పి. సి.ఎం. చంద్రబాబు శనివారం కడప జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా ఆందోళనకు యత్నిస్తున్న వైకాపా, సిపిఐ, సిపిఎం నేతలను పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే పలువురు నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. వైకాపా ఎమ్మెల్యే అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబులను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల ఓవరాక్షన్పై విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.