S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆటాపోటీ
వాయు కాలుష్యంతో ఊపిరి కూడా సరిగ్గా పీల్చుకోలేకపోతున్నామని శ్రీలంక క్రికెటర్లు గగ్గోలు పెట్టడంలో వాస్తవం ఉందా? లేక టీమిండియాను సమర్థంగా ఎదుర్కొలేక వారు ఢిల్లీలో వాయు కాలుష్య సమస్యను అడ్డం పెట్టుకొని విమర్శల నుంచి బయటపడాలని అనుకుంటున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఎవరైనా ఒక బ్యాట్స్మన్ 11 రకాలుగా ఔట్ కావచ్చు. బౌల్డ్ కావడం లేదా క్యాచ్ ఇవ్వడం, హిట్ వికెట్ లేదా ఎల్బి, రనౌట్ లేదా స్టంప్ ఔట్ కావడం.. ఇవి సాధారణంగా అందరికీ తెలిసిన రకాలు. వీటితోపాటు బంతిని రెండుసార్లు కొట్టినా, ఆలస్యంగా క్రీజ్లోకి వచ్చిని, బంతిని చేత్తో తాకినా, ఫీల్డ్ను ఆటంకపరిచినా సదరు బ్యాట్స్మన్ను అంపైర్ ఔట్గా ప్రకటిస్తారు.
ప్రపంచ వ్యాప్తంగా ఫుట్బాల్కు విపరీతమైన ఆదరణ ఉంది. అత్యధికంగా అభిమానులు ఉన్న క్రీడ కూడా అదే. అయితే, కొన్ని దేశాల్లో సాధారణ సాకర్ మ్యాచ్లంటే అభిమానులు విసుగెత్తిపోతున్నారు. అందుకే, కొత్తకొత్త తరహాలో ఫుట్బాల్ ఆడుతూ ఆనందిస్తున్నారు. అలాంటి అరుదైన ఫుట్బాల్ ఆట గ్లూసెస్టర్లోని బర్టన్ ప్రాంతంలోగల విండ్ష్ నదిలో జరుగుతుంది. నదిలో పాదాలు మునిగే నీటిలో ఇరు జట్లు ఫుట్బాల్ మ్యాచ్ ఆడతాయి.
* క్రీడల పట్ల మక్కువ ఉండాలేగానీ, మైదానంలోకి దిగేందుకు వయసు అడ్డం కాదని నిరూపించాడు రాజా మహారాజ్ సింగ్. 72 ఏళ్ల వయసులో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. అదే అతనికి తొలి, చివరి మ్యాచ్. నాలుగు పరుగులు చేసిన అతను బౌలింగ్కు దిగలేదు. క్యాచ్ పట్టలేదు. సాధారణంగా కదలడానికి కూడా కష్టపడే వయసులో ఫస్ట్క్లాస్ మ్యాచ్లో ఆడడమేగాక, జట్టుకు నాయకత్వం కూడా వహించిన ఘనత మహారాజ్ సింగ్కు దక్కుతుంది.
ఫిఫాను ఆశ్చర్యంలో ముంచెత్తిన అంశాల్లో కనీవినీ ఎరుగని ప్రజాదరణ ఒకటి. అండర్-17 వరల్డ్ కప్ టోర్నీకే కాదు, అండర్-20 టోర్నీకి కూడా ఎప్పుడూ, ఎక్కడా ఇంత భారీ సంఖ్యలో అభిమానులు రాలేదు. 1985లో చైనాలో జరిగిన అండర్-20 వరల్డ్ కప్ను 12,30,976 మంది తిలకించగా, భారత్లో అండర్-17 వరల్డ్ కప్ను 13,47,143 మంది వీక్షించారు.
కిక్కిరిసిన స్టేడియం లేదు.. వేలాది మంది హర్షధ్వానాలు లేవు.. కనీసం ఒక అంతర్జాతీయ మ్యాచ్ కూడా కాదు.. జాతీయ టి-20 కప్ వంటి అత్యంత సాధారణమైన టోర్నీలో ఫైసలాబాద్ తరఫున ఆడిన పాకిస్తాన్ మేటి స్పిన్నర్లలో ఒకడైన సరుూద్ అజ్వల్ సెమీ ఫైనల్స్లో లాహోర్ వైట్స్ చేతిలో ఓడిన వెంటనే కెరీర్కు గుడ్బై చెప్పాడు. ఈ టోర్నమెంట్కు అంతగా ఆదరణ లేకపోవడంతో, రావల్పిండి స్టేడియం దాదాపు ఖాళీగా కనిపించింది.
పారిస్లో జరిగిన 1960 ఒలింపిక్స్లో అమెరికా లాంగ్ జంపర్ మెయర్ ప్రిన్స్స్టన్ను రన్నరప్గా ప్రకటించారు. ఇందులో వింత లేకపోయినా, అతను ఫైనల్ జంప్ చేయకుండానే పతకం అందుకోవడం విశేషమే. సిరాకస్ యూనివర్శిటీలో చదువుతున్న అతను క్వాలిఫయింగ్ జంప్స్ను సమర్థంగా పూర్తి చేశాడు. అయితే, ఫైనల్ జంప్ను ఆదివారం నిర్వహించారు.
పెర్త్లో అన్ని విధాలా ముస్తాబవుతున్న కొత్త స్టేడియం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య వనే్డ మ్యాచ్కి ఆతిథ్యమివ్వనుంది. ఐదు మ్యాచ్ల వనే్డ సిరీస్లో భాగంగా జనవరి 28న జరిగే ఐదో వనే్డకి పెర్త్ స్టేడియం సిద్ధంగా ఉంటుందని వెస్టర్న్ ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.
అవిశ్రాంత అంతర్జాతీయ షెడ్యూల్ ఇదే రీతిలో కొనసాగితే, వనే్డ, టి-20 ఇంటర్నేషనల్స్లో బాధ్యతల నుంచి వైదొలిగే అవకాశాలు లేకపోలేదని ఆస్ట్రేలియా చీఫ్ కోచ్ డారెన్ లీమన్ అన్నాడు. ఒక ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ, ఇటీవల కాలంలో క్రికెట్ క్యాలండర్ వివిధ సిరీస్లు, టోర్నీలతో నిండిపోతున్నదని, దీనితో విశ్రాంతి లభించడం లేదని అన్నాడు.
ఇంగ్లాండ్ క్రికెటర్ బ్రియాన్ క్లోస్కు రెండు అంకెతో ఎంతో అనుబంధం ఉన్నట్టుంది. 27 ఏళ్ల కెరీర్లో అతను 22 టెస్టులు ఆడాడు. 1949 జూలై 23 నుంచి 26 వరకు మాంచెస్టర్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అదే మాంచెస్టర్లో 1976 జూలై 8 నుంచి 13 వరకు వెస్టిండీస్తో చివరి టెస్టు ఆడాడు. మొదటి, చివరి టెస్టు మధ్య అతను 222 టెస్టుల్లో చోటు దక్కించుకోలేకపోయాడు.
- సత్య