S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆటాపోటీ
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్.. ప్రతి ఏటా నాలుగు గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో మొదటిది. ఈ పోటీలతోనే మేటి క్రీడాకారుల టైటిళ్ల వేట ఆరంభమవుతుంది. మెల్బోర్న్లో పార్క్లో ఈనెల 18 నుంచి 31వ తేదీ వరకు జరిగే టోర్నీ 104వది. వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రీలో విజయం సాధించి, శుభారంభం చేయాలన్న కోరిక పోటీకి దిగే ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది.
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)ను పూర్తిగా ప్రక్షాళన చేయడానికి విశ్రాంత న్యాయమూర్తి ఆర్ఎం లోధా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సుప్రీం కోర్టుకు పలు సిఫార్సులు చేసింది. ఎంతో మందితో చర్చించి, పలు దఫాలుగా సమావేశమైన తర్వాత కోర్టుకు సమర్పించిన నివేదికలో కీలక సూచనలు చేసింది. అయితే, ఈ సిఫార్సుల్లో బలమెంత? అన్నదే ప్రశ్న. బిసిసిఐని ఎన్నో సమస్యలు వెంటాడి వేధిస్తున్నాయి.
బిసిసిఐని ప్రత్యక్షంగానో, పరోక్షంగా శాసిస్తున్న వారిలో వృద్ధనేతలే ఎక్కువ మంది ఉన్నారు. వివిధ రాష్ట్రాల క్రికెట్ సంఘాల్లోనూ వీరే దర్శనమిస్తారు. మంత్రులు ఎవరూ బిసిసిఐ పాలక మండలిలో సభ్యులుగా ఉండరాదని లోధా కమిటీ సూచించింది. బోర్డు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి తదితర పోస్టులకు ఎన్నికయ్యే వ్యక్తులకు కొన్ని స్పష్టమైన అర్హతలు ఉండాలని పేర్కొంది.
పారాలింపిక్ అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్ కెరీర్కు తెరపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అతనిని హంతకుడిగా దక్షిణాఫ్రికా సుప్రీం కోర్టు నిర్ధారించడంతో, భవిష్యత్తులో రేసుల్లో పాల్గొనే అవకాశం అతనికి ఉండకపోవచ్చని నిపుణులు అంటున్నారు. పిస్టోరియస్ను దోషిగానే పేర్కొన్న సుప్రీం కోర్టు శిక్షను మాత్రం ఖరారు చేయలేదు.
బిసిసిఐ పాలక మండలికి ఎవరైనా వరుసగా రెండుసార్లు, గరిష్టంగా మూడు సార్లు ఎన్నికకావచ్చు. అంతకంటే ఎక్కువ పర్యాయాలు లేదా తొమ్మిది సంవత్సరాల కంటే అధిక కాలం పదవిలో ఉండకూడదని నిబంధనలను మార్చాలని లోధా కమిటీ సూచించింది. ఒకసారి ఎన్నికైన పాలక మండలి మూడేళ్లు పదవిలో ఉండవచ్చని పేర్కొంది.
సాకర్ స్టార్ క్రిస్టియానొ రొనాల్డో మ్యాచ్లకు ముందు ప్రత్యేక ప్రార్థనలు చేస్తాడు. పొరపాటున ప్రార్థన మరచిపోయిన ఒకటి రెండు సార్లు మైదానంలో గోల్స్ చేయలేకపోవడంతో అతనికి ఈ నమ్మకం పెరిగిపోయింది. తాను ఎక్కడ ఉంటే అక్కడికే మతాధికారిని పిలిపించుకొని, ప్రార్థనాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాతే అతను మ్యాచ్కి సిద్ధమవుతాడు.
ఇరు జట్లలో టాప్ బౌలర్గా ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీని పేర్కోవాలి. అతను 32 వనే్డల్లో 55 వికెట్లు పడగొట్టాడు. కపిల్ దేవ్ 41 మ్యాచ్ల్లో 45 వికెట్లు కూల్చి రెండో స్థానంలో ఉన్నాడు. 27 మ్యాచ్ల్లో 43 వికెట్లు పడగొట్టిన మిచెల్ జాన్సన్ది ఈ జాబితాలో మూడో స్థానం.
ఉదారుడు వినయ్
ఈ ఏడాది జనవరి 18న మెల్బోర్న్లో జరిగిన వనే్డలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాట్స్మెన్ను బెంబేలెత్తించాడు. స్టార్క్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కోలేకపోయిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 267 పరుగులు చేసింది. రోహిత్ శర్మ వీరోచిత ఇన్నింగ్స్ ఆడి 138 పరుగులు చేసి, భారత్ను ఆదుకున్నాడు. సురేష్ రైనా (51) అర్ధ శతకంతో రాణించగా, మిగతా బ్యాట్స్మెన్ విఫలమయ్యారు.
కామనె్వల్త్ బ్యాంక్ ముక్కోణపు వనే్డ సిరీస్ మొదటి ఫైనల్లో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ చెలరేగిపోవడంతో భారత్కు ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధ్యమైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. మాథ్యూ హేడెన్ 82 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, మైక్ హస్సీ 45 పరుగులు చేశాడు.
కళాత్మక ఆటకేగానీ పవర్ ప్లేకు ఏమాత్రం పనికిరాడన్న ముద్ర పడిన హైదరాబాద్ స్టయిలిస్టు బ్యాట్స్మన్ వివిఎస్ లక్ష్మణ్ తనదైన రోజున వనే్డల్లోనూ విజృంభించగలనని నిరూపించుకున్న మ్యాచ్ 2004 జనవరి 18న బ్రిస్బేన్లో జరిగింది. అతను అజేయంగా 103 పరుగులు చేయగా, సచిన్ తెండూల్కర్ 86, రాహుల్ ద్రవిడ్ 74 పరుగులతో భారత్కు అండగా నిలిచారు.