S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
యువ
స్మార్ట్ఫోన్’తో అనుబంధం పెరిగేకొద్దీ మెదడు శక్తి సన్నగిల్లిపోతుంది.. ఇదీ ఓ అంతర్జాతీయ అధ్యయనంలో నిపుణులు చేసిన హెచ్చరిక.
స్మార్ట్ఫోన్లతో అంతర్జాలంలో విహరించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నందున వైఫై కనెక్షన్ల ద్వారా కూడా సైబర్ దాడులకు అవకాశాలున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వైఫైను వినియోగించే నెటిజన్లు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. వైఫై నెట్వర్క్లకు రక్షణగా నిలిచే ‘వైఫై ప్రొటెక్టెడ్ యాక్సిస్-2’ (డబ్ల్యూపిఎ-2) ప్రొటోకాల్లో భద్రతాపరమైన లోపాలు ఇటీవల బయటపడ్డాయి.
పందొమ్మిదేళ్ల వయసులో కేవలం పదహారు నెలలు కష్టపడి ఆ కుర్రాడు వందకోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్ఞానికి అధిపతిగా నిలిచాడు. ఆత్మీయుల నుంచి రుణంగా తీసుకున్న సుమారు ఆరు లక్షల రూపాయలను స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టి, పనె్నండు మిలియన్ పౌండ్ల (సుమారు 103 కోట్ల రూపాయలు)మేరకు లాభాలను ఆర్జించి అందరి చేత ‘ఔరా’ అనిపించాడు.
రోజురోజుకూ వాట్సాప్ వినియోగం విశ్వవ్యాప్తంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ మొబైల్ యాప్ రోజుకో కొత్త ఫీచర్తో వినియోగదారులను అలరిస్తోంది. వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన రావడం కూడా కొత్త ఫీచర్ల ఆవిష్కరణకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ సరికొత్తగా ‘లొకేషన్ షేరింగ్’్ఫచర్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
అటాచ్ బటన్ క్లిక్ చేస్తే
కొత్తరకం స్మార్ట్ఫోన్లు మార్కెట్లో రంగప్రవేశం చేశాయంటే చాలు.. వాటిని కొనాలన్న తహతహ నేటి యువతలో మరీ ఎక్కువగా ఉంటోంది. ధరలు బరువుగా ఉన్నా, తాము కొనే ఫోన్లు మాత్రం తేలిగ్గా, కంటికి ఇంపుగా ఉండాలని వినూత్న ఫీచర్లు అందుబాటులోకి రావాలని అంతా ఆసక్తి చూపుతారు. సోనీ సంస్థ తాజాగా విడుదల చేసిన ‘ఎక్స్పీరియా ఎక్స్జెడ్1’ ఫోన్పై ఇపుడు ఇలాంటి ఆసక్తే నెలకొంది.
మనం అత్యవసర పనిలో నిమగ్నమైనా, డ్రైవింగ్లో ఉన్నా- ఏ మాత్రం ఇబ్బంది పడకున్నా కోరుకున్న వ్యక్తికి క్షణాల్లో స్మార్ట్ఫోన్లో వెంటనే కాల్ చేయవచ్చు. ‘డాడ్’ అని చెబితే నాన్నకు, ‘మామ్’ అని చెబితే అమ్మకు వెంటనే ఫోన్కాల్ వెళ్తుంది. ఇలాంటి సేవలెన్నింటినో మనకు అందుబాటులో ఉంచేలా గూగుల్ సంస్థ ‘గూగుల్ అసిస్టెంట్’ పేరుతో వినూత్న యాప్ను తీర్చిదిద్దింది.
స్మార్ట్ఫోన్ ఎంత ఖరీదైనప్పటికీ ఛార్జింగ్ సమస్య తలెత్తితే అది ఎందుకూ కొరగానిదవుతుంది. అత్యవసరం అనుకున్న సమయంలో ఫోన్కు ఛార్జింగ్ లేకుంటే మనం పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఛార్జింగ్ కూడా క్షణాల్లో అయిపోవాలని కాసేపు ఓపిక పట్టేందుకు కూడా చాలామంది అసహనం ప్రదర్శిస్తుంటారు. అందుకే- కేవలం సెకన్ల వ్యవధిలోనే స్మార్ట్ఫోన్ పూర్తి స్థాయిలో ఛార్జ్ అయ్యే కాలం తొందరలోనే వస్తోందట!
నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో వీడియో కాల్స్ కీలకపాత్ర పోషిస్తున్నాయి. సామాజిక సంబంధాల వెబ్సైట్ల ద్వారా ఇద్దరు వ్యక్తులు లేదా గ్రూప్స్ మధ్య జరిగే సంభాషణలకు వీడియో కాల్స్ మరింత వాస్తవికతను తీసుకువస్తున్నాయి. వీడియో కాలింగ్ అందుబాటులోకి రాకముందు కేవలం వాయిస్ కాల్స్ ద్వారా మాత్రమే సంభాషణలు సాగేవి. ఈ క్రమంలో అవతలి వ్యక్తుల స్వరాన్ని మాత్రమే వినగలిగే అవకాశం వుండేది.
కిక్ బాక్సింగ్, కరాటే వంటి యుద్ధక్రీడల్లో పురుషులకు తప్ప మహిళలకు అవకాశం లేదన్న సనాతన వాదనలను తిప్పికొట్టినందుకు తనకెంతో సంతోషంగా ఉందని మైసూరుకు చెందిన పూజా హర్ష గర్వంగా చెబుతోంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి కిక్ బాక్సింగ్లో తొలి మహిళా జాతీయ కోచ్గా ఎంపికైన ఘనత ఆమెకే దక్కింది.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘గ్లోబల్ అండర్ గ్రాడ్యుయేట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’కు ఎంపిక కావడంతో హైదరాబాద్ యువతి సౌమయాని ఘోషాల్ అరుదైన ఘనతను సాధించింది. పిట్స్బర్గ్ (అమెరికా)లోని ఛాతమ్ విశ్వవిద్యాలయంలో స్కాలర్షిప్ పొందేందుకు భారత్ నుంచి ఈ ఏడాది ఎంపికైన అయిదుగురిలో ఘోషాల్ ఒకరు కావడం విశేషం.