S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఓ చిన్నమాట!
నాచిన్నప్పుడు శివరాత్రి సమయంలో మా వూరికి సర్కస్ వచ్చేది. ఆ సర్కస్లో వ్యక్తులు చేస్తున్న ఫీట్లు చూసి చాలా ఆశ్చర్యం వేసేది. ఒక జూలా వదిలి గాలిలో కొంచెం దూరం ప్రయాణం చేసి మరో జూలా పట్టుకునేవాళ్లు.
ఎంత నేర్పు.
ఎంత ఏకాగ్రత.
ఎంత ధైర్యం.
ఆశ్చర్యం, భయం రెండూ కలిగేవి.
ప్రతి విషయాన్ని విమర్శించడం సులువు.
సాంకేతికంగా అభివృద్ధి చెందిన సమాజంలో ప్రతి వస్తువును విమర్శించవచ్చు.
టీవీ లేక ముందు మనుషుల మధ్య సంబంధాలు బాగా వుండేవి. అది వచ్చిన తరువాత మనుషుల జీవితాలు పూర్తిగా మారిపోయాయని విమర్శించవచ్చు.
చాలామంది రచయితలు, కవులు మూడ్ వచ్చినప్పుడు రాద్దామని అనుకుంటారు. అలాగే రాస్తామని కూడా చెబుతూ వుంటారు.
మేం రచనలు ప్రారంభించిన కొత్తలో ఓ సీనియర్ రచయిత మాకు ఓ మాట చెప్పాడు. రోజూ రాయాలి. మూడ్ అదే వస్తుంది అని.
సృష్టిలో చాలా జంతువులు అంతరించిపోతున్నాయి. అందుకు కారణాలు ఎన్నో.
మారుతున్న పరిస్థితులకి తగినట్టు అని మార్పు చేసుకోకపోవడం కూడా ప్రధాన కారణం.
చాలామంది మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా మారకుండా ఉంటారు. చాలా విషయాల్లో అదే విధంగా ప్రవర్తిస్తుంటారు. మార్పుని గమనించాలి. మారిన పరిస్థితుల ప్రకారం మసలుకోవాల్సి వుంటుంది.
స్మార్ట్ఫోన్లు వచ్చిన తరువాత జీవనశైలి మారిపోయింది. చాలా పనులు సులువుగా మారిపోయినాయి.
ఈమధ్య ఓ కథ చదివాను. ఉపయోగం గురించిన కథ అది.
కేసీ అనేది ఓ పక్షి. అడవిలో వుంటుంది. దాని రెక్కలు చిన్నవి. శరీరం పెద్దది. పేరుకి అది పక్షే కానీ అది ఎగరలేదు. అడవిలో చెట్టు నుంచి రాలిపడిన పండ్లని తింటుంది. అడవి చుట్టూ తిరుగుతుంది.
మిగతా పక్షులు కేసీని చూసి నవ్వుకునేవి. మరికొన్ని జాలి పడేవి. కానీ ఈ విషయాలు కేసీకి తెలిసేవి కాదు.
కోడిగుడ్డుని చూసి మనం చాలా విషయాలని ఊహించుకోవచ్చు. అది బలం ఇస్తుందని, కోడిపిల్లలు అందులో నుంచి వస్తాయని ఇలా ఎన్నైనా ఊహించుకోవచ్చు.
మా చిన్నప్పుడు బ్రాయిలర్ కోళ్లు లేవు. జీవం లేని కోడిగుడ్లు లేవు. ఇప్పుడు మనం నాటుకోడి అని మనం వేటినైతే అంటున్నామో ఆ కోళ్లే వుండేవి.
ఫ్లాట్ నుంచి విల్లాకు మారి ఓ ఆరుమాసాలు అవుతోంది. గృహ ప్రవేశం చేసినప్పుడు మా అన్నయ్య కొడుకు శివప్రసాద్ అమెరికాలో వున్నాడు. అందుకని కొత్త ఇంటికి రాలేకపోయాడు. ఓ పూజ వుంది రమ్మని పిలిచాను. ఓ రెండు మూడు రోజులు మాతో గడిపే విధంగా వచ్చాడు. నాకన్నా రెండు సంవత్సరాలు చిన్న అతను.
కొంతమంది కుక్కలని పెంచుకుంటారు. మరి కొంతమంది పిల్లులని పెంచుకుంటారు. ఇంకా కొంతమంది అక్వేరియమ్లలో చేపలని పెంచుతారు.
పావురాలని, పక్షులని పెంచుకునే వాళ్లు ఎందరో.
ఒక్కొక్కరి అభిరుచి ఒక్కో రకంగా ఉంటుంది.
మనుషులని పెంచడం కొంతమేరకు మాత్రమే ఉంటుంది. వాళ్లు కాస్త పెద్దవాళ్లు అయిన తరువాత స్వేచ్ఛా జీవులుగా మారిపోతారు.
పెంపుడు జంతువులు వేరు. మనుషులు వేరు.
సృష్టిలో పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవాలి. యువకుడిలాగా ఎవరూ ఎప్పుడూ వుండలేరు. వయస్సు వస్తుంది.
ఈ మధ్య వార్తాపత్రికలో ఓ వార్త చూశాను. ఓ వ్యక్తి బొమ్మ చూశాను. గతంలో అతను ప్రభుత్వంలో ఓ ఉన్నతాధికారి. ప్రధాన సమాచార కమిషనర్గా పని చేశారు. కానీ ఇప్పుడు అతను అన్నీ మరిచిపోయాడు. అతన్ని చూడటానికి ఇద్దరు ముగ్గురు మనుషులు అవసరం ఏర్పడినారు.