శ్రీమతిగా...!
Published Friday, 1 September 2017తెలుగు, తమిళ చిత్రాల్లో అతి తక్కువ సమయంలో అగ్ర హీరోలందరి సరసన ఆడిపాడిన ముద్దుగుమ్మ ప్రియమణి శ్రీమతిగా కొత్త అవతారం ఎత్తింది. అవతారమంటే చిత్రాల్లో కాదు సుమా! నిజ జీవితంలో శ్రీమతిగా అడుగుపెట్టింది. ప్రముఖ వ్యాపారవేత్త ముస్త్ఫా రాజ్తో కొనే్నళ్లుగా పీకలోతు ప్రేమలో కూరుకుపోయింది. ఒకరినొకరు గాఢంగానే ప్రేమించుకున్నారు. ఈ ప్రేమజంట ఇటీవలే జరిగిన పెళ్లితో ఒక్కటయ్యారు. బెంగళూరు శివాజీనగర్లో ప్రియమణి-ముస్త్ఫా రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. బంధువులకు, సినీ ప్రముఖులకు గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చారు. రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ మెహందీ ఫంక్షన్ మాత్రం అత్యంత వైభవంగా జరుపుకున్నారు. మెహందీకి బంధువులు, ఫ్రెండ్స్ని మాత్రమే ఆహ్వానించారు. పెళ్లి తర్వాత ఇక సినిమాలకు ప్రియమణి గుడ్ బై చెప్పేస్తుందనుకుంటే పొరపాటే! పెళ్లి అయిన ఐదవ రోజునుంచే షూటింగుల్లో పాల్గొంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. హనీమూన్ గట్రా పెట్టుకోకుండా షూటింగులతో బిజీ మారిపోయిన ప్రియమణిని చూసి అందరూ వాహ్.. ప్రియమణి అంటున్నారంతా. దటీజ్.. ప్రియమణి!!