బిజీ బిజీగా..!
Published Friday, 19 January 2018వరుస విజయాలతో జోష్మీదున్న నాని, తాజాగా కృష్ణార్జునయుద్ధం షూటింగ్ పూర్తిచేశాడు. మేర్లపాక గాంధి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. ఇలా అనుపమ కెరీర్లో బిజీ బిజీగా మారుతోంది. క్షణం తీరిక లేకుండా షూటింగ్లంటూ ఔట్డోర్లో తెగతిరిగేస్తోంది. ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేశాడు. సినిమా పూర్తయ్యాక మరో సినిమాను కిశోర్ తిరుమల దర్శకత్వంలో చేయడానికి సిద్ధమయ్యాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం మార్చి రెండవ వారంలో ప్రారంభం కానున్నదట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కార్యక్రమాలు జరుగుతోంది. నాని నిర్మాతగా మారి రూపొందిస్తున్న ‘అ’ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కానుంది. అయతే యువతరం హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ అనుపమా పరమేశ్వరన్ వేగంగానే దూసుకెళుతోంది.