రవితేజ సరసన..
Published Friday, 19 January 2018‘రాజా ది గ్రేట్’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న రవితేజ, ప్రస్తుతం విక్రమ్ సిరి దర్శకత్వంలో ‘టచ్ చేసి చూడు’ చిత్రంలో నటిస్తున్నారు. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, సీరత్కపూర్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ నెలలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘నేల టికెట్’ చిత్రం చేయనున్నాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి శక్తికాంత్ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్గా కొత్త అమ్మాయి మాళవికా శర్మ నటిస్తోందని తెలుస్తోంది.