మంచానికి మాత్రమే ఏసీ
Published Saturday, 5 May 2018వేసవికాలంలో పడుకునేటప్పుడు ఏసీ వేసుకుంటాం. గదంతా చల్లబడడానికి సమయం పడుతుంది. ఆ ఏసీ పవనాలు ఆస్వాదించడానికి చాలా కరెంటు ఖర్చు అవుతుంది. అలా కాకుండా కేవలం మనం పడుకున్న మంచం మాత్రమే చల్లబడితే కరెంటుఖర్చు తగ్గుతుంది కదా.. అని ఆలోచించారేమో పరిశోధకులు ఈ మంచం ఏసీని కనిపెట్టేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన ఎరీస్ ఇంటర్నేషనల్ మారిటైమ్ రీసెర్చ్ ఇన్సిటిట్యూట్, ఎరీస్ ఇంటర్నేషనల్ ఇంటీరియర్స్ సంయుక్తంగా సోలార్ పవర్డ్ కండీషనింగ్ బెడ్ను తయారుచేశాయి. ఇందులో మంచం చుట్టూ అక్రిలిక్తో తయారుచేసిన ప్యానెల్స్ను అమరుస్తారు. ఆ ప్రాంతం వరకు మాత్రమే సౌరశక్తితో నడిచే ఏసీ పనిచేస్తుంది. ఈ ప్యానెల్స్ని మన ఇంట్లోని మంచానికి కూడా అనుసంధానించవచ్చు. మామూలు ఏసీకయ్యే శక్తిలో ఇరవై శాతం ఖర్చుతో ఇది నడిచేస్తుంది. ఇంకెందుకాలస్యం.. మరి ఈ ఏసీలను మంచాలకు అమర్చుకుని ఏసీ ఖర్చులను, కరెంటు ఖర్చులను తగ్గించుకోవచ్చు కదూ..
చల్లని నగలు
=========
వేసవి వచ్చిందంటే శరీరమంతా చికాకుగా ఉంటుంది. వేడికి మెడ ఒరుసుకుపోయినట్లు ఉంటుంది. అలాంటివాళ్లు నగలు వేసుకోవాలంటేనే చికాకు పడుతుంటారు. వారికోసం హాట్ గర్ల్స్ పెరల్స్ పేరుతో చల్లచల్లని ముత్యాల గొలుసులు మార్కెట్లోకి వచ్చేశాయి. ఈ ముత్యాల్లో కూలింగ్ జెల్ను నింపుతారు. వీటిని ఫ్రిజ్లో పెడితే వీటిలోపలున్న జెల్ బాగా చల్లబడి వాటిని ధరించినప్పుడు ఆ జెల్లో కూల్ ఉన్నంతవరకూ ఆ నగలు చల్లచల్లగా గిలిగింతలు పెడతాయి. ఇవి ఆన్లైన్లో విరివిగా దొరుకుతున్నాయి.