S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కృష్ణా ట్రిబ్యునల్ విచారణ నేటికి వాయిదా

న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన కృష్ణా నదీ జలాలను రెండు తెలుగు రాష్ట్రాలకు విభజించేందుకు ఉద్దేశించిన జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు మంగళవారం తెలంగాణ క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగింది. కృష్ణా నదిలో నీటి లభ్యతకు సంబంధించిన అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరపు సాక్షిగా ఉన్న విశే్వశ్వరరావును తెలంగాణ తరపు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ట్రిబ్యునల్ ముందు వైద్యనాథన్ అడిగిన ప్రశ్నలకు విశే్వశ్వరావు సమాధానాలిచ్చారు. బుధవారం కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగనుంది.
విద్యుత్ ఉద్యోగుల కేసు నేటికి వాయిదా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన కేసు విచారణను సుప్రీం కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. మంగళవారం ఈ కేసు విచారణకు రాగా మరో కేసు విచారణ ఉన్నందున ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది.