ఎయిర్ ఇండియా డైరెక్టర్గా పురంధ్రీశ్వరి
Published Friday, 21 September 2018న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత పురంధ్రీశ్వరిని ఎయిర్ ఇండియా బోర్డు ఇండిపెండెంట్ డైరెక్టర్గా కేంద్రం నియమించింది. కేంద్ర మంత్రి వర్గ కమిటీ నిర్ణయం మేరకు ఎయిర్ డైరెక్టర్గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులను జారీచేశారు. నాన్ అఫీషియల్ ఇండిపెండెంట్ హోదాలో ఆమె మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఎయిర్ ఇండియా పదవిలో నియమించినందుకుగాను పురంధ్రీశ్వరి కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.