చైనా ఓపెన్ బాడ్మింటన్ ఫైనల్కు మారిన్
Published Saturday, 22 September 2018చాంగ్జూ, సెప్టెంబర్ 22: చైనా ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్షిప్లో మాజీ ప్రపంచ నంబర్ వన్, ప్రస్తుత ఐదో ర్యాంక్ క్రీడాకారిణి కరోలినా మారిన్ మహిళల సింగిల్స్లో ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో ఆమె జపాన్కు చెందిన నజోమీ ఒకుహరాను 15-21, 21-12, 21-13 తేడాతో ఓడించింది. మొదటి సెట్ను చేజార్చుకున్నప్పటికీ, ఆతర్వాత వరుసగా రెండు సెట్లను తన ఖాతాలో వేసుకుని టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేసింది. ఫైనల్లో ఆమె చెన్ యూఫెయ్తో తలపడుతుంది. మరో సెమీ ఫైనల్లో యూఫెయ్ 21-14, 15-21, 21-14 ఆధిక్యంతో జపాన్కే చెందిన అకానే యమాగూచీపై విజయాన్ని నమోదు చేసింది. కాగా, పురుషుల సింగిల్స్లో ఆంథోనీ సినిసుకా జింటింగ్, కెంటో మొమొతా ఫైనల్లో ఢీ కొంటారు. హోరాహోరీగా సాగిన తొలి సెమీ ఫైనల్లో జింటింగ్ 12-21, 21-17, 21-15 స్కోరుతో చౌ తియెన్ చెన్పై గెలుపొందాడు. రెండో సెమీ ఫైనల్లో మొమొతా 21-10, 21-17 ఆధిక్యంతో షి యుకీపై వరుస సెట్లలో గెలుపొంది ఫైనల్ చేరాడు.
చిత్రం..కరోలినా మారిన్