తీవ్ర అస్వస్థతకు గురైన కుర్తాళం పీఠాధిపతి
Published Sunday, 23 September 2018విజయవాడ, సెప్టెంబర్ 22: పరమహంస పరివ్రాజకాచార్య కుర్తాళం పీఠాధిపతి శంకరచార్య సిద్ధేశ్వరానంద భారతీస్వామి హఠాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చతుర్మాసదీక్ష అనంతరం గుంటూరుకు తిరుగు ప్రయాణంలో శనివారం సాయంత్రం విశాఖపట్టం నుంచి విజయవాడ వచ్చే విమానంలో తీవ్ర అస్వస్థతకు గరికావడంతో గన్నవరం విమానాశ్రయం నుంచి ఆగమేఘాలపై విజయవాడలోని రమేష్ కార్డియాక్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆరోగ్య పరీక్షలు జరుగుతున్నాయి. స్వామి వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.