ఏపీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియామకాల పునరుద్ధరణ
Published Sunday, 23 September 2018విజయవాడ, సెప్టెంబర్ 22: ఆర్టీసీలో గత రెండున్నర సంవత్సరాల క్రితం రద్దయిన కారుణ్య నియామకాలు పునరుద్ధరించినట్లు గుర్తింపు సంఘం ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సర్వీస్లో ఉద్యోగి చనిపోతే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే సాంప్రదాయం గతంలో ఉండేదన్నారు. ఈ విషయంపై సంస్థ ఎండీ ఎన్వీ సురేంద్రబాబుతో చర్చించిన మీదట తిరిగి నియామకాలు చేపట్టేందుకు మానవతా దృక్పథంతో అంగీకరించారని అన్నారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న 1100 మంది దరఖాస్తుదారులు డ్రైవర్ పోస్టుకు అర్హత కలిగిన వారిని తక్షణం ఆయా రీజనల్ మేనేజర్ కార్యాలయాలను సంప్రదించాలన్నారు. తక్షణం గుంటూరు జిల్లాలో ఖాళీ ఢ్రైవర్ పోస్టులకు భర్తీ చేయనున్నామని అన్నారు.