ఏసీబీకి చిక్కిన బిల్ కలెక్టర్
Published Sunday, 23 September 2018కర్నూలు సిటీ, సెప్టెంబర్ 22: కొత్త ఇంటి యజమాని పేరు మార్చేందుకు రూ.6 వేలు లంచం తీసుకున్న కర్నూలు నగర పాలక సంస్థ బిల్ కలెక్టర్ ఎస్ఎండీ షరీఫ్ను ఏసీబీ అధికారులు శనివారం అరెస్టు చేశారు. నగరానికి చెందిన జహంగీర్ ఖాశీం బాలాజీనగర్లో కొన్న ఇంటిని తన పేర మార్చుకునేందుకు బిల్ కలెక్టర్ను కలవగా ఆయన రూ. 6 వేలు లంచం అడిగాడు. దీంతో ఖాశీం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు శనివారం బిల్ కలెక్టర్ షరీఫ్కు రూ.6 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ జయరాజ్ అదుపులోకి తీసుకున్నారు.