మహిళల మెడలో బంగారు గొలుసు చోరీ
Published Tuesday, 13 November 2018సంతనూతలపాడు, నవంబర్ 13 : మండలంలోని మద్దులూరు గ్రామానికి చెందిన నెప్పల శేషమ్మ అనే మహిళ మెడలోని బంగారు గొలుసును మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా లాక్కొని వెళ్లారు. వివరాల్లోకి వెళితే మద్దులూరు గ్రామానికి చెందిన నెప్పల శేషమ్మ పశువుల మేతకు పొలానికి వెళ్లి తిరిగి ఇంటి వచ్చే మార్గంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్పై వచ్చి చిరునామా అడిగినట్లు నటించి శేషమ్మ మెడలోని రెండు సవర్ల బంగారు నాన్తాడును బలవంతంగా లాక్కొని మోటార్ సైకిల్పై ఊడాయించారు. ఈ హఠాత్ పరిణామానికి ఖంగుతిన్న బాధితురాలు తేరుకుని కేకలు వేసి గ్రామస్థులకు విషయం తెలిపింది. దీంతో గ్రామస్థులు పరిసర ప్రాంతాలను పరిశీలించి వారి ఆనవాళ్లను బాధితురాలి ద్వారా తెలుసుకొని సంతనూతలపాడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొంత సేపటికి బాధితురాలు ఇచ్చిన ఆనవాళ్ల ప్రకారం ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్పై పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే వారిని అదుపులోకి తీసుకొని వారిని ఎస్ఐ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. అయితే గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం వీరు తెనాలి ప్రాంత సమీపానికి చెందిన వారని సమాచారం.