ఓపెన్ ఫోరంలో 6 దరఖాస్తులకు అనుమతి
Published Friday, 16 November 2018విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 16: సీఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ ఫోరం కార్యక్రమంలో 6 దరఖాస్తులకు ప్రాథమిక అనుమతులు మంజూరు చేశారు. శుక్రవారం ఉదయం నగరంలోని సీఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించిన ఓపెన్ ఫోరంలో మొత్తం 9 దరఖాస్తులు రాగా నిబంధనలకు అనుగుణంగా ఉన్న 6 దరఖాస్తులకు తక్షణ అనుమతులు మంజూరు చేశారు. మిగిలిన 3దరఖాస్తులకు అదనపు సమాచారం కోరారు. వీటిలో ఆక్యుపెన్సీ సర్ట్ఫికేట్ కోసం వచ్చిన 7 దరఖాస్తులలో 5 దరఖాస్తులను ఆమోదించారు. ఫైనల్ లే అవుట్ కోసం వచ్చిన 2 దరఖాస్తులలో ఒకదానిని అమోదించి మరొక దానికి అదనపు సమాచారం కోరారు. ఈ కార్యక్రమంలో సీఆర్డీఏ డెవలప్మెంట్ ప్రమోషన్ విభాగం డైరెక్టర్ కె నాగసుందరి, జాయింట్ డైరెక్టర్ బీ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
నేడు దుర్గగుడి
ట్రస్ట్బోర్డు సమావేశం
ఇంద్రకీలాద్రి,నవంబర్ 16: పాతబస్తీ రాజకుమారి థియేటర్ ఎదుట ఉ న్న మాడపాటి వారి సత్రంలో శనివా రం ఉదయం దుర్గగుడి పాలక వర్గ స మావేశం జరుగనుంది. ఈకార్యక్రమానికి ఈవో వీ కోటేశ్వరమ్మ, చైర్మన్ గౌ రంగబాబు ఆధ్వర్యంలో వివిధ అంశాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
దుర్గమ్మ సేవలో మంత్రి పితాని
ఇంద్రకీలాద్రి, నవంబర్ 16: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీకనకదుర్గమ్మను శుక్రవారం మంత్రి పితాని సత్యనారాయణ సతీసమేతంగా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు. రాజగోపురం వద్ద వీరికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆశీర్వాద మండపంలో ఈవో కోటేశ్వరమ్మ మంత్రి దంపతులకు అమ్మవారి శేష వస్త్రం, చిత్రపటం, ప్రత్యేక ప్రసాదాలను అందచేశారు.