మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తి పునఃప్రారంభం
Published Tuesday, 1 December 2015న్యూఢిల్లీ, నవంబర్ 30: దేశవ్యాప్తంగా ఉన్న నెస్లే ఉత్పాదక కేంద్రాల్లో నూడుల్స్ తయారీ పునఃప్రారంభమైంది. ఈ మేరకు నెస్లే ఇండియా సోమవారం ప్రకటించింది. మ్యాగీ నూడుల్స్లో ఆరోగ్యానికి హానికరం చేసేలా మోనోసోడియం గ్లూటమేట్, లెడ్ పదార్థాలు మోతాదుకు మించి ఉన్నాయని ఎఫ్ఎస్ఎస్ఎఐ నిషేధం విధించినది తెలిసిందే. అయితే కోర్టు జోక్యంతో తిరిగి నవంబర్ 9న మార్కెట్లోకి మళ్లీ మ్యాగీ నూడుల్స్ ప్రవేశించగా, కర్నాటక, పంజాబ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లోని ప్లాంట్లలో నూడుల్స్ ఉత్పత్తి మొదలైందని నెస్లే తెలియజేసింది.