ఉభయ సభల్లో నేడు గవర్నర్ ప్రసంగం
Published Friday, 18 January 2019హైదరాబాద్, జనవరి 18: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం రెండో శాసనసభ ఏర్పాటు కావడంతో పాటు సభ సమావేశాలు ప్రారంభం కావడంతో శనివారం నాడు శాసనసభ, శాసనమండలి సభ్యులను ఉద్దేశించి శాసనసభ ప్రాంగణంలో గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. కొత్త సభ ప్రారంభం అయినపుడు, బడ్జెట్ సమావేశాల సమయంలో గవర్నర్ ఉభయ సభలను ఉద్ధేశించి మాట్లాడటం ఆనవాయితీగా వస్తోంది. ఈ విషయాన్ని స్పీకర్ పొచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం నాడు శాసనసభలో ప్రకటించారు. శనివారం నాడు శాసనసభ ఉదయం 11.30 గంటలకు సమావేశం కానుంది. అనంతరం గవర్నర్ ప్రసంగిస్తారు.