S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాక్‌పై దాడి చేయండి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: కాశ్మీర్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని, పాకిస్తాన్‌పై దాడి చేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఈ మేరకు వీహెచ్‌పీ వర్కింగ్ అధ్యక్షుడు అలోక్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. ఆర్మీ పాకిస్తాన్‌పై దాడి చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. మతంపేరుతో మారణహోమం సృష్టిస్తున్న పాకిస్తాన్ కుయుక్తులను సహించరాదన్నారు. జిహాదీ శక్తుల ఆటలను కొనసాగనివ్వరాదన్నారు. ఈ దాడికి ధీటైన జవాబు చెప్పాలన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం తన భూభాగంపై ఉగ్రవాద కార్యకలాపాలకు అనుమతి ఇస్తోందన్నారు. భారత్ లక్ష్యంగా పనిచేసే ఉగ్రవాద తండాలకు చేయూత నిస్తున్న పాకిస్తాన్ ఆగడాలు మితిమీరాయని, ఇక ఏ మాత్రం ఉపేక్షించరాదన్నారు. ఉగ్రవాద శక్తులతో పాక్ ప్రభుత్వం కుమ్మక్కైందన్నారు. పుల్వానా జిల్లాలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాద దాడిని ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. మతతత్వ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ శక్తులను నిర్వీ ర్యం చేయాలన్నారు. దేశద్రోహానికి పాల్పడే కరడు గట్టిన మతశక్తులను గుర్తించి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పాక్‌కు గట్టి జవాబు చెప్పేందుకు వీలుగా ఆర్మీకి పూర్తి స్వేచ్చ ఇవ్వాలన్నారు. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం తగదన్నారు.