S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వైభవంగా తెప్పోత్సవం

ఇంద్రకీలాద్రి: పవిత్ర కృష్ణానదీలో సాయంత్రం భూదేవి, శ్రీ దేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గోవిందా గోవిందా అంటూ భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కలియుగ వైకుంఠవాసుని కీర్తిస్తుండగా ఈతెప్పోత్సవం కడు రమణీయంగా జరిగింది. పాతబస్తీ బ్రాహ్మణ వీధీ భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివార్ల దేవస్థానంలో శ్రీ వారి బ్రహోత్సవాల సందర్భంగా మంగళవారం సాయంత్రం అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు దుర్గా ఘాట్‌మవ కూర్చొని శ్రీవారిని స్మరణ చేస్తుండగా పవిత్ర కృష్ణనదీలో శ్రీవారి తెప్పోత్సవం జరిగింది. పాతబస్తీకి చెందిన భక్తులతోపాటు విజయవాడ నగరంలో వివిధ ప్రాంతాలకుచెందిన భక్తులు మంగళవారం సాయంత్రం 4గంటలకే దుర్గా ఘాట్‌కు చేరుకున్నారు. తొలుత ఒక ప్రత్యేక పంటును వివిధ రకాలైన పుష్పాలతో అలంకరించి వివిధ రకాలైన విద్యుత్ లైట్లులను అమర్చటంతోపాటు ఒక ప్రత్యేక వేదికను సైతం ఏర్పాటు చేశారు. దేవస్థానం ఈవో ఎస్ హేమలతాదేవి సూచన మేరకు ఆలయ అర్చకులు పాణింగిపల్లి శ్రీరామచంద్రమూర్తి, పరాశరం మురళీకృష్ణచార్యులు ఆధ్వర్యంలో ఉత్సవ మూర్తులను పంట్‌లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక వేదికపై ఉంచారు. వందలాది భక్తులు గోవింద గోవింద నామస్మరణ చేస్తుండగా పవిత్ర కృష్ణనదీలో శ్రీవారు శ్రీదేవి, భూదేవి సమేతగా సర్వ అభరణాలను ధరించి నదీ విహారం చేశారు. సంప్రదాయ ప్రకారం మూడు సార్లు శ్రీ వారి ప్రత్యేక వాహానం జల విహారం చేసింది. తొలుత ఆలయం వద్ద నుండి దేవతమూర్తులను ఊరేగింపుగా దుర్గా ఘాట్ వద్దకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో దేవదాయ ధర్మదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, తనిఖీ అధికారి ఎ సుజన్‌కుమార్, దేవస్థానం కమిటీ మాజీ చైర్మన్ కొనగళ్ళ విద్యాధరరావు, వంకదారు వాసుదేవరావు, మాజీ ధర్మకర్తలు అడ్డూరి లక్ష్మణరావు, పొట్నూరి దుర్గా ప్రసాద్,నూకళ్ళ వాసు, తదితరులు పాల్గొన్నారు. ఇందులోభాగంగా ఉదయం అర్చకులు కృష్ణా నదికి వెళ్ళి పవిత్ర జలాలను ఊరేగింపుగా తీసుకొచ్చి మూల విరాట్‌కు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఈవో హేమలతాదేవి దంపతుచేత అర్చకులు పూర్ణాహుతి చేయించారు. రాత్రి 9గంటలకు ధ్వజావరోహణం, ఆశ్వవాహనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి రాత్రి వరకు జరిగి శ్రీవారి కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.

మనోనిశ్చలతకు నాంది మాఘపౌర్ణమి
ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 19: మనోనిశ్చలతకు నాంది మాఘపౌర్ణమి అని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు బ్రహ్మశ్రీ పసుమర్తి కామేశ్వర శర్మ పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీ ఎదురుగా ఉన్న శ్రీ విజయేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో 40వ అరుణ పారాయణమహోత్సవాలు సందర్భంగా మంగళవారం మాఘ పౌర్ణమి సందర్భంగా కలియుగ ప్రత్యేక దైవం శ్రీ సూర్యనారాయణ మూర్తికి విశేషార్చనలు జరిగాయి. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ పసుమర్తి కామేశ్వర శర్మ మాట్లాడుతూ పౌర్ణమి చంద్ర సంబంధమైన తిధి అని, చంద్రుడు మనస్సుకు అధిపతి అని చంద్ర గ్రహ అనుగ్రహంతోమనస్సు నిర్మలంగా ఉంటుందన్నారు. మఖానక్షత్రంమలో పౌర్ణమి వస్తే అది మాఘమాసమన్నారు. మఖా నక్షత్రం సింహరాశిలో ఉంటుందని, ఈ రాశికి అధిపతి రవి అని పసుమర్తి వివరించారు. రవిచంద్రులు ఇద్దరూ మిత్రులని, రవికిరణాలు చంద్రుని మీద పడితే చంద్రుడు ప్రకాశించటం జరుగుతోందన్నారు. మనలో రవిచంద్రులు ఇద్దరూ ఉంటారనీ, హృదయ కారకుడు రవి, మనస్సు కారకుడు చంద్రుడనీ పసుమర్తి పేర్కొన్నారు. జీవితంలో ఎదురయ్యే అటుపోట్లకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని, అటువంటి వారికి ఆత్మ స్ధైర్యాని, మనోధైర్యాన్ని ఇచ్చే మార్గాన్ని చూపించేది మాఘ పౌర్ణమి అని పసుమర్తి భక్తులకు వివరించారు. మంచి చెడుల పుణ్య పాప ఫలితాలను ఈశరీరం ద్వారా అనుభవించటం జరుగుతోందని, ఆ అనుభవం మనస్సుపై పడి తీవ్రమైన సంక్షోభానికి మానవులు గురవుతున్నారని ఈవిధంగానే మంచి చెడుల ప్రభావం సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు మీదపడి, నాడీ స్పందన జరిగి, హృదయ కండరాలు ఒత్తడికీ లోనవుతాయని ఆసమయంలో శరీరం అనారోగ్యానికి గురైవుతోందన్నారు. రోహిణీ, హస్త, శ్రవణం, ఈమూడు చంద్ర నక్షత్రాలని, ఇందులో రోహిణీ వృషభ రాశిలో ఉంటుందని, వృషభరాశి చంద్రునికి ఉచ్ఛరాశి అని ఆయన వివరించారు. ఒకరితోపోల్చుకోకుండా, తనకు ఉన్న దానితో సంతృప్తి పడితే మనోనిశ్చలను పొందుతారని, అప్పుడు జీవితం సుఖమయం, సుసంపన్నం అవుతోందని అన్నారు. అన్నదాత ఆరోగ్య ప్రదాత అయిన సూర్యనారాయణ మూర్తి సౌర తేజస్సు, కాశీ అన్నపూర్ణాదేవి పూర్ణ తత్త్వం రెండు ఒకటేనని అది ఎప్పుడూ పూర్ణమేననీ, ఇదే మాఘ పౌర్ణమిపూర్ణ తత్త్వమని మాఘ పౌర్ణమి విశిష్ఠతను పసుమర్తి వివరించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు ఆయన వేద అశీస్సులను అందచేసి సూర్యనారాయణమూర్తికి నివేదించిన మహాప్రసాదాన్ని భక్తులకు పెద్ద ఎత్తున్న ఉచితంగా పంపిణీ చేశారు.