S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ద్వాదశ జ్యోతిర్లింగ వైభవం

పరమశివుడు భక్తుల శ్రేయస్సును మదిలోనెంచి ద్వాదశ జ్యోతిర్లింగాలుగా ప్రకటితుడైనాడు. వాటిలో మొదటిది సౌరాష్ట్రంలోని సోమనాథ జ్యోతిర్లింగం. 2. శ్రీశైలంలో మల్లికార్జున, 3. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర లింగం, 4. ఓంకారేశ్వర లింగం, 5. కేదారేశ్వర లింగం, 6. భీమేశ్వర జ్యోతిర్లింగం, 7. కాశీలో శ్రీ విశే్వశ్వర లింగం, 8. త్య్రంబకేశ్వర లింగం, 9. వైద్యనాథేశ్వర లింగం, 10. దారుకవనంలో శ్రీనాగేశ్వర లింగం, 11. శ్రీరామేశ్వర జ్యోతిర్లింగం, 12. ఘుశే్మశ్వర జ్యోతిర్లింగం.
ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల చరిత్ర అద్భుతం. మహనీయం. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం - నిత్యస్మరణం భవసాగర తరుణోపాయం, ముక్తిదాయకం. పరమేశ్వరుని అనుగ్రహపాత్రం. ఒక్కొక్క జ్యోతిర్లింగావిర్భావం ఒక్కో అద్భుత ఘట్టం.
సోమనాథ జ్యోతిర్లింగం
పురాణోక్తి ననుసరించి దక్ష ప్రజాపతికి 27గురు కన్యలు. యుక్త వయస్సు రాగానే చంద్రునికిచ్చి పెండ్లి చేశారు. 27 మందిలో రోహిణి అందగత్తెయని అభిమానంతో చంద్రుడు ఒక్క రోహిణితోనే గడుపుతున్నాడు. మిగిలిన వారిని నిర్లక్ష్యం చేస్తుంటే, వారు తండ్రి దక్షునితో మొర పెట్టుకున్నారు. మామగారు చంద్రుని పిలిచి రెండుసార్లు మందలించాడు. చంద్రుని తీరు మారలేదు. కోపంతో క్షయ రోగివై పొమ్మని దక్షుడు అల్లుడైన చంద్రుని శపించాడు. చంద్రకాంతి తరిగిపోతుండగా దుఃఖించి చంద్రుడు దీనుడై బ్రహ్మ నాశ్రయించగా, బ్రహ్మ కరుణించి చంద్రా! ప్రభాస తీర్థానికి వెళ్లి అక్కడ పార్ధివ లింగారాధన చేయి అంటూ మృత్యుంజయ మహామంత్రాన్ని ఉపదేశించాడు. ఆరు నెలలు చంద్రుడు అలాగే చేశాడు.
శివుడు ప్రత్యక్షమై ఇక నుండి కృష్ణ పక్షంలోని దినాలలో నీ కళలు తగ్గి తిరిగి శుక్ల పక్షంలో దినాదినాభివృద్ధి చెందుతాయి అని దక్ష శాపాన్ని సంస్కరించి దీవించాడు. ఆ వేళకు బ్రహ్మేంద్రాదుల కోరికపై చంద్రుడి పేరు మీద సోమనాథమనే జ్యోతిర్లింగంగా మారాడు. అక్కడ చంద్రకుండ ఉంది. ఆరు నెలలు ఆపకుండా ప్రతి దినము స్నాన మాచరిస్తే సకల రోగాలు నశించిపోతాయి. క్షేత్ర ప్రదక్షిణం వలన భూప్రదక్షిణ ఫలం సిద్ధిస్తుంది. సోమనాథుని ఆరాధిస్తే కుష్టు, క్షయాది రోగాలు నశిస్తాయి.
శ్రీశైల మల్లికార్జున లింగం
శివపార్వతుల ప్రేమ పుత్రుడైన కుమారస్వామి తల్లిదండ్రులపై అలిగి క్రౌంచ పర్వతం చేరాడు. కైలాస వాసులకు ఆయన లేని లోటు బాధగా అనిపించింది. పార్వతి పుత్ర వియోగం భరించలేక పోయింది. శివుని వేడుకొంది. ఇద్దరూ కలిసి క్రౌంచ పర్వతం చేరారు. అక్కడ శివుడు మల్లికార్జునుడనే పేరుతో జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. అమ్మవారు భ్రమరాంబగా మారింది. పుత్ర వ్యామోహంలో ఇద్దరూ చాలాకాలం అక్కడే వున్నారు. ప్రతి అమావాస్యనాడు ఆదిదంపతులు వెళ్లి పుత్రుని చూసి వస్తుంటారు.
మహాకాళేశ్వరం
అవంతీ నగరంలో వేద విప్రుడనే ద్విజుడు నిత్యం పార్థివ లింగార్చనం చేస్తూ శివానుగ్రహం పొందాడు. ఆయనకు దేవప్రియుడు - ప్రియ మేధుడు, సుకృతు, ధర్మవాహి అని నలుగురు కుమారులు. దూషణుడనే రాక్షసుడు తన సేనతో వచ్చి అవంతీ నగరాన్ని నాల్గు వైపుల నుండి ముట్టడించాడు. ప్రజలను హింసించాడు. దిక్కుతోచని జనులు వేద ప్రియుని పుత్రుల నాశ్రయించారు. ఆ సమయంలో వారు పార్థివ లింగారాధనలో వున్నారు. ప్రజల గోడు విన్నారు. మనందరికీ, సమస్త జగతికీ ఆ మహాశివుడే రక్ష గాన మాతోబాటు మీరు కూడా శివుని ధ్యానించండి అని చెప్పగా అందరూ శివధ్యానంలో వున్నారు.
దూషణుడు వచ్చి నల్గురు బ్రాహ్మణులనూ చంపబోగా వెంటనే పార్థివ లింగానికి వున్న ఒక చిన్న బొరియ వంటి దాని నుంచి వికట రూపంతో ‘మహాకాలుడి’గా శివుడు ఆవిర్భవించాడు. దూషణునీ, వారి సమూహాన్నీ దగ్ధం చేశాడు. ప్రజలూ - బ్రాహ్మణులు ఆ వికట రూపునికి మోకరిల్లి ప్రార్థించి, అక్కడే వెలసి వుండమని కోరగా, ఆ కోర్కె ననుసరించి శివుడు అక్కడ మహా కాళేశ్వరుడనే పేరున జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి ఆరాధింపబడుతున్నాడు.
ఓంకారేశ్వర లింగం
నర్మదా కావేరీ పవిత్ర సంగమ ప్రదేశంలో సజ్జన సంరక్షణే ధ్యేయంగా మహేశ్వరుడు మాంధాతృపురంలో వసంతంలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగంగా వెలసి పూజింపబడుతున్నాడు.
శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం
కర్మ పరిపాకం వలన విష్ణుమూర్తి ఒకసారి ధర్ముడనే వానికి నర నారాయణులనే పేరుతో పుత్రద్వయంగా అవతరించాడు. నర నారాయణులిద్దరు ‘బదరికా’ వనంలో తపస్సు చేశారు. నిత్యం వారు పార్థివ లింగార్చన చేసేవారు. ఇద్దరూ విష్ణ్వంశ సంభూతులుగాన ఆరాధనా వేలకు రుద్రుడు ప్రత్యక్షమయ్యేవాడు. ఒకసారి వారి అర్చనానంతరం శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నారు. వారు ఆనందంతో ఆ తావున నిలిచి వుండమని కోరారు. నర నారాయణుల కోరిక మేరకు హిమ శిఖరాగ్రమున కేదార ఖండమున ‘కేదారేశ్వరుడు’ అనే పేరుతో నిలిచి జ్యోతిర్లింగమై వెలసి పూజలందుకుంటున్నాడు.
వాంఛలను తీర్చే స్వామి.
భీమేశ్వర జ్యోతిర్లింగం
పురాణాల్లో సుదక్షిణా - కామరూపేశ్వరులు సంపూర్ణ శివభక్తులు. నిత్య శివారాధకులు. కాల ప్రభావం వలన వారు చెరసాల పాలై, పరస్పరం సాయం చేసుకుంటూ అనుదినమూ పార్థివ లింగార్చన చేసేవారు. ఆ రాజ్యంలోని దండ నాయకుడది చూసి భయపడి రాజుకు విన్నవించాడు. రాజు వచ్చి ఆగ్రహంతో మట్టి కుప్పగా వున్న ఆ పార్థివ లింగాన్ని తన ఖడ్గంతో ఒక్క వేటు వేశాడు. వెంటనే విచ్ఛిన్నమైన ఆ మృత్పిండం నుండి శివుడు ఉద్భవించాడు. రాజు భీమాసురుని గాంచి ‘్భమాసురా! భక్త రక్షణే నా వ్రతం, ఆశయం - రూపం అంటూ ఒక్క హుంకారం చేశాడు. భీమాసురుడూ, వాడి సైన్యము శివాగ్నిలో బూడిదై పోయారు. పారిపోయే రాక్షసులను తరిమింది అగ్ని. అడవులూ, పర్వతాలు ఆక్రమించింది. కాలాంతరంలో ఓషధులుగా మారింది.
భక్తులైనను దక్షిణాకామ రూపుల సంరక్షణార్థం వెలసిన ఆ స్వామిని కొలువుండమని కోరగా, భీమేశ్వరుడనే పేర జ్యోతిర్లింగంగా వెలసి సమస్త బంధన విమోచకుడు అయినాడు పరమశివుడు.
శ్రీ విశే్వశ్వరలింగం
సకల జీవులను ఉద్ధరించే నిమిత్తం ఏర్పరచిన ప్రాంతం కాశీ క్షేత్రం. పంచక్రోశాత్మకమైనది పాపనాశి. ఇక్కడ ఒకప్పుడు విష్ణుమూర్తి ఆశ్చర్యంతో తలపంకించగా ఆయన కర్ణకుండలాలున్న మణి తృళ్ళిపడిందట. ఆ మణిపడ్డ ప్రాంతం మణికర్ణికా ఘట్టంగా ప్రసిద్ధమైనది కాశీలో. కాశీ వరుణ, అసి నదుల సంగంగాన వారణాసిగా నామం స్థిరపడింది. సదాశివుడు తానే ఒక లింగాన్ని స్వయంగా ప్రతిష్టించి కాశీని విడవరాదని శాసించాడు. ఆ కారణంగా ఆ లింగం అవి ముక్తేశ్వరుడుగానూ, కాశీ అవిముక్తంగానూ పిలువబడుతున్నాయి. ‘కర్మణాం కర్షణాచ్చైవ - కాశీతి పరిపఠ్యతే’ అని నానుడి. ప్రకృతి పురుషులిద్దరూ ఆదిదంపతులై తమ జననీ జనకులు చాలాకాలంపాటు కాంచలేక చింతించసాగారు. శివవాణి వారిని తపస్సు చేయమన్నది. తగిన తావునిమ్మని కోరగా శివతేజస్సారము ఐదు క్రోసులు పొడవు, 5 క్రోసులు వెడల్పు గల ప్రదేశాన్ని నిర్మించి సుందర నగరంగానూ, మలచి పంపడం జరిగింది. పురుషుడైన శ్రీహరి అక్కడే తపస్సు చేశాడు. ఆ తపోలింగమే కాశీని అలరించినది. నాటి నుండి ప్రపంచ జీవుల పాపాలను నశింపచేస్తూ ‘కాశీ’ క్షేత్రం ప్రఖ్యాతి వహించినది. ఇది ముక్తి క్షేత్రం.
త్య్రంబకేశ్వర లింగం
పరోపకారం కొఱకు గౌతమమహర్షి బ్రహ్మగిరి మీద భార్య అహల్యతో కలిసి తపస్సు చేస్తుండగా వంద సంవత్సరాలు కరువు సంభవించింది. వానలు లేక పంటలు లేవు. జనులు అపమృత్యువు పాలైనారు. గౌతముడి మనస్సు కరుణతో నిండింది. వరుణుడి కోసం తపస్సు చేశాడు. వరుణుడు ప్రత్యక్షమైనాడు. శివేచ్ఛాపరంగా సాగే ప్రకృతిని నిరోధించరాదనీ, వర్షించడం తప్ప మరేదైనా వరం కోరుకోమనగా కరువు రోజులలో దాహార్తిని తీర్చమన్నాడు. ఒక గుంట త్రవ్వమన్నాడు వరుండు. గౌతముడు తవ్విన గుంటను దివ్యజలంతో పూరించాడు. అది అక్షయ తీర్థమైనది. పిదప గౌతమ శిష్యులకూ, మునుల భార్యలకూ మధ్య వివాదం చెలరేగింది. గౌతమ శిష్యులు విషయాన్ని అహల్యకు విన్నవించారు. ఆమె వచ్చి ముని భార్యలను మందలించి కావల్సిన జలాన్ని తానే కొనిపోయింది. మునుల భార్యలు అవమానంగా భావించి భర్తలకు తెలుపగా మునులు గౌతముడికి కీడు తలపెట్టి గణపతిని ఆరాధించారు. గణపతి ఆవు రూపంలో వచ్చి గౌతముని చేలో ధాన్యాన్ని మేశాడు. గౌతముడు చూసి నాలుగు గడ్డిపరకలను ఆవుపై కోపంతో విసరగా ఆ మాయా గోవు మరణించింది. బ్రహ్మ హత్యాపాతకానికి ప్రాయశ్చిత్తంగా ఋషులు గౌతముని బ్రహ్మగిరికి 11 ప్రదక్షిణలు చేయమన్నారు.
దివ్యకుండంలో స్నానం చేసి కోటి పార్థివ లింగార్చనలు చేశాడు. శివుడు ప్రత్యక్షమైనాడు. అహల్యా గౌతములు ప్రార్థించారు ఆది దంపతులను. గంగను అనుగ్రహించమని కోరారు. వెంటనే అఖండ గంగ అతివ రూపంలో కన్పించి గౌతమీ - గోదావరిగా పేరొంది, ఆగామవైవ స్వతమన్వంతరంలోని 28వ కలియుగం వరకూ భూమి యందుండమని శివుడు శాసించగా, ఆమె ఓరకంటితో చూసి నువ్వు నా తీరంలో సౌందర్య రూపుడవై వెలసి వుండాలని కోరింది. సరేనన్నాడు. ఈ విషయం తెలిసి దేవతలు వచ్చి శివ పార్వతులను ఏకకాలంలో ఆరాధించారు. గౌతముడు దర్భకొనతో చేసిన గుండమేకు శావర్తం అయింది. శివుడు త్య్రంబకేశ్వరుని లింగరూపంలో వెలసినాడు. గౌతమీ నామంతో నదిగా వర్థిల్లి, గోదావరిగా ప్రసిద్ధి చెందింది.
వైద్యనాథేశ్వర లింగం
రావణాసురుడు శివభక్తులలో గొప్పవాడు. ఒకసారి కైలాస పర్వతానికి వెళ్లి ఒక సిద్ధి స్థానాన్ని ఎన్నుకొని, అక్కడ చెట్టు నీడలో అగ్నిగుండం పేర్చుకొన్నాడు. దగ్గరలో శివలింగం స్థాపించాడు. శివపంచాక్షరితో యజ్ఞం చేస్తున్నాడు. శివుడు కరుణించలేదు. కోపంతో రావణాసురుడు (మిగతా 13వ పేజీలో)

ద్వాదశ జ్యోతిర్లింగ వైభవం
(7వ పేజీ తరువాయ)
అగ్నికుండంలో ఒక్కొక్క తలనీ ఆహుతి చేయసాగాడు. తొమ్మిది తలలను ఆహుతి చేసి, 10వ తలను ఆహుతి చేయబోగా శివుడు ప్రత్యక్షమై తెగిన తలలన్నిటినీ తిరిగి వచ్చేలా చేశాడు. సాటిలేని బలాన్ని వరంగా ఇచ్చాడు. తృప్తిలేని రావణాసురుడు శివుని లంకకు రమ్మన్నాడు. అంగీకరించిన హరుడు లింగాన్ని సృష్టించి ఇచ్చి, రావణా ఇది చేతులలోనే ధరించాలి. పొరపాటున మరే ప్రదేశంలో ఉంచినా అక్కడే స్థాపితవౌతుంది. ఇదెక్కడ ఉంటే నేను ఉన్నట్లే లెక్క. ఇంత గొప్ప లింగం ఎవరికీ ఇవ్వలేదు. జాగ్రత్త అని చెప్పి వెళ్లాడు. ఆనందంతో లింగాన్ని తీసికొని పయనమైనాడు. లఘుశంక ఏర్పడితే, దూరంగా వున్న పశువుల కాపరిగా ఉన్న పిల్లవానిని పిలిచి లింగాన్ని ఇచ్చాడు. తను వచ్చేదాకా పట్టుకోమనీ, ఎక్కడా పెట్టవద్దనీ చెప్పి వెళ్లాడు. శివలింగాన్ని మోయలేని ఆ పామర బాలకుడు ఆ లింగాన్ని అక్కడే దించాడు. అది భూస్థాపితమైంది. రావణుడు వచ్చి ఇరవై చేతులతో పెళ్లగించబోయాడు. అది వీలు కాలేదు. ఇంటి ముఖం పట్టాడు రావణాసురుడు. అంతటి శివలింగం పశువుల కాపరి చేత ప్రతిష్ఠింపబడినది గాన భారతదేశం వదలి వెళ్లలేక వైద్యనాథేశ్వర నామంతో స్వదేశంలోనే స్థిరపడి ఆరాధింపబడుతున్నాడు.
నాగేశ్వర జ్యోతిర్లింగం
పూర్వం దారుక - దారుకుడనే రాక్షస దంపతులుండేవారు. దారుక దేవీ భక్తురాలు. పశ్చిమ సముద్ర తీరంలోని అడవుల్లోకి వచ్చేలా పార్వతి అనుగ్రహించింది. ఆ దంపతులిద్దరు ఆ ప్రాంతం వారిని హింసించేవారు. అక్కడి ప్రజలు ‘ఔర్వముని’ని ఆశ్రయించారు. ఆ ముని కరుణించి ఇది మొదలు జనులు ఉన్న భూమిపై జన పీడ చేసే రాక్షసులు అక్కడికక్కడే మరణిస్తారని శపించాడు. రాక్షసుల బలం తగ్గింది. దేవతలు సాయుధులై రాక్షసులతో రణానికి భూమిపైకి వచ్చారు. దారుఖ దంపతులు దేవీ వరబలంతో అడవిని సముద్ర మధ్యానికి కొనిపోయి నీటిలో స్థాపించారు. ముని శాపం వల్ల భూమిపైకి వెళ్లే వీలులేని రాక్షసులు సముద్ర యాత్రికులపై పడి పీడింపసాగారు. చంపసాగారు. కొందరిని బంధించారు. బంధితులలో సుప్రియుడనే శైవుడున్నాడు. శివారాధనను మానేవాడు కాదు. అందరినీ ప్రోత్సహించాడు. శివుడు సంతృప్తి చెందాడు. రాక్షసుడు శివారాధకులపై దమనకాండకు దిగగా వారు శివుని రక్షణ కోరారు. వెంటనే నాలుగు ద్వారాలు గల ఆ ప్రాంగణంలో జ్యోతిర్లింగం కనపడింది. సుప్రియుడు అర్చించాడు. అందులో నుండి శివుడు వచ్చి రాక్షసులను చంపి, భక్తులను కాపాడాడు. ఇకపై ఈ దారుకా వనం వర్ణాశ్రమ ధర్మాలతో వర్థిల్లుతుందని వరమిచ్చి ‘నాగేశ్వరుడ’నే పేరుతో జ్యోతిర్లింగాన్ని అర్చించిన వారికి రాచరికం సిద్ధిస్తుందని చెప్పాడు. ఆ యుగాంతంలో వీరసేనుడనే రాజు శివభక్తుడై ఆ లింగాన్ని ఆరాధించి, పాశుపతవిదుడై దారుకా వంశాన్ని నాశనం చేశాడు. ఆ వీరసేనుని కుమారుడే నల చక్రవర్తి. ఇది నాగేశ్వర జ్యోతిర్లింగ చరితము.
శ్రీరామేశ్వర లింగం
రావణ వధార్థమై విష్ణువు త్రేతాయుగంలో రాముడిగా మానవావతారం దాల్చినాడు. సీతను పెండ్లాడి వన వాసానికి పయనమై తనతో సీతను తీసికొని వెళ్లినాడు. రావణుడు వనం నుండి సీతను అపహరించి లంకా నగరానికి కొనిపోయినాడు. రాముడు యుద్ధం ప్రకటించాడు. లంకా నగరం ఎలా వెళ్లాలా అని ఆలోచించాడు. శివార్చనే తరుణోపాయంగా భావించి ఆ సముద్రతీరాన పార్థివ లింగార్చన చేశాడు. శివుడు కరుణించి వరం కోరుకోమన్నాడు. కోరినవన్నీ ఇచ్చాడు. శ్రీరాముని అనుగ్రహించి కోరిక మేరకు స్థిరపడమన్నాడు శివుని. శివుడక్కడ ‘రామేశ్వరుడ’నే పేరున జ్యోతిర్లింగమై ఆవిర్భవించాడు. ప్రయాగ నుండి గంగాజలం తెచ్చి రామేశ్వర లింగాన్ని అర్చిస్తే జీవన్ముక్తులౌతారని శివుడు అనుగ్రహించాడు. భక్తులకైనా, అమరులకైనా లభించని భోగభాగ్యాలు లభిస్తాయని పరమేశ్వరుడే ప్రకటించాడు.
శ్రీ ఘుశే్మశ్వర లింగం
భారతదేశ దక్షిణ దిశలో దేవగిరి పర్వతం ఉంది. అక్కడికి దగ్గరలో సంపన్న గ్రామంలో సుధర్ముడు అనే విప్రుడున్నాడు. భార్య సుదేహ. వారికి సంతానం లేదు. సుదేహ తన చెల్లెలు ‘ఘుశ్మ’ను ఇచ్చి భర్తకు మారు మనువు చేసింది. ఘుశ్మ శివభక్తురాలు. ప్రతి దినం 101 పార్థివ లింగాలను అర్చించేది. గర్భం దాల్చింది. కుమారుని కన్నది. గ్రామస్థులు సుదేహను గొడ్రాలు అని నిందించేవారు. సుదేహ చెల్లెలి పుత్రుని పట్ల అసూయ పెంచుకున్నది. పిల్లవానికి యుక్త వయసు రాగానే తగిన కన్యతో పెండ్లి చేశారు. సుదేహ ఈర్ష్యగా వున్నప్పటికీ కొడుకు కోడలు సుదేహను గౌరవించేవారు. సుదేహ ఒకరోజు రాత్రి కుమారుని చంపింది. ఆ శరీరాన్ని ఖండాలుగా చేసి మూటగట్టి తీసికొని వెళ్లి ఘుశ్మ - పార్థివ లింకాలను పడవేసే కూపంలోకి విసిరేసి ఏమీ తెలియనట్లు ఇల్లు చేరింది.
ఘుశ్మ పార్థివ లింగార్చనలో పడింది. వంట గదికి సుదేహ వెళ్లి చూస్తే మాంసపు ఖండాలు కనిపించాయి. కోడలు దిగులు పడింది. దుఃఖించి అత్తగారినీ మామగారినీ ఆశ్రయించింది. శివలాంగారాధనను పూర్తిచేసి అత్తగారు మధ్యాహ్నం వేళ లింగాలను రోజూ నిక్షిప్తం చేసే బావిలో పెట్టి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో చెరువుగట్టున మరణించిన కుమారుడు సజీవుడై కన్పించాడు. ఆశ్చర్యపడింది. శివుని ప్రార్థించింది. శివుడు దర్శనమిచ్చాడు. వరం కోరుకోమన్నాడు. ఘుశ్మ తన పేరున అక్కడ వెలసి వుండమన్నది. దీవిచి వెంటనే ‘ఘుశే్మశ్వరుడ’నే పేరున జ్యోతిర్లింగంగా వెలిశాడు. లింగాలతో నిండిన కుండం ‘శివాలయం’ అనే పేరున పుష్కరిణిగా మారింది.
శివపురాణం ఆధారంగా ద్వాదశ జ్యోతిర్లింగాలుగా పరమేశ్వరుడు ప్రపంచానికి అందించిన మహిమల చరితం, జ్యోతిర్లింగాల దర్శనం - ఆరాధనం - శ్రవణం - భక్తిముక్తి దాయకాలు. పరమేశ్వర అనుగ్రహ ఆశీస్సులు.
‘ఓం నమశ్శివాయః’

-పి.వి.సీతారామమూర్తి 9490386015